తెలంగాణా ద్రోహులను కూడా ఆదరించిన ఓటర్లు

Publish Date:Mar 22, 2012

Advertisement

తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, స్టేషన్ ఘన్ పూర్, అదిలాబాద్, కామారెడ్డి ఉప ఎన్నికల్లో తెలంగాణా వాదమే గెలిచిందనేది నిర్వివాదాంశం. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్, బిజెపిలు తమ సమీప ప్రధానపార్టీలయిన కాంగ్రెస్, టిడిపిలను తెలంగాణా ద్రోహులుగా అభివర్ణిస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశాయి. తెలంగాణా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, టిడిపిల నాయకులు ఎన్నికల ప్రచారానికి వస్తే వారిని తరిమికొట్టాలని టిఆర్ఎస్ నాయకులు పదే పదే ఓటర్లకు పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపును తెలంగాణా ఓటర్లు ఖాతరు చేయకపోవడం విశేషం, ఆరు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ ఐదు స్థానాల్లోనూ, బిజెపి ఒక స్థానంలో గెలిచింది, ఇక్కడి ఓటర్లు ఆ రెండు పార్టీల అభ్యర్థులను గెలిపించినప్పటికీ తెలంగాణా ద్రోహులుగా ముద్రపడ్డ కాంగ్రెస్, టిడిపిల అభ్యర్థులను కూడా బాగానే ఆదరించడం విశేషం.

 

మహబూబ్ నగర్ లో బిజెపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డి 39, 272 ఓట్లు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులకు 44.814 ఓట్లు రావడం విశేషం. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధనరెడ్డికి 71 వేల ఓట్లు రాగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులకు 62,284 ఓట్లు వచ్చాయి. కొల్లాపూర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధి జూపూడి కృష్ణారావుకు 58,107 ఓట్లు రాగా, కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులకు 78,370 ఓట్లు వచ్చాయి. స్టేషన్ ఘన్ పూర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధి రాజయ్యకు 81,279 ఓట్లు రాగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధులకు 77,606 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి జె. రాజన్నకు 59,452 ఓట్లు రాగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధులకు 49,305 ఓట్లు వచ్చాయి. కామారెడ్డిలో టిఆర్ఎస్ అభ్యర్ధి గంప గోవర్ధన్ కు 75, 699 ఓట్లు రాగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధులకు 50 వేల ఓట్లు పోలయ్యాయి. ఈ పరిమాణాలు పరిశీలిస్తే తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఆ సెంటిమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీల అభ్యర్ధులను కూడా ఓటర్లు గణనీయంగానే ఆదరించినట్లు తెలుస్తోంది. ఈ పరిమాణం టిఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు.

 

 

 

 

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.