Publish Date:Jul 19, 2022
కుక్కలకు మనిషికి స్నేహబంధం అనాదిగా వుంది. పెంపుడు కుక్కకు యజమానిపట్ల ఉండే విధేయతకు గొప్ప సాక్ష్యం కేథరినా త్యోవా కుటుంబమే. రష్యా దళాలు ఉక్రెయిన్పై దాడులు జరిపిన పుడు త్యోవా కుటుంబం కూలిపోయిన ఇంటిని విడిచి దూరంగా వెళ్లవలసి వచ్చింది. నాలుగు నెలల తర్వాత యుద్ధవాతావరణం తగ్గేసరికి తిరిగి వచ్చింది. చిత్రంగా వారి పెంపుడు కుక్క వారి కోసం ఆ శిధిలాల వద్దే ఎదురుచూస్తూ కనపడింది.
ఉత్తర ఉక్రెయిన్ లోని కీలక విమానాశ్రయం వున్న హోస్తోమెల్పై రష్యా దాడి చేసింది. ఆ పట్టణంలో 35 సంవత్సరాల బంగారం వ్యాపారి త్యోవా ఆమె కుటుంబం భయపడి పట్టణం విడిచి వెళ్లాలనుకున్నారు. ఆమె తన భర్త అలెగ్జాండర్, ఇద్దరు పిల్లలతో వెళి పోయారు. కానీ వారు ఆ భయాందోళనల్లో వారి పెంపుడు కుక్క సైబేరియన్ హస్కీని వదిలేశారు. ఎంత నిర్దాక్షిణ్యంగా వదిలే శారు.. అనుకోవచ్చు. అయినా వారికి అది తప్పని పరిస్థితి. కానీ హస్కీ తప్పకుండా తమ కోసం ఎదురుచూస్తుంటుందని త్యోవా నమ్మింది. కానీ వారికి ఆ తర్వాత నుంచి తెలిసిన వార్తల అనుసరించి వారి ప్రాంతం అంతా రాళ్ల గుట్టలుగా మారిందని. దాంతో త్యోవాకు హస్కీ గురించిన బెంగ పట్టుకుంది. మధ్య ఉక్రెయిన్ ప్రాంతంలోని వినిత్సాలో తమ స్నేహితుల ఇంట్లో త్యోవా కుటుంబం తలదాచుకుంది.
తొమ్మిదేళ్ల హస్కీ మాత్రం అక్కడే ఆ శిధిలాలమధ్య తిరుగుతూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అటూ ఇటూ చూస్తూ, రాళ్లమధ్య దొరికినది తింటూ రోడ్డుమీదకి వస్తూ పోతూ బేలగా చూస్తూ నాలుగు నెలల గడిపింది. నాలుగు నెలల తర్వాత ఆ మధ్య త్యోవా కుటుంబం తన పట్టణానికి వచ్చింది. ఆమెకు ముందుగా సగం కూలిన ఇల్లు కాకుండా హస్కీ బతికే వుందో లేదో చూడాలని ఇంటివేపు కూతురుతో పాటు పరుగులు తీసింది. కొద్దిదూరంలో హస్కీ తన యజమానురాలు రావడం చూసి పరుగు పరుగున వెళ్లి కాళ్లను చుట్టేసింది. దాని ఆనందానికి అంతేలేదు. త్యోవాకు గుండె భారం తగ్గింది. అమాంతం దాన్ని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తింది. త్యోతా ఐదేళ్ల కూతురు తజిసియా అయితే హస్కీని ఎత్తుకుని పరుగులు తీసింది, ఆడింది, దాని తోక లాగి హస్కీ ఆటపట్టించింది. హస్కీ మాత్రం తజిసియా పాదాలు నాకి నన్నొదలద్దన్నది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ukraine-family-met-their-dog-25-140045.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.