నీళ్ల గొడవలో ఇద్దరు మృతి.. భద్రాద్రి జిల్లాలో దారుణం

Publish Date:Jun 24, 2021

Advertisement

భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలోనీ ఎస్సీ కాలనీలో గల తాగునీటి ట్యాంకు పంచాయతీ అధికారులు గత కొన్ని నెలలుగా శుభ్రం చేయలేదు. అసలే కరోనా టైం అలాగే వర్షాకాలం కూడా వచ్చింది. వర్షాకాలంలో కొత్త వైరుసులు వస్తాయని కనీస భాద్యత కూడా లేకుండా ప్రవర్తించారు అధికారులు. ఆ  కలుషితమైన నీరు త్రాగి గ్రామంలో ఇద్దరు మృతి చెందారు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ కాలనీలో విషజ్వరాలు రావడంతో త్రాగునీరు వలనే ఇలా జరిగిందని అనుమానం వచ్చి ట్యాంక్ పైకి గ్రామస్తులు ఎక్కి చూడగా, అడుగు భాగం మొత్తం బురదమయంతో ఉండి అపరిశుభ్రంగా ఉండటంతో ఖంగుతిన్నారు. గ్రామస్తులు రోజు ఈ నీరు త్రాగడం వలనే తమకు విషజ్వరాలు వచ్చాయని అధికారులు నిలదీయడంతో అధికారులు మిషన్ భగీరథ నీరు వలన ఇలా జరిగిందని తెలిపారు. గ్రామస్తులు ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మిషన్ భగీరథ నీరు వలన తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేవలం ట్యాంక్ శుభ్రం చేయకపోవడం వలనే తమకు విష జ్వరాలు వచ్చాయని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో వెంటనే అధికారులు తప్పు ఒప్పుకొని గ్రామస్తులకు సర్దిచెప్పి, వెంటనే నారాయణపురం గ్రామంలో ఉన్న అన్ని ట్యాంకులను శుభ్రం చేసి పరిశుభ్రమైన త్రాగునీరు అందించారు. ఇదే గ్రామానికి చెందిన నీరు త్రాగి వారం రోజుల వ్యవధిలో తుంగ కిట్టయ్య (30), వేల్పుల రాంబాబు (35) ఇద్దరు వ్యక్తులు కామెర్ల బారిన పడి మృతి చెందినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అనేకమంది గ్రామస్తులు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి పట్టణాల్లో ఉన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల సోమరితనం వల్లే ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు మాట్లాడు కుంటున్నారు. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుందంటే అధికారులను నిలదీయాలి నిలదీసి మన హక్కులను అడగాలి ఆడితే గాని మన సమస్యలు తీరవు. సో అందరు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. 

By
en-us Political News

  
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్క‌డ‌ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొన‌సాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. 
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
దెందులూరులో మరోసారి  వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా  చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.