ఏ దేశమేగినా దీదీ .. దీదీనే !

Publish Date:Mar 25, 2025

Advertisement

ఏ దేశ  మేగినా, ఎందు కాలిడినా .. మమతా బెనర్జీ.. మమతా బెనర్జీనే. ఆమె మారరు.ఆమె వేషం అసలే మారదు. అదే ముతక చీర, అవే స్లిప్పర్స్. అదే నడక, అదే పరుగు. సహజంగా రాజకీయ నాయకులనే కాదు, మాములు మనమే అయినా విదేశాలకు వెళ్ళినప్పుడు, వేషం మార్చేస్తాం. సూటూబూటులోకి మారిపోతాం.నిజానికి విదేశాలకే వెళ్ళ నక్కర లేదు,  పెళ్ళికో పేరంటానికో వెళ్ళినా అంతే. సందర్భాన్ని బట్టి డ్రెస్ కోడ్ మారి పోతుంది. ఇక ఆడ వారి విషయం అయితే చెప్పనే అక్కర లేదు. కానీ, మమతా దీదీ  అలాక్కాదు. ఇక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళినా అంతే. ఆమె వేషం మారదు.  

అవును. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు,  మమతా దీదీ ప్రస్తుతం లండన్‌  పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల కోసమే వెళ్ళారో, ఇంకెందు కోసం వెళ్ళారో ఏమో కానీ, పొద్దున్నే లేచి, ఆమె బస చేసిన హోటల్  కు దగ్గరలో ఉన్న హైడ్ పార్క్ లో వాకింగ్ కు వెళ్ళారు. అయినా.. ఆమె వేషం మారలేదు. అదే చీర, అవే చెప్పులు. ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారు. అయితే  ఆ  బృందంలోని  ఆడ, మగ సెక్యూరిటీ అధికారులు అందరూ అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా.. కోట్లు .. బూట్లు వేసుకుని నడిస్తే.. మమతా దీదీ మాత్రం మాములుగా చీరకట్టులో, స్వెటర్ మాత్రం వేసుకుని, కాళ్ళకు ఎప్పటిలానే స్లిప్పర్స్  మాత్రమే వేసుకుని కోల్ కతా వీధుల్లో నడిచిననట్లే చక చకా నడుస్తూ వాకింగ్ తో పాటు జాగింగ్ చేశారు. ఆమె వెంట ఇంగ్లాండ్ వెళ్ళిన  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కూనాల్ ఘోష్ మమతా దీదీ నడక వీడియోను తన అధికారిక ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పుడే కాదుట, గతంలోనూ ఆమె విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా  వేషం ఎప్పుడు మార్చ లేదుట. 

అయితే  ఇలా ఏ దేశం వెళ్ళినా, మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు సహా ఏ దేశాధినేత వచ్చినా, ఎక్కడ ఎవరితో ఉన్నా మున్నూట అరవై రోజులు వేషం మార్చని మరో ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో తెలుసు కదా, ఎస్, మన ఆంధ్ర ప్రదేశ్ సిఎం  నారా చంద్రబాబు నాయుడు. ఆయన కూడా  అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అనేక దేశాల్లో పర్యటించారు.  బిల్ క్లింటన్ వంటి అనేక మంది దేశాధి నేతలతో దెశ విదేశాల్లో వేదికలు పంచుకున్నారు. అయినా, ఎప్పుడూ ఆయన వేషం మార లేదు. నిజానికి, చంద్ర బాబును మరో రూపంలో మరో వేషంలో ఉహించుకుందామన్నా నో ఛాన్స్. అవును, చంద్రబాబు మాములుగా అందరిలానే  ప్యాంటు,షర్టు ధరిస్తారు. షూస్ వేసుకుంటారు. కానీ, ప్యాంటు, షర్టు కలర్ మారదు. చిత్రం ఏమంటే కొలతలు కూడా  మారవు. అవును, 70 ప్లస్ లోనూ ఆయన శరీర కొలతల్లో పెద్దగా మార్పు కనిపించదు. బహుశా ఆయన పాటించే ఆహార నియమాలు, వ్యాయామం, జీవన శైలి, ఇందుకు కారణం కావచ్చును.

ఇదే కోవకు చెందిన మరో ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. అయితే ఈయన కట్టేది కాషాయం. అవును, ఒకప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రస్ నాయకులు ఖద్దరు ఒక్కటే కట్టే వారు. ఇప్పడు టీ షర్టులు, జీన్స్ పాంట్స్ తో పార్లమెంట్’కు వస్తున్నారు. సరే అది వేరే విషయం అనుకోండి.  చివరగా, మనకు స్వాతంత్ర్యం తెచ్చిన  జాతి పిత మహాత్మా గాంధీ చివరి వరకు  కొల్లాయి మాత్రమే కట్టారు. అవును కొల్లాయి కడితేనేమి మా గాంధీ’ అనిపించుకున్నారు. ప్రాతః స్మరణీయులయ్యారు.

By
en-us Political News

  
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిలు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో వారు తెలంగాణ మునిసిపోల్స్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి కోరిక మన్నించి తెలంగాణ మునిసిపోల్స్ లో కమలం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పవన్ అంగీకరించారు.
పరామర్శయాత్ర పేర ఆయన చేసిన ర్యాలీ గొల్లపూడి నుంచి ఇబ్రహీపట్నం చేరే లోపే రాంబాబు, భార్గవ్ అనే ఇద్దరు వైపీపీ కార్యర్తలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
సింథ‌టిక్ నెయ్యితో స్వామివారికి ల‌డ్డూలు చేసి పెట్టిన పాపం ఊర‌కే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు.
అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించుకోకపోవడానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జ‌న్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.