కాకాణి ఫైల్స్ చోరీ కేసు.. సీబీఐకి ఇస్తే ఇరుక్కుంటారా?

Publish Date:Apr 27, 2022

Advertisement

వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు ఫైల్స్ చోరీ ఘటనపై దర్యాప్తు అధికారం సీబీఐకి ఇస్తే ఎవరు ఇరుక్కుంటారనే చర్చ ఏపీలో జరుగుతోంది. నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ, కాకాణిపై ఫోర్జరీ కేసుల దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని హైకోర్టు అనడంతో ఒక్కసారిగా పలువురి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని పత్రాలను ఆయన కోర్టుకు సమర్పించారు. అయితే.. కాకాణి సమర్పించిన పత్రాలు ఫోర్జరీవని ఆయనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసు పెట్టారు. మొత్తం ఈ కేసులను సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం ఏమైనా ఉందా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించినప్పుడు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో ఈ కేసులతో ప్రమేయం ఉన్న పలువురు అధికారులు, రాజకీయ నేతల్లో అలజడి రేగిందంటున్నారు.

ఈ కేసును దర్యాప్తు చేసి, అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీని హైకోర్టు నిర్దేశించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

నెల్లూరు కోర్టులో ఉన్న ఫైల్స్ చోరీ అయ్యాయని ముందుగా ఒప్పంద బెంచ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడం గుర్తుంచుకోవాల్సి అంశం. అయితే.. క్లర్కు చోరీ అయినట్లు చెప్పిన ఫైల్స్ అసలు కోర్టు ఆధీనంలోనే లేవని, అవి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని హైకోర్టుకు నివేదిక సమర్పించడం సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులతో బెంచి క్లర్కు నాగేశ్వరరావు కుమ్మక్కై కట్టుకథ అల్లాడని, పత్రాలు చోరీ అయ్యాయని కోర్టును తప్పదారి పట్టించాడని ఆ నివేదికలో జస్టిస్ యామిని పేర్కొనడం గమనించదగ్గ అంశం. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని తన నివేదికలో జస్టిస్ యామిని హైకోర్టుకు విన్నవించారు. నెల్లూరు కోర్టు ప్రాంగణంలోని డ్రైనేజిలో ఏప్రిల్ 14న దొరికిన ప్రాపర్టీ నగర నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించిన ప్రాపర్టీయే కాదని జస్టిస్ యామిని తన నివేదికలో చెప్పడం విశేషం.

నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. కోర్టులో ఉన్న పత్రాలు చోరీ అయ్యాయని కాంట్రాక్ట్ బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందనే అనుమానం తెరమీదకు వస్తోంది. అలా పత్రాలు పోయాయంటూ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడం వెనక ఎవరున్నారు? అనే ప్రశ్న కూడా దూసుకు వస్తోంది. అసలు కోర్టులోనే లేని పత్రాలు పోయాయని ఎందుకు ఫిర్యాదు చేశాడు.. ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. కోర్టులో ఉన్న కాకాణికి కేసుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలు చోరీ అయ్యాయంటే.. అవి నిజంగా ఫోర్జరీవే అయితే.. వాటిని తప్పించాల్సిన అవసరం కాకాణికి ఉంటుందంటున్నారు. కానీ ఆ పత్రాలు ఫోర్జరీవి కాకపోతే వాటిని దొంగిలించాల్సి అగత్యం ఇంకెవరికి ఉంటుందనేది ప్రశ్నగా మారింది. అలా కాదనుకుంటే కోర్టులోనే లేని పత్రాలు చోరీ అయ్యాయని చెప్పడం వెనుక కాకాణిని అభాసుపాలు చేసే కుట్ర ఉందా? అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను విచారించే ప్రత్యేక కోర్టులోనే చోరీ జరిగిందనేది వాస్తవం. అయితే.. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించిన రికార్డులు అప్పటికే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు పంపించేశారట. కానీ వాటిలో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రం విజయవాడకు చేరలేదట. ఈ సమాచారం నెల్లూరు జిల్లా జడ్జికి కూడా అందించలేదు. తీరా చూస్తే ఆ ఫైల్స్ నెల్లూరు టూటౌన్ పోలీసుల ఆధీనంలో ఉన్నాయట. అంటే చోరీ జరిగినట్లు చెబుతున్న కాకాణి కేసు ఫైల్స్ 4వ అదనపు జూనియర్ సిలిల్ జడ్జి కోర్టులో లేవని జిల్లా ప్రధాన జడ్జి జస్టిస్ యామిని తేల్చారు.

అంటే అసలు చోరీ అయిన ప్రాపర్టీలో కాకాణి కేసు ఫైల్స్ లేకపోయినా.. ఎందుకు అవి చోరీ అయ్యాయని కాంట్రాక్ట్ బెంచ్ క్లర్క్ ఫిర్యాదు చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. చోరీ అయినవి మంత్రి కాకాణి కేసు ఫైల్సే అనే ప్రచారం ఎలా జరిగింది? ఆ ప్రచారం అసలు ఎక్కడ మొదలైంది? బెంచ్ క్లర్క్ చెప్పిన కాకాణి ఫైల్స్ చోరీ కథ కట్టుకథా? లేక ఇంకేదైనా మోటివేషన్ ఉందా? అనే దానిపై చర్చ జరుగుతోంది. బెంచ్ క్లర్క్ చెప్పింది కట్టుకథే అయితే.. ఎందుకు చెప్పాడనేది స్పష్టం కావాల్సి ఉంది.

నిజానికి కోర్టులో చోరీ జరిగిందని చెబుతున్న రోజున కోర్టులో 3 ప్లస్ 1 పోలీసు కాపలా ఎందుకు ఉండలేదు? ఆ రోజే భద్రతను అంత ఈజీగా పోలీసులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. చోరీ జరిగిన తీరుపై పోలీసు దర్యాప్తు సరైన దర్యాప్తు జరగలేదని వస్తున్న అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తేల్చిన దానిపై ఎవరిని బాధ్యులగా లేలుస్తారనేది సీబీఐకి దర్యాప్తు అప్పగిస్తే తేలే అవకాశం ఉందంటున్నారు. చోరీ జరిగిన రోజున కోర్టు తలుపులు పగలగొట్టిన దుండగుల వేలి ముద్రలు గానీ, సంఘటనా స్థలంలో పాదముద్రలు గానీ పోలీసులు ఎందుకు సేకరించలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సంఘటన జరిగిన రోజున దర్యాప్తు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అందుకు ఏదైనా బలమైన కారణం ఉందా అంటున్నారు.

మొత్తం మీద నెల్లూరు కోర్టులో చోరీ కేసును, కాకాణి, సోమిరెడ్డి పెట్టుకున్న కేసులపై సీబీఐ విచారణ జరిగితే.. అవి ఎవరి మెడకు చుట్టుకుంటాయో? ఇంకెవరు ఇరుక్కుపోతారో అనే ఆసక్తి పెరిగిపోతోంది.

By
en-us Political News

  
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.