కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు. తీరా కొండకు చేరుకున్న తర్వాత పది రోజుల ముందే ఒక వ్యక్తి మొబైల్ నుండి వచ్చిన తోమాల, అభిషేక సేవా టికెట్లను తమ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే క్రమంలో అవి నకిలీవి అని తేలడంతో విస్తు పోయారు. వెంటనే తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా మీరు ఎక్కడ నుండి మొబైల్ ట్రాన్సాక్షన్ చేశారో ఆ పరిధి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడంతో చేసేదేమీ లేక తమ వద్ద ఉన్న ఉచిత టైం స్లాట్ దర్శన టోకెన్లతో వెళ్లి స్వామి వారిని దర్శించుకుని గురువారం వెనుతిరిగారు.
వివరాల్లోకెళితే తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన విజయ్ ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. తన మిత్రుడి ద్వారా బాలాజీ అనే వ్యక్తి నంబరు పొందాడు. బాలాజి మీకు కోరిన దర్శనం చేయిస్తాడని చెప్పడంతో అతనిని సంప్రదించి దపదపాలుగా బాలాజీ అకౌంట్ నెంబర్ కు రూ. 65 పంపాడు. అందుకు పది రోజుల క్రితం విజయ్ కుటుంబ సభ్యులు ఐదు మంది పేర్లతో టీటీడీ లోగో కలిగిన నకిలీ తో మాల సేవ టికెట్టును 03-07-2025 తేదికి, మరుసటి రోజు 04-07-2025 తేదీ శుక్రవారం రోజుకి 6 మందికి కలిపి ఒక నకిలీ టికెట్టును అనుమానం రాకుండా నెట్ లో తయారు చేయించి విజయ్ మొబైల్ కు పంపాడు. అలాగే ఒక సూట్ రూమ్ కు కూడా వారి పేరుతో నకిలీ రసీదు ను పంపాడు. వారు స్వామివారు మనకు మంచి సేవలు ఇచ్చారు అనే ఆనందం లో బుధవారం
తిరుమలకు చేరుకున్నారు.
ఎందుకైనా మంచిదే అని తిరుపతిలో ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు పొందారు. తీరా మీరు మాకు బుక్ చేసిన గదిని పొందేందుకు ఎక్కడికి వెళ్లాలని అడిగేందుకు బాలాజీకి ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోగా మెసేజ్ లకూ స్పందించలేదు. దాంతో అనుమానం కలిగి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రిఫరెన్స్ అనేది టికెట్ పైన లేకుండా దర్శనం టికెట్టు మంజూరు కాదు. ఎంతటి వి.వి.ఐపీ లు అయినా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారే స్వయంగా వస్తే తోమాల సేవను ఒకరికి లేక ఇద్దరికీ మంజూరు చేస్తారు. అలాగే పూరాభిషేకం కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారికి ఒక్కటి లేక రెండు మంజూరు చేస్తారు.
ఇలా ఎలా మోసపోయారని తిరుమల పోలీసులు బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దళారీలు మాత్రం శ్రీవారి భక్తులను మోసం చేసేందుకు రక రకాల కొత్త మార్గాలను ఉపయోగించి దోచేస్తున్నారు. ఇటువంటి మోసాలపై ఇటు టీటీడీ, అటు పోలీసులు బయట వ్యక్తులను నమ్మకండి... టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని పదే పదే కోరుతున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలతో భక్తులు మోసపోతూనే ఉన్నారు. కాగా నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేసిన బాలాజీ బ్యాంక్ అకౌంట్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్నట్లు బాధిత భక్తుడు విజయ్ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-25-201198.html
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుయడు కోసం కొత్త ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత రెండు వారాలుగా చంద్రబాబు ఈ కొత్త హెలికాప్టర్ లోనే పర్యటనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత ఉందని అంతా భావించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె అధ్యక్షత వహిస్తోన్న తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి పార్టీ చేస్తారన్న వార్తలు వెల్లువెత్తాయి.
భారత్ అంటే భగ్గుమంటున్నారు ట్రంప్. అంతేనా ఇండియాపై యాభై శాతం సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా ఇండియాలోనే డెడ్ చీప్ గా అమ్ముకుని అసలైనా సరే రాబట్టుకోవాల్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ వస్తు,సేవల పన్ను విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వెల్లడించారు.
ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ అడ్డాలోనే ఆ పార్టీని మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్.. మూడు నెలల ముందు స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇసుమంతైనా వెనుకాడటం లేదు.
వైసీపిలో తిరుగుబాటు జరగనుందా? మరీ ముఖ్యంగా ఇప్పడు వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు జగన్ ను ధిక్కరించనున్నారా? త్వరలో అంటే ఈ నెలలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆ చర్చ జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధకారంలో ఉన్న సమయంలో సజ్జల పార్టీనీ, ప్రభుత్వాన్నీ గుప్పిట పట్టి ఓ ఆటాడుకుంటే.. ఆయన పుత్రరత్నం పిల్ల సజ్జల.. అదే నండి సజ్జల్ బార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా పెత్తనం చెలయించారు.
కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలంగా సంచలనంగా మారి, పార్టీలో సంక్షోభానికి కారణమైన కేసీఆర్ తనయ కథ ముగిసినట్లేనా? అంటే కాదు అన్న సమాధానమే వస్తోంది. పరిశీలకులు బీఆర్ఎస్ లో అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్నారు.
ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడు. ఆయన చాలా గ్యాప్ తరువాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. పార్టీకీ, పార్టీద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు.
తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అయితే ఈ నెలాఖరులోగా స్థానక ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో మారు హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణం వైసీపీ పునాదులనే కదిపేలా ఉండటంతో ఆ పార్టీలో కంగారు మొదలైంది. మద్యం కుంభకోణంలో అరెస్టై జైలు పాలైన తమ పార్టీ నేతలను కలవడానికి కూడా వైసీపీ అధినేత జగన్ ముందువెనుకలాడుతున్నారు.
బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోందా? 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం, ఆ తరువాత గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకుండా సాధించిన జీరో రిజల్ట్ తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకున్నట్లు కనిపించదు.