వైసీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం.. చంద్ర నిప్పులు

Publish Date:Oct 19, 2022

Advertisement

జగన్ భయపడి 2024లో గాని, ముందు ఎన్నికలు జరిపినా, వైసిపిని ప్రజలను భూస్థాపితం చేస్తా రు, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నాడు. తెలంగాణ మీటర్లు పెట్టడం లేదు. ఎక్కడా లేని ఈ అతితెలివి నీకే ఎందుకు వచ్చింది జగన్, ఈ అతి తెలివి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా రాష్ట్రం లో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నా జీవితంలో దాపరికం లేదు, అందుకే అన్ స్టాపబుల్ లో అన్ని వివరిం చాను,  రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేవరకు విశ్రమించనన్నారు. జగన్ పాలనలో బిసిలు, ఎస్సిలు, ముస్లింలు సహా అందరూ దెబ్బతిన్నారు. ప్రజల అప్పులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు అప్పులు పెంచే ప్రభుత్వం మనకు అవసరమా రాష్ట్రాన్ని కాపాడుకుందాం...అందరూ సహక రించాలని కోరుతున్నా న‌న్నారు.

అస‌త్యాలు చెప్ప‌డంలో జ‌గ‌న్ దిట్ట‌, రైతుల‌ను ఆదుకోవాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు లేనే లేద‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయ‌కుడు ఎద్దేవా చేశారు. ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నాదెండ్ల గ్రామంలో ప్ర‌తిపంట రైతుల‌ను బాబు క‌లిసి వారి క‌ష్టాలు విన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.50 లక్షల ఎకరాల్లో మిరప పంటల సాగు ఉంది. మిరప, ప్రత్తి పంటలకు ఇప్పటికే ఎకరా నికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు.తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టడం లేదా అన్నారు. రైతాంగానికి అంత ఇచ్చాం,ఇంత ఇచ్చాం అంటూ ప్ర‌చారం చేసుకోవ‌డ‌మే త‌ప్ప వాస్త‌వానికి రైతుల‌ను ఆదుకోవ‌డానికి జ‌గ‌న్ ఏమీ చేయ‌లేద‌ న్నారు. రైతుల‌కు ఇంత న‌ష్టం జ‌రిగితే అధికారులుగాని, ఎమ్మెల్యేగానీ రాలేద‌ని, రైతుల‌కు మేలు చేసే సీఎం రావాల‌న్నారు. అస‌లు రైతుల‌కు ఏమి ఇచ్చారో ప్ర‌తిగ్రామంలో బోర్డు పెట్టాల‌ని రైతుల‌కు క‌ట్టాల్సిన పంట‌ల భీమా డ‌బ్బులు కూడా క‌ట్ట‌ని ప్ర‌భుత్వం ఇది అంటూ బాబు మండి ప‌డ్డారు. 
 
జ‌గ‌న్ ఎక్క‌డ కాలుపెడితే అక్క‌డ మ‌టాష్‌, ఆయ‌న సీఎం అయిన త‌ర్వాత గుంటూరు జిల్లాలో ఆత్మ‌హ‌త్య లు పెరిగాయ‌ని, ఆయ‌న పాల‌న‌లో మూడువేల‌మంది రైతులు ఆత్మ‌హత్య చేసుకున్నార‌ని, ఈ విష‌యం లో మాత్రం రాష్ట్రం మూడో స్థానంలో ఉంద‌ని బాబు అన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతులు మన రాష్ట్ర రైతులే. రైతులపై తలసరి అప్పు 2.45 లక్షలు గా ఉందన్నారు. 

మన మీద కేసులు పెడితే ఏమవుతుంది. పవన్ కళ్యాన్ పార్టీ వారి పైనా కేసులు పెట్టారు. అందుకే నేను వెళ్లి సంఘీభావం తెలియజేశాను. మాపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ద రైతులను ఆదుకోవడంపై పెట్టాలి గత ఏడాది మిర్చికి తామర పురుగువచ్చి పంట పోతే ఒక్కరైనా వచ్చి చూశారా, జగన్ రెడ్డి పాలన వల్ల రైతులు అంతా నాశనం అయ్యారన్నారు. 

భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరా పత్తికి 30 వేలు, ప్రతి ఎకరా మిరపకు 50 వేల పరిహారం ఇవ్వాలి. మైక్రో ఇరిగేషన్ ద్వారా 90శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత టిడిపి దే. టిడిపి హయాంలో 60 వేల కోట్లు ఇరి గేషన్ పై ఖర్చు పెడితే, ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. జగన్ ఎక్కడ నుంచి వచ్చాడని, రైతు కుటుంబం నుంచి రాలేదా,  అమరావతి రైతులను హేళన చేస్తా రా....కార్లు, బంగారం అని హేళన చేస్తారా అని చంద్ర‌బాబు ఆగ్ర‌హించారు. 

పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా అని ప్ర‌శ్నించారు. మీ దోపిడీ, కబ్జాలు బయటపడ తాయనే  పవన్ను అడ్డుకున్నారా అని బాబు ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి సైకో అనుకుం టే...ఆయన కొత్త సైకోలను తయారు చేస్తున్నారని, అమరావతి కి వెళ్లేటప్పుడు నా కాన్వాయ్ పై దాడి చేస్తే ప్రజాస్వామ్యం అనడం దారుణ‌మ‌న్నారు. పవన్ రాజకీయ పార్టీ వేరే కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కోసం వెళ్లి తాను మద్ద తు ఇచ్చాన‌న్నారు.రాజకీయ పార్టీలకే దిక్కులేకపోతే, ఇక ప్రజల సంగతి ఏంటని, త‌ప్పుడు ఆరోపణ లకు సిఎం సమాధానం చెప్పాల‌న్నారు.

టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది దాటినా ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి  చర్యలు లేవు, దీనికి  డిజిపి సమాధానం చెప్పగలరా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు, దాడు లకు తాను భయపడనన్నారు. వివేకా హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అన్నారు. నాడు వివేకా హత్యపై జగన్ సిబిఐ దర్యాప్తు కావాలి అన్నారు...తరువాత సిఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు వద్దు అన్నారు. కన్న కూతురుగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతను అభినందించాలని, సిబిఐ దర్యా ప్తు చేస్తుంటే వారిపైనే కేసులు పెట్ట‌డం ఎక్క‌డ‌యినా ఉంటుందా అని బాబు ప్ర‌శ్నించారు. 

By
en-us Political News

  
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.