Publish Date:Jun 23, 2021
కరోనా వాళ్ళను కబళించలేదు. బ్లాక్ ఫంగస్ చుట్టూ మూటలేదు. అలా అని వాళ్ళను ఎవరు చంపలేదు, చేతబడి చేయలేదు, ఇంట్లో వేసి అన్నం పెట్టకుండా బండిచలేదు. గుండె పోట్టు లాంటివి రాలేదు. కానీ, ప్రకృతి వాళ్లపై పగపట్టింది. కాలం వాళ్ళని పడుకున్న ఇంట్లోనే రక్తంతో తడిపింది. రాత్రి ఇంట్లో పడుకున్న నానమ్మ, మనుమడు తేరుకోలేని నిద్రలోకి వెళ్లిపోయారు.
అది వనపర్తి జిల్లా. రేవల్లి మండలం. బండరావిపాకుల సర్పంచ్ ఆమె పేరు లచమ్మ. తన వయసు 51 సంవత్సరాలు. తన మనవడు యోగేశ్వర్. ఆ బాలుడి వయసు 12 సంవత్సరాలు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు వేరువేరు గదులలో నిద్రించగా సర్పంచ్ లచ్చమ్మ, తన మనవడు యోగేశ్వర్ 12 తో కలిసి మరో గదిలో నిద్రించారు. అర్థరాత్రి దాటిన తర్వాత సర్పంచ్, ఆమె మనవడు నిద్రిస్తున్న గది పైకప్పు ఒక్కసారిగా కూలి కిందపడటంతో వారు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. వల్ల దురదృష్టం కాకపోతే అందరూ ఇంట్లోనే పడుకున్నారు.. కానీ వెళ్లి పడుకున్న గది కూలి మృతిచెందారు. బుధవారం ఉదయం మిగతా కుటుంబ సభ్యులు లేచి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఇల్లు కూలింది అన్న విషయం గుర్తించి తలుపులు బద్దలు కొట్టి చూసే వరకు ఇద్దరు మట్టిలో కలిసిపోయారు. కుటుంబ సభ్యులంతా గొల్లుమని ఏడ్చారు. గ్రామం అంత సర్పంచ్ మరణం పట్ల చలనం లేకుండా ఉండిపోయారు.
సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. బండ రాయిపాకుల ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు. రాత్రి ఇలా జరగడంతో గ్రామం మొత్తం విషాదఛాయలు అలముకున్నాయి. తెల్లవారు జామున మట్టి మిద్దె కూలి మృతి చెందారు. ఇటీవల సర్పంచ్ మట్టి మిద్దె పై చౌడు వేశారు. పైగా కప్పును మోసే దూలాలు, వాట్లు దెబ్బ తిన్నాయి. ఉదయం మిగతా కుటుంబ సభ్యులు లేచి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఇల్లు కూలింది అన్న విషయం గుర్తించి తలుపులు బద్దలు కొట్టి చూసే వరకు ఇద్దరు మృతి చెందారు. గ్రామ సర్పంచ్తో పాటు ఆమె మనవడు దుర్మరణం పాలయ్యారు. మిద్దె కూలి ఇద్దరు మృతి చెందారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-sarpanch-dead-25-118217.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.