ఎట్టకేలకు మీడియా ముందుకు ఉండవల్లి... జగన్ కు సూచనలు-హెచ్చరికలు

Publish Date:Oct 2, 2019

Advertisement

 

చంద్రబాబు హయాంతో మాటిమాటికీ మీడియా ముందుకొచ్చి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా మీడియా ముందుకు ఎందుకు రాలేదంటూ అనేక విమర్శలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకవైపు ఇసుక విధానం ఆలస్యం... మరోవైపు ఇసుక కొరత కారణంగా దాదాపు 50లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడి అల్లాడిపోతుంటే... ఈ మేధావి ఎందుకు మీడియా ముందుకొచ్చి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని నిలదీసినవాళ్లున్నారు. రివర్స్ టెండరింగ్, పీపీఏల సమీక్ష, పోలవరం ప్రాజెక్టు వివాదం, రాజధాని అమరావతి గొడవ, విద్యుత్ కోతలు, ఆశావర్కర్ల ఆందోళనలు, రాజకీయ వేధింపులు... ఇలా వంద రోజుల్లో వందకు పైగా అరాచకాలు చేశారంటూ ఒకపక్క విపక్షాలు... మరోపక్క ప్రజలు గగ్గోలు పెడుతుంటే... ఈ మేధావి అసలెందుకు ఒక్క చిన్న ప్రెస్ మీట్ పెట్టి తన వాయిస్ ఎందుకు వినిపించలేదని ఎంతోమంది ప్రశ్నించారు. చివరికి ఉండవల్లిపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా సర్క్యులేట్ అయ్యాయి. మరి ఇవన్నీ ఉండవల్లికి చేరాయో లేదో తెలియదు గానీ మొత్తానికి జగన్ పరిపాలనపై తన ఫస్ట్ రియాక్షన్ బయటపెట్టారు.

జగన్ పాలనపై ఇప్పటివరకు పొగిడేందుకు గాని.... తిట్టేందుకు కానీ ఏమీ లేదంటూ సేఫ్ సైడ్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, అలాగని అంతా బాగుందని చెప్పడానికి కూడా లేదంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. అయితే, ఇసుక కొరత, విద్యుత్ కోతలు జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయని అన్నారు. ఇక, నవరత్నాల అమలులో ఏ చిన్న తేడా వచ్చినా తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. పీవీ, ఎన్టీఆర్ కూడా 50శాతానికి పైగా ఓట్లతో ముఖ్యమంత్రులైనా తొమ్మిదే తొమ్మిది నెలల్లో దిగిపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను హెచ్చరించారు. ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి... తమ మాటను వింటున్నారనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలగాలన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు. 

ఇక, ఇసుక కొరత, విద్యుత్ కోతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్న ఉండవల్లి... కారణాలు ఏమైనప్పటికీ ప్రజలకు అవసరం లేదని, అంతిమంగా ఫలితమే ముఖ్యమన్నారు. అలాగే, నవరత్నాల్లో ఏ ఒక్కటి అమలు జరగకపోయినా సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమన్నారు. ఇక, ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవస్థలు సరిగా లేవన్న ఉండవల్లి... ముందు వాటిని సరిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. మొత్తానికి కొంత బ్యాలెన్స్ డ్ గా ఉండవల్లి తన ఫస్ట్ రియాక్షన్ ను బయటపెట్టారు. ఒకపక్క సూచనలు ఇస్తూనే... మరోపక్క హెచ్చరించారు.

By
en-us Political News

  
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.