Publish Date:Dec 27, 2019
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ కేటీఆర్ ... త్వరలో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి అనుకూలంగా కామెంట్స్ చేశారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరే అన్నారు. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.... కేటీఆర్ ముక్కసూటి మనిషని... ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే నడిచిన నాయకుడంటూ కొనియాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతోందని... భవిష్యత్ లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అయితే, కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నారని, త్వరలోనే పట్టాభిషేకం జరగబోతోందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక... కేటీఆర్ సీఎం... కేసీఆర్ సూపర్ సీఎం అంటూ సంచలన కథనాన్ని కూడా ప్రచురించింది. దాంతో, ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే, వచ్చే ఏడాది అంటే 2020లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు అందుకోవచ్చని అంటున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఇటీవలే కేసీఆర్ ఏడాది పూర్తి చేసుకోవడం... అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడంతో.... కొత్త సంవత్సరంలోనే పట్టాభిషేకం జరగొచ్చని చెబుతున్నారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా పట్టాభిషేకం జరగొచ్చని అంటున్నారు.
ఏదిఏమైనా నిప్పు లేకుండా పొగైతే రాదు... అంటే, కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనేది కేసీఆర్ ఆకాంక్షగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పలేని పరిస్థితులు నెలకొనడంతో... ఇఫ్పుడు తనయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కాకపోతే... మరెప్పుడనే భావనతో కేసీఆర్ ఉన్నారని, దాంతో, అతిత్వరలోనే కేటీఆర్ కి పట్టాభిషేకం జరిగిపోవచ్చని అంటున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు కూడా అందుకు సంకేతాలేనని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-srinivas-goud--25-92606.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.