ఉత్తరాఖండ్ తగలబడుతోంది!

Publish Date:May 4, 2016

Advertisement

 

ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలన గురించి ఓ పక్క దేశమంతా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయమై న్యాయస్థానాలు ఏమంటున్నాయి, నేతలు ఏమని తిట్టుకుంటున్నారు అని అంతా గమనిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది పెద్దగా పట్టించుకోని విషయం... అక్కడి అడవులు తగలబడటం! అడవులలో మంటలు చెలరేగడం కొత్తేమీ కాదు. కార్చిచ్చులు ప్రకృతిలో అతి సహజమైన పరిణామం. కానీ ఈసారి ఉత్తరాఖండ్‌లో చెలరేగుతున్న మంటల వెనుక కారణాలను పరిశీలిస్తే... ఆ మంటల్లో మనిషి నిలువెత్తు స్వార్థం కనిపిస్తుంది.

 

ఏటా రుతుపవనాలకు ముందుగా ఉత్తరాఖండ్‌ అడవులలో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే వచ్చేవి. కానీ గత రెండేళ్లుగా వర్షపాతం సరిగా లేకపోవడంతో ఇక్కడి అడవులలో ఉన్న దేవదారు వృక్షాలలో తేమశాతం తగ్గిపోయింది. ఉత్తరాఖండ్‌ అడవులలో ఇప్పుడు ఎటు చూసినా అలాంటి దేవదారు వృక్షాలే కనిపిస్తూ ఉంటాయి. దేవదారు ఆకులు చాలా కోసుగా ఉండి వెంటనే నిప్పంటుకుంటాయి. దేవదారు కలప నిప్పుకి నిలువెల్లా తగలబడిపోతుంది. ఇప్పుడు ఈ దేవదారు చెట్లే ఉత్తరాఖండ్‌ కొంప ముంచాయి. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు! ఉత్తరాఖండ్‌ అడవుల నిండా నానారకాల వృక్షజాతులన్నీ ఉండేవి. వాటిలో వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లు, తేమ ఎక్కువ శాతాన్ని నిలువ చేసుకునే చెట్లు... మంటలని నిలువరించేవి. కానీ ఏళ్లు గడిచేకొద్దీ ఖరీదైన కలపని ఇచ్చే దేవదారు చెట్లను ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం మొదలుపెట్టారు అక్కడి జనం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 16 శాతం ఈ దేవదారు చెట్లే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

ఒకప్పుడు అడవులు తగలబడితే అక్కడికి దగ్గర్లో ఉన్న గ్రామస్తులకి కాస్తో కూస్తో లాభం ఉండేది. ఆ కలపని తెచ్చుకుని వంట చెరుకు కోసం ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు అడవులు తగలబడటం కోసం కాచుకు కూర్చునేవారు చాలామందే తయారయ్యారు. అటవీ శాఖ నుంచి తగలబడిన కలపను కొనుక్కునేందుకు కలప వ్యాపారస్తులు సిద్ధంగా ఉంటారు. మరోపక్క  అడవులు తగలబడిపోయిన తరువాత మిగిలిన భూమిని ఆక్రమించుకునేందుకు భూకబ్జాదారులు ఎదురుచూస్తుంటారు. వీరితో చేతులు కలిపితే తమకి ఎంతో కొంత లాభం కలుగకపోతుందా అని స్థానిక గ్రామస్తులు కూడా ఆశపడుతుంటారు. ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఉత్తరాఖండ్‌లో అడవులు తగలబడిపోవడం వెనుక ఇలాంటి దురుద్దేశాలు ఉన్నాయన్నది ఓ అనుమానం. ఆ అనుమానాన్ని బలపరుస్తూ కొన్నిచోట్ల నిప్పంటించేందుకు ప్రయత్నిస్తున్న ఆగంతకులని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

 

మూడు నెలలుగా ఎడతెరపి లేకుండా ఎగసిపడుతున్న ఈ అగ్నికీలలను అదుపు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ దళాలు సైతం మంటలను ఆర్పేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్యలలో పావు వంతైనా, మంటలు మొదలవక ముందే తీసుకుని ఉంటే ఉపయోగం ఉండేదన్నది పర్యావరణవేత్తల ఆరోపణ. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దేవదారు వృక్షాలను నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోవడం; మంటలు త్వరత్వరగా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం; తగినంతమంది అటవీ సిబ్బందిని నియమించడం; స్థానికులలో పర్యావరణ స్పృహ పెంపొందించడం; మంటలకు కారణమైనవారిమీద కఠిన చర్యలను తీసుకోకపోవడం.... ఇలా ఒకటి కాదు రెండు కాదు... ప్రభుత్వం తరఫు నుంచి వైఫల్యాలు చాలానే కనిపిస్తున్నాయి.

 

ఉత్తరాఖండ్‌ కార్చిచ్చు వల్ల దాదాపు రెండు వేల హెక్టార్లకు పైగా అడవుల బూడిదపాలయ్యాయి. ఈ మంట్లలో కనీసం ఏడుగురన్నా చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇది కేవలం కనిపించే నష్టం మాత్రమే! ఈ కార్చిచ్చుల వల్ల కనిపించని నష్టం అపారమన్నది విశ్లేషకుల మాట.

 

- మంటల నుంచి వ్యాపించే నుసి, హిమానీనదాల (గ్లేసియర్స్‌) మీద పేరుకోవడం వల్ల, అవి త్వరత్వరగా కరిగిపోతాయంటున్నారు పర్యావరణవేత్తలు.

 

- ఉత్తరాఖండ్‌గుండా ప్రవహించే గంగ, యమున వంటి నదులు ఈ కార్చిచ్చుల వల్ల పూర్తిగా కలుషితం అయిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

 

- ఈ కార్చిచ్చుల వల్ల వేలాదిగా పక్షులు, జంతువులు, చెట్లు అంతరించిపోయాయని అంచనా. వీటిలో కొన్ని అరుదైన జాతివి కూడా ఉండి ఉంటాయి.

 

- తీవ్రస్థాయిలో మంటలు చెలరేగడం వల్ల ఉత్తరభారతంలో ఉష్ణోగ్రతలు కనీసం 0.2 డిగ్రీలు పెరిగి ఉంటాయని  అంచనా. మనుషుల మీద ఈ ఉష్ణోగ్రత పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ పర్యావరణం మీద ఈ కాస్త మార్పు కూడా తప్రక ప్రభావం చూపుతుంది.

 

- ఈ మంటలు ఉత్తరాఖండ్‌లోని దాదాపు 70 శాతం అడవులను కాల్చి వేశాయంటున్నారు. శతాబ్దాలు, దశాబ్దాల తరబడి పెరిగిన ఈ అడవులు తిరిగి సాధారణ రూపుకి రావాలంటే మరిన్ని శతాబ్దాలు, దశాబ్దాలు పట్టక మానదు.
ఇదీ ఉత్తరాఖండ్‌లో ఏర్పడిన రావణకాష్టం తాలూకు విషాదగాథ. మనిషి నిర్లక్ష్యానికీ, స్వార్థానికీ చెంపపెట్టులా కనిపించే ఈ ఉదాహరణ ఇకనైనా మనకు ఓ గుణపాఠంలా గుర్తుండిపోతుందని ఆశిద్దాం. అడవులను నాశనం చేసుకోవడం అంటే మన కాళ్లని మనమే నరుక్కోవడం అన్న నిజాన్ని గుర్తిద్దాం!

 

వృక్షో రక్షతి రక్షితః

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.