మహానాడుకు బాలయ్య గైర్హాజరుపై అనవసర రచ్చ

Publish Date:May 31, 2025

Advertisement

తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికతో సందడి నెలకొంది. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడుకు హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. బాలయ్య రాకపోవడంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  రాయలసీమ గడ్డపై నిర్వహించిన మహానాడులో పార్టీ నేతలు, కార్యకర్తల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు మహానాడు వేదికగా  నిర్వహించిన కార్యక్రమంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు..  ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చివరి రోజు భారీ బహిరంగసభ నిర్వహించారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది.

కడప మహానాడులో నందమూరి వారసులు కనిపించని లోటు స్పష్టంగా కనిపించిందని తెలుగు తమ్ముళ్లు సైతం చర్చించుకుంటున్నారు. తొలిసారిగా కడప జిల్లాలో నిర్వహించిన మహానాడులో బాలకృష్ణ సందడి కనిపించకపోవడం పెద్ద లోటే అంటున్నారు. చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన తొలి మహానాడు గ్రాండ్ సక్సెస్‌ అయింది. దిగ్విజయంగా మహానాడు జరిగితే బాలయ్య ఎక్కడ అని ప్రాంగణంలో టీడీపీ శ్రేణులు వెతుక్కోవడం కనిపించింది. ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలయ్య హిందూపురంలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.

ఎన్టీఆర్‌కి వారసులుగా హరికృష్ణ, బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు. ఆ నందమూరి వారసులు  ఇద్దరూ దాదాపు ప్రతి మహానాడులో పాల్గొన్నారు. హరికృష్ణ మరణించిన తర్వాత బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో యాక్టివ్‌ రోల్ పోషిస్తున్నారు. ఇక హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ఎప్పటి నుంచో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ నిర్వహించే మహానాడు పార్టీ శ్రేణులకు పెద్ద పండుగలాంటిది. మూడురోజులపాటు పండగలా నిర్వహించే కార్యక్రమంలో బాలకృష్ణలో ఎప్పుడు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండేవారు. 

ఎన్టీఆర్ కి కుమారుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వియ్యంకుడిగా లోకేష్‌కి మామగా ఉన్న బాలయ్య అంతటి ప్రాధాన్యత కలిగిన మహానాడుకు హాజరు కాకపోవడం టీడీపీ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచిందంట. అంతే కాదు బాలయ్య హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దాంతో బాలయ్య ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఆయన విదేశాలలో షూటింగ్ నిమిత్తం ఉండడంవల్లే మహానాడుకు హాజరుకాలేదు. 
బాలయ్య అఖండ 2 మూవీ షూటింగ్‌ కోసం జార్జియా వెళ్లారని.. అక్కడ బిజీ షెడ్యూల్ కారణంగానే మహానాడుకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ముందుగా ఫిక్స్‌ అయిన షెడ్యూల్‌ కారణంగానే బాలకృష్ణ సినిమా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందనేది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. విదేశాల్లో షూటింగ్‌ పనుల వల్లనే మహానాడుకు దూరం ఉండాల్సి వచ్చింది తప్ప...  వేరే కారణాలు లేవని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 : తాండవం మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కారణంగా బాలయ్య బిజీగా ఉన్నారంట. సమయం దొరికినప్పుడు హిందూపురం నియోజకవర్గానికి వెళుతున్నారు. అంతేకాదు నందమూరి బాలకృష్ణకు ఇటీవల పద్మభూషణ్ అవార్డు వచ్చింది.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం హిందూపురంలో భారీ పౌర సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ తర్వాత బాలయ్య మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లారు. అక్కడ షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా మహానాడుకు రాలేకపోయారు.  దీనిపై వైసీపీ నేతలు అనవరంగా రచ్చ చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. 

By
en-us Political News

  
ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆహ్మదాబాద్ వేదికగా మంగళవారం (జూన్ 3)న జరిగిన ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల ఆధిక్యతతో గెలిచి విజేతగా నిలిచింది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్.. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మధుర ఫలం మామిడిని పండించే రైతు ధర లేక కుదేలవుతున్నాడు. ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వాన్నంగా ఉండడంతో ఢీలా డ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడి కి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది
తెలంగాణలో కరోనా కలకలం సష్టించున్నాయి. రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్ బెంగళూరుతోో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
చాలా మంది జ‌గ‌న్ అనేవాడు. చాలా చాలా బాధ ప‌డుతున్నాడు. నీర‌సించి పోయాడు..అస్స‌లు డ‌బ్బులు లేవంట‌ క‌నీసం ఆఫీసు రెంటు కూడా క‌ట్ట‌లేక పోతున్నాడంట‌..అని తీవ్ర నిరాశా నిస్పృహ‌ల‌తో అల‌మ‌టించిపోతున్నారుగానీ.. జ‌గ‌న్ ప‌రిస్థితి అలాగేం లేదు.
ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది.
ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు.
ఎట్ట‌కేల‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచార‌ణ చేయ‌డానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అంటే గ‌త 14 నెల‌లుగా అమెరికాలో ఉన్న ప్ర‌భాక‌ర్ రావు వ్య‌వ‌హారం, ఎన్నో మ‌లుపుల మీద మ‌లుపులు తిరిగి, ఆయ‌న ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ వ‌చ్చే వ‌ర‌కూ సాగింది.
ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3) సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.