Publish Date:Jun 24, 2022
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సాధారణంగా విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి. అయితే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రస్తుతం అధికార పార్టీ నుంచే వలసలు పెరుగుతున్నాయి. నిన్న గాక మొన్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి హస్తం నీడకు చేరారు. విజయారెడ్డి మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయ అన్న సంగతి విదితమే. ఆమె గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతూ ప్రజలను నిజమైన న్యాయం కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుందని ప్రకటించారు.
అయితే గులాబీ పార్టీ నుంచి బయటకు వెళుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విజయారెడ్డి బాటలోనే మరో ఇద్దరు నేతలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. వీరిరువురూ కూడా కాంగ్రెస్ గూటికే చేరనున్నారు. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాగా, మరొకరు కరకగూడెం జెడ్పీటీసీ. ముందుగా తాటి వెంకటేశ్వర్లు విషయానికి వస్తే ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ తాను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో అనుచరులతో తాను కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ లో పని చేసే నేతలకు గుర్తింపు లేదని ఆయన ఆరోపించారు. ప్రజాసమస్యలు పట్టని నేతలకే టీఆర్ఎస్ పెద్ద పీట వేస్తోందని విమర్శించారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగడం వ్యర్థమని భావించే కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు చెప్పారు. తాటి వెంకటేశ్వర్లు 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బూర్గంపహాడ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014లో వైసీపీ నుంచి అశ్వరావు పేట నియోజకవర్గం నుంచి రెండో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అనంతరం టీఆర్ఎస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లు 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతర పరిణామాలలో మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ గూటికి చేరారు. అక్కడ నుంచీ తెరాసలో తాటి వెంకటేశ్వర్లుకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.
ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క సహకారంలో కరకగూడెం జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దాదాపు వంద మంది కార్యకర్తలతో కరకగూడెం జెడ్పీటీసీ కొమరం కాంతారావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే ఆయన తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లాలో మరింత మంది గులాబీ నేతలకు కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని పరిశీలకలు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-loosing-its-leaders-to-congress-25-138328.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.