ఎట్టకేలకు ఢిల్లీ డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఢిల్లీల్లో అదృశ్యమైన తెలుగు వైద్యులు సిక్కింలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాళ్లిద్దరిని ఇవాళ ఢిల్లీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అదృశ్యమైన ఈ 5 రోజులు ఏమైంది తెలుసుకునే క్రమంలో ఇవాళ విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిలీప్, హిమబిందు, ఆమె భర్త శ్రీధర్ ముగ్గురు కర్నూలు మెడికల్ కాలేజీ లోనే చదువుకున్నారు. హిమబిందు, శ్రీధర్ డిల్లీలో డాక్టర్లుగా ఉంటే దిలీప్ చండీగఢ్ లో పనిచేసేవాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన దిలీప్ ను డిసెంబర్ 25 న ట్రైన్ ఎక్కించేందుకు హిమబిందు వెళ్లింది. ఆ రోజు నుంచి నిన్నటి వరకు వాళ్లిద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. దీంతో హిమబిందు భర్త శ్రీధర్ కేసు పెట్టారు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న ఒక సీసీ ఫుటేజ్ తప్ప కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారం లేదు.
మరోవైపు సంచలనం రేపిన మిస్సింగ్ మిస్టరీని చేధించాలని ఢిల్లీ ఎయిమ్స్ కూడా కేంద్ర హోంశాఖను కోరింది. ఇద్దరిలో ఒకరి ఫోన్ కూడా పనిచేయటం లేదు.. రెండు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు కేసు ఒక సవాల్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఎటైన వెళ్లారా అనే కోణంలో మొదటి దర్యాప్తు మొదలైంది. కానీ వాళ్ళ ఎకౌంట్స్ నుంచి రూపాయి కూడా ట్రాన్జాక్షన్ జరగలేదు. ఎక్కడా కార్డ్ స్వైప్ కాలేదు, టికెట్లు కొన్నట్టు ఆధారాలు లభించలేదు. ఒకవేళ క్యాష్ ట్రాన్జక్షన్ చేశారని భావించిన వారి వద్ద అంత నగదు లేదని భర్తనే చెప్పాడు. ప్రేమ వ్యవహారం కారణం కావచ్చని పోలీసులు భావించారు.. కానీ ఆధారాలే లేవు. ఒకవేళ ప్రేమ వ్యవహారం కాకుంటే ట్రాఫికింగ్ ముఠాల పని ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానించారు. కానీ ఇప్పుడు దిలీప్ ఏమై ఉంటాడో అనే ప్రశ్న వెంటాడింది. ఎవరైనా దిలీప్ కు హాని చేసి హిమబిందును తీసుకు వెళ్ళారా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచించారు. ఇలా ఎన్నో అనుమానాల మధ్య ఢిల్లీ పోలీసులు మిస్సింగ్ కేసును దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ లో ఇద్దరి చేతుల్లో బ్యాగేజ్ ఉంది. అది ఒకరిదా ఇద్దరూ సర్దుకొని వెళ్లారా అనే కోణంలో గాలించారు. అంతిమంగా వాళ్లు వాడిన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎట్టకేలకు గుర్తించారు. హిమబిందు, దిలీప్ లో సిక్కింలో ఉన్నట్టు పసిగట్టారు. ఇవాళ వాళ్ళను ఢిల్లీ తీసుకొచ్చి ఇన్నాళ్లు ఏమైపోయారో తేల్చేయబోతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-missing-delhi-doctors-found-in-sikkim-25-92790.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.