టీటీడీ పాలక మండలి చైర్మన్ ని దింపడానికి వైసీపీకి ఎందుకంత ఆతృత? ఎందుకంత ఉత్సుకత? పదే పదే రాజీనామా చేయమని ఎందుకు చేస్తారు? తాజాగా చైర్మన్ బీఆర్ నాయుడుపై ఏఐ వీడియోలతోనూ చేసిన ప్రయోగంలో మతలబు ఏంటి? అసలింతకీ వైసీపీ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోలలో ఎముంది? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాదు.. కొన్ని ఉదాహరణలు ఏకరవు పెట్టారు. అందులో భాగంగా చూస్తే గతంలో టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేసిన వారంతా కూడా రిజైన్ చేశారనీ.. మీరు కూడా అలా చేయక తప్పదనీ భూమన అన్నారు. తిరుమల కొండ మీద గాలి కూడా పవిత్రంగా ఉండాల్సిందే అని పీవీ నరసింహరావు అన్నట్టు.. ఇక్కడొక శాసనం ఉందంటారు భూమన. ఎవరైతే అనైతిక కార్యకలాపాలకు పాల్పడతారో వారు తమకు తాము తొలగిపోవల్సిందే నన్నారు. అందుకు ఎస్వీబీసీ చైర్మన్ గా పృధ్వి ఉదంతాన్ని ఉదహరించారు. పృధ్వి ఆడియో లీక్ కాగానే జగన్ ఆయన్ను తప్పించారని గుర్తు చేశారు. ఆ తర్వాత సిర్రి అప్పన్ అనే అర్చకుడు అనైతికంగా వ్యవహరిస్తే వెంటనే తొలగించారు. ఇంకా చదలవాడ, పుట్టా వంటి వారు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే టీటీడీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఉదాహరణలన్నీ చెబుతూ.. బీఆర్ నాయుడు రిజైన్ చేయాలనీ, లేకుంటే చంద్రబాబు ఆయనను తొలగించాలనీ భూమన డిమాండ్ చేశారు.
అయితే భూమనకు గట్టికౌంటర్ ఇచ్చారు బీఆర్ నాయుడు. వీరి బండారమంతా తానెక్కడ బయట పెడతానో అన్న భయంతోనే భూమన ఇదంతా చేస్తున్నట్లు ఆరోపించిన బీఆర్ నాయుడు... వీరు గతంలో టీటీడీ కేంద్రంగా చేసిన దురాగతాలన్నిటికీ సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. అవన్నీ త్వరలోనే బయటకొస్తాయని హెచ్చరించారు బీఆర్ నాయుడు. తానింత వరకూ ఆగుతూ రావడానికి గల కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం వల్లే అన్నారు బీఆర్. భూమనలాంటి వారు దిగిపోమంటే దిగిపోవడానికి కాదు తానున్నదన్నారు.
తిరుమల ఉన్న ప్రాంతం నుంచే తాను వచ్చాననీ.. అదే భూమన తిరుపతికి పక్క జిల్లా నుంచి వచ్చినట్టు చెప్పారు బీఆర్ నాయుడు. అసలా వీడియోలో కనిపిస్తున్న మహిళ కుటుంబంతో తమకు ఎప్పటి నుంచో కుటుంబ సంబంధ బాంధవ్యాలున్నట్టు చెప్పారాయన. అంతే కాదు అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు. వీరిపై వంద కోట్ల పరువు నష్టం దావా వేసి.. జీవితాంతం ఈ బీఆర్ నాయుడు పేరు గుర్తుండిపోయేలా చేస్తానన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-chairman-versus-formerchairman-39-214849.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.