అధికార పార్టీకి అభ్యర్థులు కరువు? పట్టభద్రులతో పరేషాన్!

Publish Date:Sep 25, 2020

Advertisement

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. ఈ సామెత వ్యాపారంలోనే కాదు రాజకీయాల్లోనూ సూటవుతోంది. ఇప్పటివరకు ఆ పార్టీ టికెట్ కోసం ఆశావహులు క్యూ కట్టేవారు. ఎలాగైనా టికెట్ ఇప్పించాలని ముఖ్య నేతల చుట్టూ ప్రదిక్షణలు చేసేవారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. టికెట్ ఇస్తామన్నా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అధికార పార్టీగా ఉన్నా నేతలెవరు అటువైపు చూడటం లేదు. పోటీ చేయాలని హైకమాండ్ సూచిస్తున్నా.. తమ వల్ల కాదంటూ దండం పెట్టి పోతున్నారట లీడర్లు. ఈ పరిస్థితి తలెత్తింది తెలంగాణలో రూలింగ్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్,కేటీఆర్ చెబుతున్నా.. పోటీ చేయడానికి నేతలెవరు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. 
  

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి  పట్టభధ్రుల ఎమ్మెల్సీ  ఎన్నికలు సవాల్ గా  మారుతున్నాయి. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విజయం సాధించిన కారు పార్టీకి .. రెండుసంవత్సరాలు కూడా  కాకుండానే రివర్స్ సీన్ కనిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికార పార్టీకి అభ్యర్థులే కరువైన పరిస్థితి నెలకొంది.  ఓటమి భయంతోనే పోటీకి  నేతలెవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. సిట్టింగులు తమ వల్ల కాదని చెతులెత్తేస్తుండగా.. కొత్త వారు పోటీకి వెనుకంజ వేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు,ఉద్యోగులు, టీచర్స్ లో కేసీఆర్ సర్కార్ పని తీరుపై  తీవ్ర వ్యతిరేకత ఉందన్న కారణంగానే  ఎన్నికల్లో పోటీకి ఎవరూ ఆసక్తి చూపడం లేదని భావిస్తున్నారు. 

 

వచ్చే ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ రామచంద్రరావు ల పదవీకాలం కాలం ముగుస్తుంది. ఆ లోపే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మండలి ఎన్నికలపై ఫోకస్ చేసిన ప్రధాన పార్టీలు ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాయి. అయితే అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కేటీఆర్.. ఎన్నికల జరగనున్న ఆరు జిల్లాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటరు నమోదు చేపట్టాలని పార్టీ ప్రజా ప్రతినిధులను ఆదేశిస్తున్నారు.  అయితే ఓటర్ నమోదు కోసం కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫీడ్ బ్యాక్ చూసి ఆందోళన చెందుతున్నారట. నిరుద్యోగులు,ఉద్యోగులు, టీచర్స్ లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని కార్యకర్తలు స్పష్టంగా పెద్ద లీడర్లకు చెబుతున్నారట. ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేస్తున్నారట. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ కు చెప్పినట్లు చెబుతున్నారు. 

 

గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని టీఆర్ఎస్ లీడర్లల్లనే చర్చ జరుగుతోంది. ఉద్యమ టైమ్ లో ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. అందుకే గ్రాడ్యుయేట్స్‌‌ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకే అభ్యర్థులు భయపడుతున్నట్లు టీఆర్ఎస్ ఇంటర్నల్ మీటింగ్స్ లో చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టే ఆయన వెనుకంజ వేశారనే చర్చ పార్టీలో జరుగుతోంది. పోటీ చేయబోనని పల్లానే స్వయంగా పార్టీ పెద్దలకు చెప్పినట్లు చెబుతున్నారు.  మండలి ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ గెలవలేదు. ఈ నియోజకవర్గం నుంచి  హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను పోటీకి దింపాలని పార్టీ భావిస్తోంది. అయితే ఆయన కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం.

 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఆ వెంటనే జరిగిన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డికి అధికార పార్టీ అభ్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వలేదు. 2015 లో  జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టం మీద గెలిచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీచేసిన దేవిప్రసాద్ ఘోరంగా ఓడిపోయారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని టీఆర్ఎస్ లీడర్లే చెబుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యతిరేకతను తట్టుకొని గెలవటం సాధ్యం కాదని ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.

 

మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికార పార్టీకి అభ్యుర్థులే దొరకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేననే విషయం దీంతో బయటపడుతుందనే చర్చ జరుగుతోంది. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని టీఆర్ఎస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి మరీ.

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.