Publish Date:Oct 29, 2022
నాడు నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో లీక్ చేసి తెలంగాణకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరగబోతోందన్న బిల్డప్ ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పడు కేటీఆర్ బీజేపీ నాయకుడిని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కోరుతున్న ఫోన్ సంభాషణ అడియో రిలీజైతే మాత్రం అందులో తప్పేముంది. నేనే మాట్లాడా, అది నా గొంతే అని దబాయించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. తాను చేస్తే రైటు.. ఇతరులు ఏం చేసినా రాంగ్ అన్న టీఆర్ఎస్ వైఖరికి ఇది నిదర్శనం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పుడు
ఓటుకు నోటు కేసులో అప్పటి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ తో తెలుగుదేశం అధినేత.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో మాట్లాడిన మాటల వాయిస్ రికార్డు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఫోన్ కాల్ లో స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన మాటలలో సొమ్ము ప్రస్తావన ఏదీ లేదు. అయినా అప్పట్లో చంద్రబాబు మాటలతో తెలంగాణలో ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినంత హడావుడి చేసింది. నాడు ఆ ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు ఎక్కడా డబ్బు ప్రస్తావన చేయలేదు. మనవాళ్లు నాకు బ్రీఫ్ చేశారు. వారేం చెప్పారో అది జరుగుతుంది. మనం కలిసి పని చేద్దాం అని అన్నారు. దానితోనే కోట్ల రూపాయల వోటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారంటూ అప్పట్లో తెరాస సర్కార్ హడావుడి చేసింది.
ఇప్పుడు
కేటీఆర్ ఒక బీజేపీ నాయకుడిని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఫోన్ లో మాట్లాడుతున్న ఆడియో లీక్ అయ్యింది. మనుగోడు ఉప ఎన్నిక తో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడేదీత లేదు.. టీఆర్ఎస్ సర్కార్ కూలిపోయేదీ లేదు. అందుకే మీరు మా పార్టీలోకి రండి మీ ఆశీర్వాదం కావాలి అంటే పార్టీలో చేరాల్సింగా ఒత్తిడి చేశారు.
అయితే ఈ విషయంలో కేసీఆర్ ఔను అవును నేనే మాట్లాడాను. తప్పా. ఆయనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అదేమన్నా తప్పా.. పని చేశాం అని చెప్పాం. పార్టీలోకి రమ్మని అడిగాం తప్పేముంది అన్నారు. ఈ రెండు ఆడియోలూ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. నాడు చంద్రబాబు విషయంలో ఒకలా.. నేడు కేటీఆర్ విషయంలో ఒకలా టీఆర్ఎస్ స్పందన ఉండటం గమనార్హం అంటూ పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-duel-attitude-attracts-criticism-25-146249.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.