Publish Date:Jun 24, 2022
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సాధారణంగా విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి. అయితే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రస్తుతం అధికార పార్టీ నుంచే వలసలు పెరుగుతున్నాయి. నిన్న గాక మొన్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి హస్తం నీడకు చేరారు. విజయారెడ్డి మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయ అన్న సంగతి విదితమే. ఆమె గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతూ ప్రజలను నిజమైన న్యాయం కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుందని ప్రకటించారు.
అయితే గులాబీ పార్టీ నుంచి బయటకు వెళుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విజయారెడ్డి బాటలోనే మరో ఇద్దరు నేతలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. వీరిరువురూ కూడా కాంగ్రెస్ గూటికే చేరనున్నారు. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాగా, మరొకరు కరకగూడెం జెడ్పీటీసీ. ముందుగా తాటి వెంకటేశ్వర్లు విషయానికి వస్తే ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ తాను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో అనుచరులతో తాను కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ లో పని చేసే నేతలకు గుర్తింపు లేదని ఆయన ఆరోపించారు. ప్రజాసమస్యలు పట్టని నేతలకే టీఆర్ఎస్ పెద్ద పీట వేస్తోందని విమర్శించారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగడం వ్యర్థమని భావించే కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు చెప్పారు. తాటి వెంకటేశ్వర్లు 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బూర్గంపహాడ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014లో వైసీపీ నుంచి అశ్వరావు పేట నియోజకవర్గం నుంచి రెండో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అనంతరం టీఆర్ఎస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లు 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతర పరిణామాలలో మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ గూటికి చేరారు. అక్కడ నుంచీ తెరాసలో తాటి వెంకటేశ్వర్లుకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.
ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క సహకారంలో కరకగూడెం జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దాదాపు వంద మంది కార్యకర్తలతో కరకగూడెం జెడ్పీటీసీ కొమరం కాంతారావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే ఆయన తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లాలో మరింత మంది గులాబీ నేతలకు కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని పరిశీలకలు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-loosing-its-leaders-to-congress-25-138328.html
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.