సందేహం లేదు తెలుగుదేశం భావి నేత లోకేషే!

Publish Date:Jan 24, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా అవసరం లేని చర్చ జోరుగా సాగుతోంది. ఎలాంటి హేతువూ లేకుండానే తెలుగుదేశం, జనసేన శ్రేణులు నేతల మధ్య పోటాపోటీ ప్రకటనలు వెలువడుతున్నాయి. రెండు పార్టీలూ పొత్తులో ఉన్నాయి సందేహం లేదు. పొత్తులో ఉండటమంటే రెండూ ఒకే పార్టీ అని కాదు. ఎవరి పార్టీ వారిదే. కానీ రెండు పార్టీలూ సమన్వయంతో పని చేసుకుంటాయి. ఒక పార్టీ నిర్ణయంతో రెండో పార్టీకి సంబంధం ఉండదు. కానీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విషయంలో  జనసేనలో అభద్రత, తెలుగుదేశంలో జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం నారా లోకేష్ కు ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం నుంచి వచ్చిన డిమాండ్. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వారికి నచ్చిన డిమాండ్ చేయవచ్చు. అది తెలుగుదేశం సొంత వ్యవహారం. ఇక ప్రభుత్వంలో మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడం అన్న విషయానికి వస్తే డిమాండ్లు, ఖండనల గురించి పట్టించుకోవలసిన అవసరమే లేదు. ఆ విషయంపై ఇరు పార్టీల అధినేతలూ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అన్నిటికీ మించి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ప్రమోషన్ అన్న విషయంలో ఇరు పార్టీల అధినేతల స్పందన సెన్సిబుల్ గా ఉ:ది. తమతమ పార్టీల నేతలు, శ్రేణులకు ఆ విషయంపై నోరెత్తవద్దన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు  తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ భవిష్యత్ నాయకుడు అన్న చర్చ ఆరంభమైంది. ఇది కూడా అనవసరమే. ఎవరైనా సరే ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం తెలుగుదేశం నేతలు, శ్రేణులకే కాదు, మొత్తం అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశంలో చంద్రబాబు తరువాత ఆ స్థాయి ఉన్న నేత లోకేష్ వినా మరొకరు కనిపించరు. సహజంగానే మీడియా అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం నేతలంతా పార్టీ భవిష్యత్ నేత నారా లోకేష్ అనే చెబుతారు.

మంత్రి అచ్చెన్నాయుడు కూడా  అదే సమాధానం చెప్పారు. ఆయన ఇంకొంచం గట్టిగా, ఘాటుగా అసలీ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో చంటి పిల్లాడిని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు అంటూ భవిష్యత్ లో తెలుగుదేశం సారథి నారా లోకేషే అని స్పష్టంగా చెప్పేశారు.  అయితే నారా లోకేష్ కు పార్టీలో, ప్రజలలో ఈ గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి ఆయన నారా చంద్రబాబు కుమారుడు కావడం ఎంత మాత్రం కాదు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలోకి అడుగు పెట్టినా, స్వయంకృషితో ఆయన అంచలంచలుగా ఎదిగారు. లోకేష్ తనను తాను ప్రజా నాయకుడిగా మలచుకున్న తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. 

వాస్తవానికి ఆయన రాజకీయాలలో తొలి అడుగు వేయకముందే.. ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. ఆహారం, ఆహార్యం, భాష నుంచి ప్రతి విషయంలోనూ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అటువంటి విమర్శలను ఎదుర్కొని తన సత్తాను చాటారు నారా లోకేష్. స్పష్టంగా చెప్పాలంటే వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం నారా లోకేష్ .  పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.   టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి, పడిన శ్రమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకుని.. పార్టీని విజయతీరాలకు నడిపించిన నాయకుడు నారోలోకేష్. యువగళం పాదయాత్ర తరువాత  నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ  ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి.

అందుకే  తెలుగుదేశం భవిష్యత్ నేతగా  పార్టీలో భిన్నాభిప్రాయం అన్నదే లేదు.  తెలుగుదేశం పార్టీ భవిష్యత్ సీఎం అభ్యర్థి నారా లోకేషే అని పార్టీ సీనియర్ నేతలే ప్రకటిస్తున్నారంటే ఆయన నాయ కత్వానికి ఎంతగా మద్దతు ఉందో ఇట్టే అవగతమైపోతుంది.  నారా లోకేష్ లో మాస్ లీడర్ తో పాటు, మేధావులు, విద్యావంతులను ఆకట్టుకోగలిగే విషయ పరిజ్ణానం కూడా మెండుగా ఉంది. అందేకే తెలుగుదేశం భవిష్యత్ నేత నారా లోకేష్ అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. తండ్రికి తగ్గ తనయుడిగా, ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడిగా అశేష ప్రజానీకమే ఆయనను అంగీకరిస్తున్నారు. దటీజ్ లోకేష్.   

By
en-us Political News

  
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.