టీఆర్ఎస్ కు ఎన్నేళ్లు.. ఇరవయ్యా ? ఏడా?.. ఉద్యమకారులు ఏమంటున్నారు! 

Publish Date:Oct 24, 2021

Advertisement

కాంగ్రెస్ పార్టీది వందేళ్ళు పైబడిన చరిత్ర. 1885, డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్బవించింది. అయితే ఆ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ ఒకటేనా అనే విషయంలో చరిత్రకారులలో, ఏకాభిప్రాయం లేదు. భారత స్వాతంత్ర ఆఖరి ఘట్టానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర స్వాతంత్ర సిద్దితో, సమాప్తమై పోయింది. అందుకే, మహత్మా గాంధీ, అప్పుడే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని  కోరారనే వాదన ఒకటుంది. అయితే  గాంధీ సూచను పార్టీ పట్టించుకోలేదు,   అనుకోండి అది వేరే విషయం. నిజానికి 1947కు ముందున్న కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక  ఉద్యమం. ఆ తర్వాత వచ్చిన నాయకత్వం చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మకున్నా, కాంగ్రెస్ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి మద్యన ఉన్న సన్నని గీత మాత్రం అలాగే ఉండి పోయింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక చీలికలు పేలికలు  వచ్చాయి. అయితే అవన్నీ ఎలా ఉన్నా, సైధాంతిక వైరుద్యాల ప్రాతిపదికన 1969లో వచ్చిన చీలిక కాంగ్రెస్ చరిత్రలో ఒక ప్రధాన మైలు రాయిలా నిలిచి పోయింది.   

 కాంగ్రెస్ పార్టీ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయనికి వస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా, అదే  సింగిల్ పాయింట్ అజెండాగా, 2001 (ఆగష్టు 27)న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి, తెరాస ఇప్పుడు ద్విదశాబ్ది (20ఏళ్ల) పండగ వేడుకలు జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలోనే కొందరు కాంగ్రెస్ లానే రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా ఏర్పడిన తెరాస, కూడా 2014కు ముందు ఒక  ఉద్యమ వేదికే కానీ, రాజకీయ పార్టీ కాదనే వాదనను ముందుచుతున్నారు. పుష్కర కాలానికి పైగా సాగిన తెలంగాణ మలి దశ పోరాటం రాజకీయాలకు అతీతంగా సాగిన  ఉద్యమం.  అదొక ఉద్యమం కావడం వల్లనే,రైట్, లెఫ్ట్, మధ్యేవాద భావజాలం ఉన్న అన్ని పార్టీలు, అందరు నాయకులు, ప్రజలు, విద్యార్ధులు అందరూ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు.తెలంగాణ సాకారం అయిన తర్వాత ఉద్యమ స్పూర్తి పక్కకు పోయి తెరాస రాజకీయ రంగు పులుముకుంది. 

నిజానికి  మహత్మా గాంధీ, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని ఒక సూచన  మాత్రమే చేశారు. అది జరగలేదు, కానీ, తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన, తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్, 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, తెరాస ఉద్యమ పార్టీని రద్దుచేశారు. ఉద్యమ లక్ష్యం నెరవేరిన నేపధ్యంలో తెరాస ఇకపై  ఫక్తు 16 అణాల రాజకీయ పార్టీగా పనిచేస్తుందని చెప్పారు . చెప్పడమే కాదు, రాజకీయ పునరేకీకరణ, బంగారు తెలంగాణ మాటల చాటున, ఈ ఏడేళ్ళలో అదే చేశారు. అందుకే, ఉద్యమంలో  పాల్గొన్న పెద్దలు కొందరు, కేసీఆర్  ఉద్యమ పార్టీకి బొంద పెట్టారని అంటారు. ఆరోపిస్తున్నారు, కుటుంబ పార్టీ కట్టుకున్నారని అంటారు.  నిజంగా కూడా కేసీఆర్ ఉద్యమ అవవాళ్ళు, వాసనలు లేకుండా, ఉద్యమ  పార్టీని పూర్తి స్థాయిలో ‘పక్షాళన’ చేశారు. గాదె ఇన్నయ, ఆలే నరేంద్ర, ప్రొఫెసర్ కోదండ రామ్ మొదలు ఈటల రాజేందర్ వరకు ఉద్యమంతో సంబధమున్న నేతలు అందరినీ ఏరి పారేశారు. 

ఇంకా హరీష్ రావు వంటి  ఒకరిద్దరు ఉన్నా, కేసీఆర్ తెరాసను ఉద్యమ పార్టీని, రాజకీయ పార్టీగా... రాజకీయ పార్టీని ... కుటుంబ పార్టీగా చాల చకక్గా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నారు.  ఈ నేపధ్యంలోనే తెరాస ద్విదశాబ్ది  (20 ఏళ్ల) ఉత్సవాలు జరుపుకోవడం సమంజసమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇరవై ఏళ్ల క్రితం, 2001 పుట్టిన పార్టీని, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో  కేసీఆర్ 2014లో రద్దు చేశారు, కాబట్టి, తెరాస రాజకీయ పార్టీగా అవతరించి ఏడేళ్ళే అయిందని, 20 ఏళ్ల పండగ ఎట్లా చేసుకుంటారని, ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే, అప్పుడు ఉద్యమ పార్టీ అయినా ఇప్పుడు కుటుంబ పార్టీ అయినా, పార్టీ నాయకుడు, కేసీఆర్ ఒక్కరే కాబట్టి, అన్ని హక్కులు ఆయనకే ఉంటాయని ఇంకొందరి వాదన. 

ఎవరు ఏ వాదన చేసినా, అది ఇరవై ఏళ్ళా, ఏడేళ్ల అనేది పక్కన పెడితే, తెరాస ఒక చరిత్ర. ఇద్దరంటే ఇద్దరే ఎంపీలతో వందేళ్ళ కాంగ్రెస్ పార్టీని,విలీన ఆశ చూపి  బురిడి కొట్టించి  తెలంగాణ సాధించడం నిజంగా ఒక చారిత్రక సందర్భం. అయితే  వ్యూహాలు, ఎత్తుగడలు, దొంగ దీక్షలు, అగ్గిపెట్టె దొరకక ఆగిపోయిన అత్మాహుతుల వల్ల మాత్రమే తెలంగాణ రాలేదు. 14 వందల బలిదానాల కారణంగానే 60 ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైంది. ఈ ఏడేళ్ళలో ఆ కల చాలా వరకు కరిగిపోయింది. అదెలా ఉన్నా, తెలంగాణ సాధించిన క్రెడిట్ ఉద్యమానిదే కానీ, తెరాస పార్టీది కాదు, తెరాస కుటుంబ పార్టీది అయితే అసలే కాదు. అనేది తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఘోషిస్తోంది.. 

By
en-us Political News

  
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.