Publish Date:Jul 22, 2025
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా పరిపాలనా భవనం నిర్మాణం చేయాలని, .తిరుమలలో మూడో క్యూకాంప్లెక్స్ నిర్మాణ అవసరంపై చర్చించి, నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కమిటీ, తిరుమల ఆలయాల నిర్మాణాలపై విధివిధానాలపై అధ్యయనానికి సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధి, శ్రీవారి సేవలో ప్రొఫెషనల్స్ వినియోగానికి ఆమోదం, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ క్రైమ్ లాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం నిర్వహణ మరింత మెరుగుకు చర్యలు, ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో అన్నప్రసాదాల కోసం కోసం రూ. 3.45 కోట్లు కేటాయించాలని, కడపలో పురాతన శివాలయం జీర్ణోద్ధరణకు తీర్మానం చేశామని చెప్పారు. 600 మంది వేదపారాయణదారులకు సంభావన కోసం రూ. 2.16 కోట్లు , 142 మంది డ్రైవర్ల క్రమబద్దీకరణ, శ్రీవాణి నిధులతో భజన మందిరాల నిర్మాణాలకు అనుమతినిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-key-decisions-25-202491.html
హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
ఏపీలో ట్రైబల్ శాఖలో ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) అబ్బవరపు శ్రీనివాస్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరాన్నికి క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉందని వాతవరణ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.
విశాఖ నగరంలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా..ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి కేంద్రం ఎంటరైంది. ఈ వ్యవహారం జాతీయ అంశమని తొలి నుంచీ బీజేపీ చెబుతూనే ఉంది.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
నకిలీ ఓటర్ల జాబితాలతో ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
వైసీపీ నేత తూరకా కిశోర్ను వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా తూరకా కిశోర్ను అరెస్ట్ చేశారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలతో విరుచుకుపడితే.. ప్రతిగా భారత్ పక్కా వ్యూహంతో ఆయన మెడలు వంచి దారికి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తోందా? అంటే మోడీ చైనా పర్యటన, అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొంది. స్ధానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.