Publish Date:Jul 19, 2022
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అంటూ ఎన్టీఆర్, సత్యనారాయణ పాడుకుంటూ తమ స్నేహాన్ని పదికాలాలు గుర్తుండేలా చేసుకోవాలనుకుంటారు.. తెలుగు జంఝీర్ సినిమాలో. ఇలాంటివి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ నిజజీవితంలో అలాంటి స్నేహితులు అప్పుడప్పుడు కనపడు తూంటారు. పిల్లల పెంపకం విషయంలో, ఆస్తుల విషయంలో ఒకరికి ఒకరు సహాయపడటం జరుగుతూం టుంది. కానీ భారీ మొత్తంలో లాటరీ దొరికితే దాన్ని ఇద్దరూ పంచుకునేవారు ఉంటారా అంటే అనుమా నమే అనొచ్చు. కానీ పెర్రీచార్లెస్, స్కాట్ ఎడ్వర్డ్ మాత్రం అలా కాదు. ఇద్దరూ పంచుకున్నారు!
ఉత్తర కరోలినాకి చెందిన పెర్రీ, స్కాట్ అనే స్నేహితులు ముప్పయ్యేళ్ల క్రితం విన్-డిక్సీ అనే సంస్థలో పనిచేసేవారు. ఆ తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది. ఇటీవల పెర్రీకి ఒక లాటరీలో 361,527 డాలర్లు వచ్చాయి. అంత సొమ్ము రాగానే ఇల్లు కొనాలనో, మనవడిని పెద్దబడిలో వేసేయాలనో, వేరే ప్రాంతానికి వెళ్లి బతికేయాలనో అనుకోలేదు. తనకు వచ్చిన సొమ్మును తనవారితో కాకుండా తన ప్రియ స్నేహితుడు స్కాట్తో పంచుకోవాలనుకున్నాడు పెర్రీ! ఇద్దరూ కలిసి ఒకే సంస్థలో పనిచేస్తూన్నపుడు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. తన జీవితంలానే తన స్నేహితుడి జీవితం ఉంటుందనే పెర్రీ అను కున్నాడు. తన సంతోషాన్ని, ఈ లాటరీ సొమ్మునీ ఇద్దరూ పంచుకుంటే మరీ బావుంటుందన్న గొప్ప ఆలోచన చేశాడు.
అంతే వెంటనే తన స్నేహితుడిని పిలిచాడు. ఇద్దరూ కలిసి కూడా చాలా కాలమయింది. అంతే.. ఎన్నాళ్లో వేచిన హృదయం..ఈనాడే ఎదురవుతుంటే.. అంటూ పాటపాడుకుంటూ, ఈల వేస్తూ ఎడ్వర్డ్ పరుగున చార్లీని కలిసేడు. ఇంటి విషయాలు మాట్లాడుకోలేదు.. ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నారు. అంతలో చార్టీ జేబులోంచి చెక్ తీసి చూపించాడు. ఎడ్వర్డ్ ఎంతో ఆనందించాడు. కానీ ఆ ఆనందాన్ని ఇద్దరం పంచుకోవాలన్నాడు చార్లీ. అది విన్న ఎడ్వర్డ్కి ఆనందంతో మాటలు తడబడ్డాయి. కొంతసేపు ఆనందబాష్పాలు ఇద్దరి మధ్యా మాటల్ని లేకుండా చేశాయి. కావలించుకున్నారు. చెక్తో బ్యాంక్ కి వెళ్లేరు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/true-friends-25-140082.html
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.