Publish Date:Dec 25, 2025
కొండంత రాగం తీసి కూసింత పాట పడిన సామెతలా తయారైంది కర్ణాటక అధికార మార్పు వ్యవహారం. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయిన సందర్భంగా డీకే శివకుమార్ తనకు సీఎం పీఠం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. అధిష్టానం ఓకే అంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏ విషయం త్వరగా తేల్చండని సీఎం సిద్దరామయ్య సైతం అన్నారు. ఈ నాన్చుడు ధోరణి ప్రభావం పాలనపై పడకూడదని సిద్దరామయ్య చెప్పారు.
కొంత కాలం పాటు బెంగళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్రత్యేక ఎపిసోడ్లు నడిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెషల్ మెసేజీలు పెట్టారు. కట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా కర్ణాటకలో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ కర్ణాటక భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో డీకే విలేకరులు సంక్రాంతి తర్వాత చర్చలు ఉంటాయట నిజమేనా అని అడిగారు. దీనికి డీకే ఒకింత అసహనం, మరింత ఘాటు కలగలిపిన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం మార్పునకు సంబంధించిన చర్చలు మీడియాలో తప్ప మా మధ్య జరగడం లేదన్న డీకే.. అక్కడితో ఆగకుండా, అన్ని విషయాలు చెప్పుకునేవి కావని కూడా వ్యాఖ్యానించారు. దీంతో కర్నా టక సీఎం మార్పు వ్యవహారం ముగిసిపోయిందా? అన్నచర్చ జోరందుకుంది.
దానికి తోడు డీకే మరి కొన్ని కీలకమైన కామెంట్లు కూడా చేశారు. తనకు అధికారం కన్నాకాంగ్రెస్ కార్యకర్తగా ఉండటమే ఎక్కువ ఇంట్రస్టన్నారు. 80వ దశకం నుంచీ తానిలాగే హ్యాపీగా ఉన్నానన్నారు. తామంతా అంటే, డీకే, సిద్ధూ, ఇతర కార్యకర్తలందరం కలసి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావడానికి కృషి చేశామనీ.. అలాగని అధికారంలో భాగస్వామ్యం కావాలని తాను కోరుకోవడం లేదని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి రాహుల్ రాగానే ఆయన్ను వెళ్లి ఇబ్బంది పెట్టలేనని కూడా ముక్తాయించారు.
దీనంతటిని బట్టిచూస్తే డీకే తన తరఫు అటెంప్ట్ లు అన్నీచేసి ఫలితం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ పరమైన ఆటంకాలేంటని చూస్తే సిద్ధూని తొలగిస్తే ఒక సమస్య. ఆయన వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా సామాజిక వర్గాలు పార్టీపట్ల వ్యతిరేకతను పెంచుకుంటాయి. ఇక డీకేని నిర్లక్ష్యం చేస్తే.. కష్టపడ్డ వారికి అందలం దక్కదన్న సంకేతం వెళ్తుంది. దీంతో అధిష్టానం కూడా సందిగ్దావస్థలో ఉన్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/un-ending-karnataka-cm-change-episode-25-211528.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది