రాజన్న బిడ్డల వారసత్వ పోటీ .. నెగ్గేదెవరో?!

Publish Date:Jan 1, 2024

Advertisement

వారసత్వం సహజం అనేలా మారిపోయింది ప్రస్తుత రాజకీయాలలో. ఇక్కడా అక్కడా అని లేకుండా మన దేశమంతా ఈ వారసత్వపు రాజకీయాలు మనకి కనిపిస్తున్నవే. అయితే ఇది దక్షణాదిలో అందునా మన తెలుగు రాష్ట్రాలలో కొంచెం ఎక్కువగా, ఇంకొంచం  స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ  వారసత్వపు పునాదులపైనే నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు దేశం పార్టీలో ప్రస్తుతానికైతే వారసత్వపు పోరు లేదు. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సారధ్యం వహిస్తుండగా.. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇదే పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ వారసత్వానికి, చంద్రబాబు వారసత్వానికి కూడా ఇప్పుడు ఎలాంటి పోటీ లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీతో విభేదించి సోంత కుంపటి గా వైసీపీ  పెట్టుకున్నారు. వైసీపీ వైఎస్ జగన్ కు చెందిన సొంత కంపెనీ. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, వైఎస్ఆర్ వారసత్వానికి మాత్రం పోటీ ఉంది.  జగన్ మోహన్ రెడ్డితో పాటు  వైఎస్ఆర్ తనయ షర్మిల కూడా వైఎస్ బ్రాండుకు వారసులుగా ఉన్నారు.

గత ఎన్నికల సమయంలో జగన్, షర్మిల ఇద్దరూ వైసీపీలో ఉండడంతో ఈ వారసత్వం కోసం పోటీ కనిపించలేదు. వైసీపీ అనే పొలిటికల్ కంపెనీలో షర్మిల ఒక ఉద్యోగిగా చేరి.. ఆమె బాధ్యత నిర్వహించి బయటకొచ్చేశారు. ఇంకా చెప్పాలంటే అధినేత కష్టకాలంలో ఉండగా షర్మిల వారసురాలిగా బాధ్యత తీసుకున్నారు. కానీ, కష్టం పోయి మంచి రోజులు వచ్చాక అదే వారసురాలిని బయటకి తరిమేశారు. దీంతో షర్మిల వైఎస్ఆర్ వారసురాలిగా అదే బ్రాండ్ తో తెలంగాణలో మరో బ్రాంచి ఓపెన్ చేసుకున్నారు. కానీ, అక్కడా ఆ బ్రాంచ్ వృద్ధిలోకి రాకుండా సొంతవారే అడ్డుతగులుతుండడంతో ఇప్పుడు షర్మిల అసలు సిసలైన వైఎస్ఆర్ వారసురాలిని నేనే అంటూ తిరిగి తన తండ్రి పనిచేసిన కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ వారసత్వానికి పోటీ నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ వారసత్వం కోసం ఆయన కుమారుడు, కుమార్తె తలపడుతున్నారు. పోటీ పడుతున్నారు.  

వైఎస్ వార‌స‌త్వం అనే వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కీల‌క మ‌లుపు తిప్పేలా కఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో వన్ అండ్ ఓన్లీగా జగన్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సుడిగా చెలామణి అయ్యారు. అయితే ఇప్పుడు ఆయ‌న సోద‌రి ష‌ర్మిలే ఆయనకు పోటీ వస్తున్నారు. తాను కూడా వైఎస్ బిడ్డ‌నేన‌ని, తాను కూడా ఆయన రాజ‌కీయ వార‌సురాలినేని అంటూ ప్ర‌చారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందునా  తండ్రి చివరి శ్వాస వరకూ పనిచేసిన పార్టీ కాంగ్రెస్ నుంచి అన్నతో తలపడడానికి రెడీ కావడం షర్మిలకు మరింత అడ్వాంటేజ్గా మారింది. అప్పుడు వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు, తెచ్చిన పాలసీలు, కట్టిన ప్రాజెక్టులు అన్నీ చెప్పుకొనేందుకు షర్మిలకు అవకాశం దక్కనుంది. తన తండ్రి వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ అని గర్వంగా చెప్పుకొనేందుకు షర్మిలకు ఎలాంటి అడ్డంకులు లేవు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే వైఎస్ఆర్ కలలను సాకారం చేస్తుందని.. అసలు సిసలైన రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పుకొనేందుకు షర్మిలకు ఆస్కారం ఉంది.

రాజకీయాలలో కుమారుడు, కుమార్తెల వారసత్వంలో ఎలాంటి తేడాలు ఉండవు. వారసుడంటే కేవలం కుమారుడు మాత్రమే కాదు.. కుమార్తెలకు కూడా హక్కు ఉంటుంది. కనుక తన తండ్రికి గుర్తింపునిచ్చిన పార్టీలో ఉన్న వారికే ఈ వారసత్వంపై ఎక్కువ హక్కు ఉంటుంది. ఆ మాటకొస్తే వైసీపీకి వైఎస్ఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆయన ఆశయాల ఆధారంగానే పుట్టిన పార్టీగా మాత్రమే చెప్పుకుంటారు. కానీ  వైఎస్ఆర్ ది కాంగ్రెస్ తో విడదీయరాని బంధం. కనుక ఇప్పుడు షర్మిల అప్పుడు తండ్రి కాంగ్రెస్ లో ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు అదే స్థానంలో కూర్చుంటే ఆమెనే అసలు సిసలైన వారసురాలిగా భావించాల్సి వస్తుంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డికి  ఎదుర్కోవడం కఠిన పరీక్షగానే మారుతుంది. ఇప్పటికే నాలుగున్నరేళ్ల పాలనలొ జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  వైఎస్ బ్రాండ్ ను దాదాపుగా ఆయన పార్టీలో  కనిపించకుండా చేసేశారు. ఇప్పుడు తన తండ్రి పేరు చెప్పుకుని కాంగ్రెస్ తరఫున షర్మిల రంగంలోకి దిగితే  జగన్ ను కఠిన పరీక్షే అవుతుందనడంలో సందేహం లేదు.  ఇప్పుడు వైఎస్   వారసత్వ  పోటీ లో ప్రజలు ఎవరిని గుర్తిస్తారు? ఎవరిని ఆదరిస్తా రన్నది చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.