ఉరసా ఎకరం 99 పైసలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం..లోకేశ్ సవాల్

Publish Date:May 27, 2025

Advertisement

 

ఊరాసాకు ఎకరం 99 పైసలకే ఇచ్చినట్టు నిలిపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్  సవాల్ విసిరారు. కడప నగరంలో పబ్బాపురం లే ఔట్ లో నిర్వహించిన మహానాడు మొదటి రోజు కార్యక్రమంలో  మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం లోకేష్ మహానాడు ప్రాంగాణంలోని  మీడియా పాయింట్ లో విలేకరులతో చిట్ లో పాల్గొన్నారు. . తదుపరి సీఎం మీరే గా అన్న మీడియా ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందన్నారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు, ఆయన ఇంకా యువ నాయకుడే అన్నారు.  దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు. అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదన్నారు. 

క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే  వాస్తవాలు తెలుస్తాయన్నారు. దివంగత టీడీపీ నేత వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెలితే  పోగాకు రైతుల సమస్యలు తెలిశాయని, వెంటనే అధికారులకు మంత్రుల బృందానికి అప్రమత్తం చేశామన్నారు. పార్టీకి నిరంతరం ఫీడ్ బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణ అన్నారు. క్రింది స్థాయి అభిప్రాయాల పై నిరంతర చర్చ జరగాలని, పార్టీ బలంగా వుండాలని, సంస్థాగతంగా  బాగుండాలని లోకేష్ విలేకరులతో నిర్వహించిన చిట్ చాట్ లో పేర్కొన్నారు. ఉరసా సంస్థకు 99 పైసలకుఎకరా భూమి ఇచ్చినట్లు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా వున్నానని  నారా లోకేష్ సవాల్ చేశారు. కడప నగరంలో నిర్వహించిన  మహానాడు సందర్భంగా విలేకరులతో చిట్ చాట్ గా మాట్లాడుతూ టీసీఎస్ కు 99 పైసలకు ఇచ్చామని, ఉరసాకు మార్కెట్ ధరకే  భూములు ఇచ్చామన్నారు. 

విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక విశాఖ నగరాన్ని అందుకోలేమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. మద్యం కుంభకోణంలో జగన్ వైఖరి దొంగే  ... దొంగ దొంగ అనట్లు వుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి  పరిశ్రమలు వస్తాయే కానీ ఒక్కటి కూడ బయటకు పోదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవడానికి రాష్ట్రంలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం లేదన్నారు. పార్టీ తరపున  బాధ్యత అప్పగించినా  నిర్వహిస్తానని తెలిపారు.  పార్టీ కోసం కష్టపడిన అందరికీ పదవులు వస్తాయని, పదవులు రాలేదని నేతలు అలకబూనడం మానేయాలని హితవు పలికారు. తాను విద్యాశాఖ మంత్రి అయ్యాక రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడ మూత వేయలేదన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నాయకులు కళ్లు తెరిచి చూడాలన్నారు.

By
en-us Political News

  
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.