యాదవ్ ఓ సీరియల్ రేపిస్ట్ టాక్సీ డ్రైవర్

Publish Date:Dec 12, 2014

Advertisement

 

ఇటీవల డిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీస్ (టాక్సీ సర్వీస్) కు చెందిన శివ కుమార్ యాదవ్ అనే టాక్సీ డ్రవర్ ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ఉద్యోగిని ఇంటికి తీసుకువెళుతూ మార్గమద్యంలో కారులో ఆమెపై అత్యాచారం చేసిన తరువాత పోలీసులు అతనిని అరెస్ట్ చేసి లోపల వేశారు. ఆ తరువాత అతని భారిన పడిన మరికొంత మంది మహిళలు కూడా ముందుకు వచ్చి పిర్యాదులు చేయడంతో అతనొక పాత నేరస్తుడేననే విషయం బయటపడింది.

 

డిల్లీకి సమీపంలో గల రామ్ నగర్ అనే ఒక మురికివాడలో తన ఇంట్లోనే చిన్న పాన్ షాపు నడుపుకొనే 46 ఏళ్ల మహిళపై కూడా అతను కొన్నేళ్ళ క్రితం అత్యాచారం చేసాడు. ఒకే వీధిలో ఉంటున్నందున చనువుగా ఆమెను పిన్ని అని సంభోదిస్తుండేవాడు. కానీ ఒకరోజు ఆ పిన్నినే ఆమె ఇంట్లోనే చెరిచాడు. అయితే నలుగురికి తెలిస్తే తలవంపులని ఆమె భర్త ఈ విషయాన్నీ ఎవరికీ తెలియనీయలేదు. కానీ ఎలాగో అందరికీ తెలిసిపోయింది. అయితే అత్యాచారం చేసిన శివకుమార్ యాదవ్ ను జనాలు ఏమీ అనలేదు కానీ ఆమెను మాత్రం కాకుల్లా పొడుస్తూ చిత్ర హింసలు పెట్టారని ఆమె కన్నీళ్ళు పెట్టుకొంది. ఆ తరువాత 2003లో అతను అదే వీధిలోగల మరొక యువతిని కూడా చెరిచాడు. అయితే ఆమెకు కూడా వీధిలో జనాల నుండి అటువంటి చేదు అనుభవాలే ఎదురవడంతో ఆమె చేసేదేమీ లేక ఆ వీధిని విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది.

 

ఆ తరువాత 2011లో గుర్ గావ్ లో ఒక బార్ డ్యాన్సర్ ని కూడా శివకుమార్ రేప్ చేసాడు. అప్పుడు ఆమె పోలీసు కేసు పెడితే దాదాపు ఏడు నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తరువాత ఆమెతో ఏదోవిధంగా కోర్టు బయట సెటిల్ మెంట్ చేసుకొని జైల్లో నుండి బయట పడ్డాడు. ఆ తరువాత అతను ఆగస్ట్ 2013లో రామ్ నగర్ సమీపంలో గల నాగ్లతార్ అనే ప్రాంతంలో నివసిస్తున్న ఒక 15ఏళ్ల బాలికను తుపాకీ చూపి అత్యాచారం చేసాడు. వెంటనే ఆమె తల్లి తండ్రులు పోలీసులకి పిర్యాదు చేయకుండా ఆమెకు పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసేసి పంపించేసారు. ఆ తరువాత ఆమె భర్తకు ఆ సంగతి తెలిసినప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో శివకుమార్ యాదవ్ పై భార్య చేత పిర్యాదు చేయించే ప్రయత్నం చేసాడు. కానీ పోలీసులు పిర్యాదు తీసుకొనేందుకు అంగీకరించలేదు.

 

ఇంతవరకు ఇంతమంది మహిళల జీవితాలతో చెలగాటమాడుకొన్నప్పటికీ అతనికి ఎటువంటి శిక్షపడకపోవడమే బహుశః అతనికి ఆ దైర్యం కలిగించి ఉండవచ్చును. ఈసారి కూడా తప్పించుకోవచ్చుననే ధీమాతోనే అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసి ఉంటాడు. నిర్భయ కేసు జరిగినప్పుడు దేశమంతా ముక్త కంటంతో ఖండించింది. అప్పుడు కేంద్రం చట్టంలో కొన్ని కటినమయిన మార్పులు చేసింది. ఆ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా నెలకొల్పింది. కానీ ఇంతవరకు ఆ కేసులో నిందితులకు ఎటువంటి శిక్షాపడలేదు. పైగా ప్రభుత్వ ఖర్చులతో జైలులో కులాసాగా గడుపుతున్నారు. వారిలో ఒకరు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్నాడని ఆ మధ్యన వార్తలు వచ్చేయి. బహుశః చట్టం యొక్క ఈ బలహీనతే ఇటువంటి నేరస్తులకు దైర్యం కల్పిస్తోంది.

 

కటినమయిన నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ఆనాటి నుండే దేశంలో మహిళలు, బాలికలు చివరికి అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలపై ఇటువంటి మానవ మృగాలు అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. దానికి తోడు సమాజం కూడా భాదితురాలినే దోషిగా చూడటం వలన వారి మనోవేదన ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కారణంగా ఇటువంటి మానవ మృగాలు నేటికీ సమాజంలో విచ్చలవిడిగా తిరుగగలుగుతున్నాయి.

 

ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు కొలువయ్యి ఉంటారని పెద్దల మాట. అదే విధంగా కలకంటి కన్నీరు ఒలికిన చోట శాంతి ఉండదని మహాభారతం నిరూపిస్తోంది. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేరు ప్రజలు, ప్రభుత్వం, చట్టాలు కూడా. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో.. ఈ చట్టాలు ఆ మానవ మృగాలను ఎప్పటికి శిక్షించగలుగుతాయో...ఎవరికీ తెలియదు. కానీ అంతవరకు స్త్రీ జాతికి ఈ మనోవేదన అనుభవించక తప్పదు.

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.