భార‌త్ పై 25 శాతం సుంకాల మోత‌.. ఎవ‌రికి లాభం ఎవ‌రికి న‌ష్టం?

Publish Date:Aug 1, 2025

Advertisement

ట్రంప్ భారత్ అంటేనే మండి ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మోడీ అంటేనే ఆయ‌న‌కు అస్స‌లు గిట్ట‌డ్డం లేదు. ఒక స‌మ‌యంలో ట్రంప్ విజయం కోసం ప్ర‌చారం చేసిన మోడీ.. ట్రంప్ రెండో సారి గెలిచాక త‌న త‌ప్పిపోయిన సొంత సోద‌రుడ్ని క‌లిసినంత సంబ‌రంగా ఫీలయ్యారు. అయినా కూడా మోడీ  పొడ ట్రంప్ కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు.  ఏమైందో తెలీదుగానీ..  భారత్ పై పాతిక శాతం టారీఫ్ ల‌తో విరుచుకుప‌డ్డం మాత్ర‌మే కాదు.. భార‌తీయులంటేనే ఉద్యోగాలివ్వ‌ద‌ని అంటున్నారు ట్రంప్.

పాకిస్థాన్ లో ప్ర‌స్తుతం పెట్రోలు త‌వ్వ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టింది అమెరికా.  వ‌చ్చే రోజుల్లో భార‌త్ కే ఇంధ‌నం అమ్మొచ్చ‌ని అంటారు ట్రంప్. మోడీ పాకిస్థాన్ పాల‌సీని ఫాలో కావ‌డం లేదు. కొత్త రూట్ మ్యాప్ ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే అమెరికా, చైనాల‌తో పాటు దీటైన దేశంగా అన్ని రంగాల్లో రాణించేదిశగా దూసుకెడుతోంది. ఆయుధ  సంప‌త్తి సైతం పెంచుకుంటోంది.  గ్లోబ్ సౌత్ కి నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి మోడీ మొన్న చాలా దేశాల్లో  ప‌ర్య‌టించారు. అంతే కాదు.. బ్రిక్స్ ద్వారా గ్గోబ్ సౌత్ లీడ‌ర్షిప్ కి ప్లానేస్తున్నారు. దీంతో ట్రంప్ కి మోడీ అంటే అస్స‌లు ప‌డడం లేదు అంటున్నారు విశ్లేషకులు. అవ‌స‌ర‌మైతే చైనా, ఆఫ్రికా దేశాల‌తో కొత్త జ‌ట్టు క‌ట్ట‌డానికి కూడా సిద్ధ ప‌డుతున్నారు మోడీ.  దీంతో మోడీ ని చూసి చికాకు ప‌డుతోంది ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరికా.

నిజ‌మే పాతిక  శాతం సుంకాల ద్వారా భార‌త్ లో కొన్ని   రంగాల‌కు తీవ్ర‌మైన ఇబ్బంది క‌ల‌గొచ్చు. ఇందులో పాడి, వ్య‌వ‌సాయ రైతుల‌కు, ఎన్నో చిన్న మ‌ధ్య‌త‌ర‌హా ఎంఎస్ఎంఈల‌కు న‌ష్టం వాటిల్ల వ‌చ్చు.  అంతే కాదు.. ఎంపీ లావు పార్ల‌మెంటులో చెప్పిన‌ట్టు.. ఏపీ ఆక్వాకు భారీ న‌ష్టం కలగొచ్చు. ఎందుకంటే మ‌న స‌ముద్ర ఉత్ప‌త్తుల్లో 33 శాతం అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఆ మాట‌కొస్తే మొన్న‌టి మామిడి రైతుల క‌డ‌గండ్ల‌కు కార‌ణం కూడా ఇలాంటి ప‌రిస్థితులే.

కొంద‌రేమంటారంటే మోడీ ఒక్క మాట మాట్లాడితే ఇలాంటి స‌మ‌స్య‌లు స‌మ‌సిపోతాయి. పాతిక శాతం కాస్తా 15 నుంచి 20 శాతానికి దిగి వస్తుందంటారు.  బేసిగ్గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఇరు ప‌క్షాలు వ‌చ్చే కొన్నేళ్ల‌లో ద్వైపాక్షిక వ్యాపారం 500 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచాల‌న్న యోచ‌న‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో సానుకూలంగా స్పందిస్తే స‌రిపోతుంది. కానీ, మోడీ ఇందుకు స‌మ్మ‌తంగా ఉన్న‌ట్టు లేరు. పైపెచ్చు అమెరికా క‌న్నా చైనాను న‌మ్మ‌డ‌మే మేల‌ని భావిస్తున్నారు. ఈ మ‌ధ్య చైనా టూరిస్టుల‌కు వీసా అనుమ‌తులివ్వ‌డం ఇందులో భాగంగానే భావిస్తున్నారు. 

ఇక ఫైన‌ల్ గా ర‌ష్యాను వ‌దులుకోవ‌డం. ఎందుకంటే ప్ర‌పంచ‌మంతా ఉక్రెయిన్ లోన మార‌ణ‌కాండ ఆపాల‌ని ఎదురు చూస్తుంటే..  మోడీ,  భార‌త్ మాత్రం ర‌ష్యా నుంచి చ‌మురుతో స‌హా ఎన్నో ఆయుధ స‌హాయ స‌హ‌కారాల‌ను పొందుతున్నార‌ని ఆరోపిస్తారు ట్రంప్. నిజ‌మే ఇదే ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు కొన‌కుంటే జ‌రిగే విప‌త్తు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌ల్ బ్యార‌ళ్ల ధ‌ర‌లు అమాంతం పెరుగుతాయి. మొన్న ఆప‌రేష‌న్ సిందూర్ లో ర‌ష్యాన్ ఎస్ 400 ద్వారా మ‌న‌మెంతో విజ‌యం సాధించాం.

అదే అమెరికాను దాని ఎఫ్ 16ల‌ను న‌మ్ముకున్న పాక్ ప‌రిస్థితి ఎలా ఉందో చూశాం. చైనా ఇచ్చిన పీఎల్ 15లు, ఇత‌ర వాయు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా నిర్వీర్య‌మైన ప‌రిస్థితులు. మ‌నం కూడా అలాంటి ఫలితాల‌నే పొంద‌డానికి సిద్ధంగా లేమంటారు మోడీ ఆయ‌న ప‌రివారం. కాబ‌ట్టి ట్రంప్ ని ఫాలో కావ‌డం అయ్యే ప‌ని కాదని తెగేసి చెబుతారు. ఒక వేళ మోడీ మ‌న వాళ్ల‌కు ఉద్యోగాలివ్వొద్దంటే న‌ష్ట‌పోయేది అమెరికాయే. కార‌ణం మ‌న మేధ‌స్సు అక్క‌డ ట్రిలియ‌న్ డాల‌ర్ల వృద్ధి చూపుతోంది. త‌ద్వారా అమెరికాకు ఎంతో మేలు జ‌రుగుతోంది. ఎన్నో ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. ఆ మాట‌కొస్తే మ‌స్క్ ని కూడా ఇలాగే దూరం చేసుకుంటున్నారు ట్రంప్. ఆయ‌న వ‌ల్ల ఎంతో ల‌బ్ధి చేకూరుతున్నా.. కావాల‌ని మ‌స్క్ ఆదాయ వ‌న‌రుల‌ను గండి కొట్టేలా బిగ్ బిల్ వంటి బిల్లులు పాస్ చేయిస్తున్నారు. దీని వ‌ల్ల అంతిమ న‌ష్టం అమెరికాకే అన్న‌ది నిపుణుల అంచ‌నా. 

ఇప్ప‌టికే ప‌క్క‌నే ఉన్న మెక్సికో, కెనాడా వంటి  దేశాలతో స‌ఖ్యంగా లేక పోవ‌డం వ‌ల్ల‌.. కెన‌డియ‌న్లు అమెరిక‌న్ టూర్ లు  మానేస్తున్నారు. దీని వ‌ల్ల ఎంతో లాస్. ఎందుకంటే ఒక కెన‌డియ‌న్ అలా యూఎస్ టూర్ వ‌స్తే పెట్టే ఖ‌ర్చు మినిమంలో మినిమం 4 వేల డాల‌ర్లు. ఇక‌ మెక్సిక‌న్లు అమెరికాలోకి చొర‌బ‌డకుంటే అక్క‌డ పాచిప‌ని, వంటప‌ని, మ్యూజిక్ వంటి రంగాల్లో ఆ వెలితి తీర్చ‌లేనిది. ఇక భార‌త్ ని కాద‌నుకుంటే స్పేస్, మెడిసిన్, లా, సాఫ్ట్ వేర్ రంగాల్లో భారీ వెలితి ఏర్ప‌డుతుంది. చైనాను కాద‌నుకుంటే ఏకంగా అన్ని చౌక వ‌స్తువుల‌ను అత్య‌ధిక ధ‌ర‌లు వెచ్చించి కొనాల్సి వ‌స్తుంది. ఎటు నుంచి ఎటు చూసినా ఈ సుంకాల వ్యూహంలో చిక్కింది అమెరికాయే త‌ప్ప‌.. భార‌త్, చైనా కాదంటారు  వాణిజ్య‌ నిపుణులు.  మ‌రి  చూడాలి.. ట్రంప్ తెంప‌రి త‌నం ఇక్క‌డితో ఆగుతుందా? లేక ఆయ‌న ఒంటి చేత్తో కొత్త ప్ర‌పంచం సృష్టిస్తారా.. కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.