కేంద్రమే టార్గెట్‌గా తెరాస ప్లీనరీ తీర్మానాలు..

Publish Date:Apr 27, 2022

Advertisement

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న తెరాస ప్లీనరీలో, మొత్తం 13 తీర్మానాలు ప్రవేశ పెడుతున్నారు. ఈ తీర్మానాలను మంత్రులు పార్టీ ముఖ్యనేతలు ప్రతిపాదించగా, ఇతర సీనియర్ నాయకులు   బలపరుస్తూ, గంభీర ఉపన్యాసాలు చేస్తున్నారు. అయితే, తెరాస ప్లీనరీలో ప్రవేశ పెడుతున్న తీర్మానాలను గమనిస్తే, తెరాస ప్రభుత్వం సాధించిన అద్భుత విజయాల ప్రస్తావన అంతగా కనిపించలేదని, పార్టీ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. కేంద్ర ప్రభుతం పై కత్తులు దూయడమే ప్లీనరీ లక్ష్యంగా కనిపిస్తోందని, ముఖ్యంగా తీర్మానాలు అన్నీ, కేంద్రం చుట్టూనే తిరుగుతున్నాయని అంటున్నారు.  

యాసంగి ధాన్యం కొనిగోలు వివాదం మొదలు, జాతీయ రాజకీయాల్లో తెరాస కీలక భూమిక పోషించే తీర్మానం వరకు, ఏసీ వర్గీకరణ మొదలు బీసీ జనగణన తీర్మానం దాకా, ధరల పెరుగుదల మొదలు, మహిళా రిజర్వేషన్ బిల్లు వరకు, ప్లీనరీలో ప్రవేశ పెట్టిన ప్రతి తీర్మానాన్ని, తెరాస  కేంద్ర ప్రభుత్వం, బీజేపీల పైనే గురి పెట్టింది. అదే విధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడం చేయాలని ఏకంగా ప్రత్యేక తీర్మానం చేసింది. అంటే, రానున్న రోజుల్లోనూ, తెరాస కేంద్ర ప్రభుత్వం,బీజేపీ లక్ష్యంగానే రాష్ట్ర రాజకీయాలను ముందుకు తీసుకుపోయే అలోచన చేస్తోందని భావించవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, తమ ప్రారంభ ఉపన్యాసంలోనూ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాలలో అమలవుతున్న క‌రెంట్ కోత‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వ నిర్వాకమే కారణమని అన్నారు. అలాగే, దేశంలో ఇటీవల చోటు  చేసుకున్న మత ఘర్షణలు, వివాదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.  ఇటీవ‌లి కాలంలో దేశంలో విప‌రీత‌మైన జాఢ్యాలు, అనారోగ్య‌క‌ర‌మైన‌, అవ‌స‌రం లేవ‌నుట‌వుంటి పెడ ధోర‌ణులు ప్ర‌బలుతున్నాయ‌ని అన్నారు. భార‌త స‌మాజానికి ఇది శ్రేయ‌స్క‌రం కాదని చెప్పుకొచ్చారు. స‌మాజంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ ఆద‌రించాలి. అద్భుత‌మైన ఈ దేశంలో దుర్మార్గ‌మైన విధానాలు దేశ ఉనికినే ప్ర‌శ్నించే స్థాయికి పోతున్నాయని అన్నారు. ఈ విషయంలో ఒక రాజ‌కీయ పార్టీగా తెరాస ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.ఇలా ఏ కోణం నుంచి చూసినా, తెరాస ప్లీనరీలో కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడమే కనిపిస్తోందని పరిసీలాకులు అంటున్నారు. 

అయితే, కేంద్రంతో నిరంతర కయ్యం వలన తెరాసకు రాజకీయ ప్రయోజనం చేకూరినా, చేకురక పోయినా రాష్ట్రం నష్టపోతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. నెలల తరబడి సాగిన యాసంగి వరి వివాదం వలన రాష్ట్ర ప్రభుత్వం, తెరాస సాధించింది ఏమీలేక పోయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగిన వివాదం కారణంగా రాష్ర్  రైతాంగం భారీ మూల్యం చెల్లించిందని గుర్తు చేస్తున్నారు. పంట వేయక కొందరు, వేసిన పంటను ప్రభుత్వం కొనదనే భయంతో కొందరు మిల్లర్లు తక్కువ ధరకు విక్రయించి ఇంకొందరు రైతులు నష్ట పోయారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. రాజకీయాలను, పరిపాలనా సంబంధాలను వేరువేరుగా చూడవలసిన అవసరం ఉందని, అలా కాకుండా అయిన దానికీ, కాని దానికీ కయ్యానికి కాలు దువ్వితే చివరకు నష్ట పోయేది, మూల్యం చెల్లించేది ప్రజలే అని, ఆ పరిస్థితి రాకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కట్టుబాటు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే, ప్లీనరీ తీర్మానాల తీరు చూస్తే, ముందు  ముందు  రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలే కనిపిస్తున్నాయే, కానీ, తగ్గే సూచనలు అయితే అసలు కనిపించడం లేదు.

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.