కమలానికి మునుగోడు కషాయం? ఊరించి చేజారిన గెలుపు

Publish Date:Nov 6, 2022

Advertisement

మునుగోడులో గెలుపుతో టీఆర్‌ఎస్ భవన్‌లో గులాబీపార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నిక నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడింది.  15 రౌండ్లు ముగిసే సరికి 11,666 ఓట్ల స్పష్ట మైన ఆధిక్యంలో నిలిచింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ముం దంజలో నిలిచింది. మొత్తం 686 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోల్ కాగా టీఆర్‌ఎస్‌ 228, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇతరు లకు 88 ఓట్లు సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. ఉప ఎన్నికలో ఉప ఎన్ని కల ఫలి తాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లుగా ప్రకటించారు బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. తెలంగాణ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్ మినహా మిగిలిన అన్నీ రౌండ్లు టీఆర్ఎస్‌ పార్టీ క్రమంగా మెజార్టీ పుంజుకుంటూ చివరకు ఏడు వేల ఓట్ల ఆధిక్యం దాటిపోవడంతో ఆయ న ఓటమిని అంగీ కరించారు. 
ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటి రెడ్డి రాజ గోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. మును గోడులో నవంబరు 3న పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటి రెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధి గా ఈ స్థానం నుండి  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం  సాధించా రు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వా యి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది. ఈ  నియోజక వర్గంలో గురువారం జరిగిన పోలింగ్‌ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.  

మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు.  ఇందులో 2,25,192 మంది ఓటువేశారు. వీరిలో 1,13,853 పురుషులు, 1,11,338, మంది స్త్రీలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఆ స్థాయిలో మునుగోడు ఓటర్లు పోటెత్తారు. చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లి‌ లో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలి చారు. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్‌ హౌసింగ్‌ గోడౌన్స్‌లో ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐదో రౌండ్ లో  బీజేపీ పై టీఆర్ఎస్ ఆధిక్యంలో  నిలిచింది. 1,4,5  రౌండ్లలో టీఆర్ఎస్  ఆదిక్యంలో  నిలిచింది. రెండు,మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ ఆధిక్యత ను సాధించింది.

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ లో 1,352 ఓట్లతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్‌కి 6,478, బీజేపీకి 5,126, కాంగ్రెస్‌కి 2,100 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ 563 ఓట్లతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ ఎస్‌ కి 14,211, బీజేపీకి 13,648, కాంగ్రెస్‌కి 3,597 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కి 7,010, బీజేపీకి 7,426, కాంగ్రెస్‌కి 1,532 ఓట్లు పోలయ్యాయి. 4 రౌండ్  ముగిసే సరికి టీఆర్‌ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కి 7,010, బీజేపీకి 7,426, కాంగ్రెస్‌కి 1,532 ఓట్లు పోలయ్యాయి.  ఐదో రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై  తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదిక్యంలో నిలిచారు. ఐదో రౌండ్ లో  టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6,1,62 ఓట్లు, బీజేపీఅభ్యర్ధి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5,245  ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదు  రౌండ్లు కలుపుకుంటే టీఆర్ఎస్ అభ్యర్ది కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డికి 32,605 ,బీజేపీ అభ్యర్ధి  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి 30,974  ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి  స్రవంతికి  10,055 ఓట్లు వచ్చాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి  టీఆర్ఎస్  అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 52,334 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డికి 49,243 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 13,689 ఓట్లు దక్కాయి. బీజేపీ ఎన్నో  ఆశ లు పెట్టుకున్న చండూరు మండలంలోనూ టీఆర్ఎస్‌ కారు దూసుకెళ్లింది. 9వ రౌండ్‌లో కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డికి  7,497 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 6,665 ఓట్లు వచ్చాయి.10వ రౌండ్‌లోనూ కొనసాగిన టిఆర్ఎస్  ఆధిక్యత. మొత్తం మీద 4,416 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్. 11 రౌండ్లు  పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 74,574 ఓట్లు,బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 68,800 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి  స్రవంతికి  16,280  ఓట్లు  వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిపై 5,765 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 7440, బీజేపీ 5398. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం 2042. 12 రౌండ్లు ముగిసేసరికి 7836 ఓట్ల ఆధిక్యంతో గెలుపు వాకిట్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి  ఉన్నారు. 

కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆలస్యంగా ప్రకటిస్తుండడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆల స్యంగా ప్రకటిస్తుం డడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలని కోరారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి వివరాలు తెలిపాలని ఆయన కోరారు. దీని పై సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమ వుతుందని చెప్పారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారని, ఆర్వో సంతకం చేశాకే ఫలితాలు విడుదల చేస్తున్నామ ని వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని స్పష్టం చేశారు.

ఉదయం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో పాల్వాయి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సక్సెస్ అవుతాయని లేదుగా ప్రశ్నించారు. అయితే ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం.. బీజేపీ, టీఆర్ఎస్‌‌లతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు పోలు కావడంతో పాల్వాయి స్రవంతి నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. 

మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కూడా సిట్టిం గ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ముందు నుంచే ప్రయత్నాలు చేపట్టింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ప్రచారంలో విషయంలో మాత్రం ఆ పార్టీ వెనక బడిందనే చెప్పాలి. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీల మాదిరిగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వ హించలేదనే టాక్ కూడా ఉంది. అలాగే ఓటర్లను ప్రలోభ  పెట్టడంలో కూడా కాంగ్రెస్ వెనకబడిందని చాలా మంది మునుగోడు వాసులే స్వయంగా వెల్లడించారు. 

మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుపై తన అనుమానం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏడు రౌండ్లు కౌంటింగ్‌ పూర్తైనప్పటికి ఆయనకు కనీసం ఓట్లు పడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. లక్షా 17 వేలు ఓట్లు ఉంగరానికి పడ్డాయని మునుగోడు ప్రజలు చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పటి వరకు తనకు 600 ఓట్లు కూడా నాకు రాకపోవడంపై అను మానం వ్యక్తం చేశారు. ఈవీఎం ల పనితీరుపై తనకు నమ్మకం లేదన్నారు కేఏ పాల్. ఇదంతా బిజెపి, టీఆరెఎస్ పార్టీల కుట్రగా భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో అవినీతి జరిగిందన్నారు కేఏ పాల్. 200ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారాయన. ఎలక్షన్‌ను రద్దు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఫలితాలు ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడితో జాప్యంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ అన్నారు.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప సీఈవో రౌండ్ల వారీ గా ఫలితాలను  అప్ డేట్ చేయడంలేదని ఆరోపించారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడం లేద న్నారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కార ణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎం దుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
 

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.