Publish Date:Jul 14, 2022
ఏ దేశంలోనైనా గాయకుడు అనగానే చెవికోసుకునేవారు చాలామందే వుంటారు. అందులోనూ ఇటీవలి కాలంలో జానపద బాణీలపట్ల పిచ్చి ఎక్కువైంది. మరీ ముఖ్యంగా పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ అంటే పడిఛస్తున్నారు. అతని పాట అనగానే వయసుతో నిమిత్తంలేకుండా చిన్నా పెద్దా అంతా ఉర్రూతలూగుతారు. అంత క్రేజ్ వున్న గాయకుడు ఊహించని విధంగా మానవ అక్రమ రవాణా కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం.
పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ అప్పీల్ను పాటియాలా అదనపు సెషన్స్ జడ్జి తోసిపుచ్చింది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పాటియాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో అక్రమంగా వ్యక్తుల తరలింపు కేసులో ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీకి బెయిల్ వచ్చింది. ఈ నిర్ణయాన్ని దలేర్ మెహందీ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. గురువారం అదనపు సెషన్స్ జడ్జి దలేర్ మెహందీ అప్పీల్ను తిరస్కరించారు. 2003లో దలేర్ మెహందీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు అయింది. ప్రొబేషన్పై విడుదల చేయాలని ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. విదేశాల్లో పాటలు పాడేందుకు వెళ్లినపుడు తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాలపై ఆయా దేశా లకు తీసుకెళ్లి అక్కడే ఒదిలేసేవారు. ఇలా ఈయన పాటల ప్రోగ్రాం జరిగిన దేశాల్లోకి అక్రమంగా వ్యక్తులకు తీసుకెళ్లి అక్కడే ఒదలిపెట్టేవారు.
ఇందులో దలేర్ మెహందీతో పాటు ఆయన సోదరుడు షంషేర్ ప్రమేయం కూడా ఉందని తేలింది. ముఖ్యంగా విదేశాల్లో స్థిర పడా లనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. విదేశాల్లో ఒదిలి పెట్టి రావడానికి కొంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి తీసుకున్నట్లుగా పోలీసులు అభియోగం మోపడంతో పాటు సాక్ష్యాలతో సహా ఋజువు చేశారు. దీంతో ఆయన కోర్టు శిక్ష వేసింది.
2003లో సదర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. మెహందీ సోదరులు 1998, 1999లో రెండు సార్లు ఇలా చేసి నట్లుగా ఆరోపణలున్నాయి. ఆ సమయంలో పదిమందిని గ్రూప్లో సభ్యులుగా యుఎస్కు తీసుకెళ్లి అక్రమంగా వదిలిపెట్టారని ఆరోపించారు. మొదటి ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత.. గాయకుడిపై పోలీసులకు మరో 35 ఫిర్యాదులు అందాయి.
కొంతమంది ఫిర్యాదుదారుల ప్రకారం.. దలేర్ మెహందీ కొంత మంది వ్యక్తులను అక్రమంగా విదేశాలకు (ఎక్కువగా కెనడా, యుఎస్) పంపడానికి బదులుగా వారి నుంచి దాదాపు రూ. 12 లక్షలను తీసుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బుకు బదులుగా తన విదేశీ కార్యక్రమాలలో డ్యాన్స్ ట్రూప్లలో భాగంగా వారిని విదేశాలకు పంపుతానని వాగ్దానం చేసేవారు. దీని తరువాత, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని దలేర్ కార్యాలయంపై దాడి చేసి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న తరువాత పంజాబ్ పోలీసులకు దలేర్ మెహందీకి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-years-jail-to-singer-daler-39-139755.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.