నిండుకుంటున్న అమెరికా ఆయుధ నిల్వలు.!

Publish Date:Aug 9, 2026

Advertisement

ఇరాన్‌ యుద్ధం అమెరికాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. అగ్రరాజ్యం ఇరాన్  యుద్ధం కారణంగా ఇటు ఆర్థికంగానూ, అటే ఆయుధ నిల్వల పరంగానూ కూడా సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఇరాన్ యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యాన్నిదారుణంగా దెబ్బ తీసింది. ఈ యుద్ధం కారణంగా  అమెరికా అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలు, వ్యూహాత్మక ఆయుధాలను  భారీగా ఉపయోగించాల్సి రావడంతో.. ఆ దేశం వద్ద  ఉన్న ప్రధాన క్షిపణి నిల్వలు నిండుకుంటున్నాయి. అమెరికా రక్షణ సామర్థ్యానికి వెన్నెముకగా నిలిచే  ఇంటర్‌సెప్టర్లు ఖాళీ అయిపోయాయి. ఇది ఆ దేశాన్ని ఆందోళన కు గురి చేస్తోంది.  అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్ ఇందుకు సంబంధించి  సంచలన విషయాలను బయటపెట్టారు. ఇరాన్‌ పై  యుద్ధ చర్యల కారణంగా  అమెరికా ఆయుధాగారంలో  పేట్రియాట్, థాడ్ వంటి మిస్సైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ల సంఖ్య  కనిష్ట స్థాయికి పడిపోయిందని ఓ ఇంటర్వ్యేలో వెల్లడించారు.  ఆయుధ నిల్వల క్షీణత కారణంగా   ప్రపంచంలో ఎదురయ్యే ఇతర రక్షణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే   సంసిద్ధత అమెరికాకు లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు.  

ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం  అమలు చేసిన స్ట్రాటజిక్ విధానాలు,  ఉక్రెయిన్ పోరుకు భారీగా ఆయుధ సహాయం అందించడం,  ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలపై   ప్రభావం చూపాయన్న  మార్క్ ఎస్పర్.. ఈ   ఆయుధ కొరత అమెరికాను  బలహీనపరుస్తోందనీ,  అదే సమయంలో ఈ పరిస్థితి చైనా వంటి దేశాలకు   తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.  అదలా ఉంటే.. ఒక్క పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని నిర్మించడానికి  రెండేళ్ల సమయం పడుతుంది. అందువల్ల ప్రభుత్వం ఎన్ని అత్యవసర నిధులు విడుదల చేసినప్పటికీ..   ఆయుధ కొరతను అధిగమించడం అమెరికాకు ఇప్పటికిప్పుడు సాధ్యపడే పరిస్థితి లేదు. 

పశ్చిమాసియా యుద్ధంలో  పేట్రియాట్, థాడ్ వ్యవస్థలు  క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను నిరోధించడానికి పేట్రియాట్ వ్యవస్థ ఉపయోగపడుతుండగా, బాలిస్టిక్ క్షిపణులను అంతరిక్ష సరిహద్దుల్లోనే  కూల్చివేసేందుకు థాడ్ డిఫెన్స్ సిస్టమ్ దోహదం చేస్తున్ననది. ఇరాన్  వరుస మిస్సైల్ దాడుల నుంచి తమ స్థావరాలను, మిత్రదేశాలను కాపాడుకోవడానికి అమెరికా వీటిపైనే ఎక్కువగా ఆధారపడింది.  ఇప్పుడు వాటి నిల్వలే దాదాపు అడుగంటి పోవడంపై అగ్రరాజ్యంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

క్షీణిస్తున్న ఆయుధ నిల్వలను పునరుద్ధరించడానికి పెంటగాన్ అదనంగా 67 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ ప్రతిపాదించగా,  దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ క్రిస్ మర్ఫీ అయితే..  ఇప్పటికే త  టోమాహాక్, ఇంటర్‌సెప్టర్ క్షిపణులను దాదాపుగా వాడేశామని, ఇరాన్‌తో యుద్ధం ముగిసే వరకు ఇక అదనపు సైనిక నిధులను ఆమోదించడం కరెక్ట్ కాదంటున్నారు. అయితే.. రిపబ్లికన్ సెనేటర్ జిమ్ బ్యాంక్స్  ప్రభుత్వం అనుసరిస్తున్న ఇరాన్ విధానాలకు మద్దతు,. ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రాధాన లక్ష్యమంటూ.. అందుకు సైనిక చర్యలు అనివార్యమన్నారు. మొత్తానికి ఇరాన్ తో యుద్ధం అమెరికాను చిక్కుల్లో పడేసిందని చెప్పక తప్పదు. 

US Iran War, Patriot Missile System, THAAD Interceptors, Mark Esper Defense, Pentagon Weapons Shortage

By
en-us Political News

  
దేశంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులపై పార్లమెంటరీ సంఘం ఆందోళన..!
సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ ప్రజల జీవితాలను, వ్యాపార ఆశయాలను ఎలా మారుస్తుందో తెలుసుకోండి. వోడాఫోన్ సర్వేలోని కీలక గణాంకాలు, విజయావకాశాలు మరియు ఎదురవుతున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.
పెళ్లైన ఆరు నెలల్లోనే విషాదం..!
ఆస్ట్రేలియా సెన్సస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 11 సెన్సస్ నైట్ తేదీ, నిబంధనలు, AU$364 జరిమానాలు, ఎవరు అర్హులు మరియు హెల్ప్‌లైన్ సమాచారం ఇక్కడ చూడండి.
జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..!
లీప్ ఇండియా ఐపీఓ LEAP India IPO బిడ్డింగ్ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం GMP , ఐపీఓ ధర, లిస్టింగ్ తేదీలు మరియు విశ్లేషకుల సబ్‌స్క్రైబ్ రేటింగ్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరారోపణలు, బర్త్ టూరిజం, $5 మిలియన్ల ఆర్థిక స్కామ్‌లు మరియు సోషల్ మీడియా పోస్టులే ప్రధాన కారణంగా వీసాల వేటు పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఉన్న సంచలనాత్మక లంచం మరియు మోసం కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపూర్ణ కథనం కోసం చదవండి!
విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగస్టు 11న దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలతో సహా ప్రధాన నగరాల్లో 24K, 22K మరియు 18K బంగారం లేటెస్ట్ రేట్లు ఎంత పెరిగాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.