Publish Date:Jul 16, 2022
సోమవారం (జులై 18) నుంచి పార్లమంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి పార్లమెంటు సమావేశాలలో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు మరో స్థాయిలో ఉంటాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. గతంలోలా రాష్ట్ర్ర సమస్యలపై ఒంటరిగా పార్లమెంటులోనూ, పార్లమెంటు ఆవరణలోనూ నిరసనలు తెలపడం, వాకౌట్ చేయడంతో సరిపుచ్చేయకుండా.. బీజేపీయేతర సభ్యుల మద్దతుతో తమ గొంతు బలంగా వినిపించాలని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు.
తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ దిశగానే వారికి దిశా నిర్దేశం చేశారు. గతంలోలా నిరసన గళం వినిపించి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోతే దేశ వ్యాప్తంగా తెరాస వాణి వినిపించే అవకాశాన్ని కోల్పోయినట్లే అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా దేశం దృష్టిని ఆకర్షించేలా తెరాస సభ్యుల నిరసనలు ఉండాలని ఆయన భావిస్తున్నారు.
ఇందుకు బీజేపీయేతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీయేతర పార్టీల నేతలతో ఫోన్ లో సంభాషించారు. పార్లమెంట్లో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా గళమెత్తాలనీ సస్పెన్షన్ వేటు వేసినా వెనుకడుగు వేయవద్దని కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్థిని ఓర్వలేకే కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నదనీ, కేంద్రం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనీ పార్లమెంటు వేదికగా దేశం మొత్తం తెలిసేనా టీఆర్ఎస్ సభ్యులు గళమెత్తాలని కేసీఆర్ ఎంపీలకు చెప్పారు.
తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది ఎంత? కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని వంటి అంశాలను గణాంకాలతో సహా పార్లమెంటులో వినిపించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు. ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని ఈ విషయంలో తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలవాలని ఆయన బీజేపీయేతర పక్షాల నేతలను కోరారు. ఇందు కోసం ఆయన విపక్ష నేతలతో శుక్రవారమే ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, ఇతర జాతీయ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్పత్రిలో ఉన్నందున ఆయన సన్నిహితులతో మాట్లాడారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-to-fight-against-center-in-parliament-25-139916.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.