Publish Date:Dec 15, 2018
కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఘన విజయం సాధించి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇదే ఉత్సాహంలో తెలంగాణ కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదేంటి బతుకమ్మ అయిపోయిందిగా!! ఇప్పుడు చీరల పంపిణీ ఏంటి అనుకుంటున్నారా?. ముందస్తు ఎన్నికలు వచ్చాయి కదా.. అందుకే ఆ చీరల పంపిణీ కాస్త వెనక్కి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక.. వ్యక్తిగతంగా లబ్ధి చేకూరుస్తూ ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండే పథకాలకు ఎన్నికల సమయంలో బ్రేక్ వేస్తారు. అందుకే రైతు బంధు పథకం కూడా రైతులకు నేరుగా చెక్కులు ఇవ్వకుండా.. అకౌంట్లో డబ్బులు వేసే ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ చీరలకు కూడా అప్పుడు అలాగే బ్రేక్ పడింది.
ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పంచడానికి సుమారు 95 లక్షల చీరలను ప్రభుత్వం సిద్ధం చేసుకున్నా.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ పంపిణీకి బ్రేక్ పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చీరల పంపిణీ చేయాలని భావించగా ఎన్నికల కమీషన్ దానిని అడ్డుకుంది. మళ్ళీ త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే వారంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసే అవకాశముంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ts-government-to-distribute-bathukamma-sarees-next-week-39-84884.html
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.