గెలుపే లక్ష్యంగా  రేవంత్ సోషల్ ఇంజనీరింగ్.. సక్సెస్ అవుతారా?   

Publish Date:Aug 21, 2021

Advertisement

“తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఒంటరిగా దూసుకు పోతారే కానీ, నలుగురినీ కలుపుకు పోరు. అందుకే అయన అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో చిక్కుకు పోతారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు దూరంగా ఉండడానికి కూడా ఈ దూకుడు స్వభావమే కారణం” రేవంత్ పోకడలపై కాంగ్రెస్ వర్గాల్లో వినవస్తున్న తాజా విశ్లేషణ ఇది. 

అయితే ఇది నిజమేనా అంటే, కొంతవరకు నిజం. కొంత కాదు. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శించడం నిజం. ఒక విధంగా చూస్తే, ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి దూకుడు అవసరం. రేవంత్ రెడ్డి దూకుడు చూపుతున్నారు కాబట్టే, రాష్ట్ర రాజకీయాల్లో ‘రైట్ ఆఫ్’  స్టేజికి చేరుకున్న  హస్తం పార్టీ మళ్ళీ లేచికూర్చుంది. గుర్తింపు తెచ్చుకుంది. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు కాబట్టే, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు, ఒక్కటి తగ్గకుండా లక్ష మందిని సమీకరించగలిగారు. అఫ్కోర్స్ జన సమీకరణలో సీతక్క పేరు చెప్పకపోతే అది అన్యాయమే అవుతుంది, అనుకోండి అది వేరే విషయం.కానీ, దండోరా సభ సక్సెస్’కు మొదటి అడుగు ఆయన దూకుడులోనే ఉంది. అంత భారీ సభ నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేని స్థితి నుంచి, సభను సక్సెస్ స్థితికి తీసుకుపోయారంటే , ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా,  అది రేవంత్ వల్లనే సాధ్యమైంది. చివరకు, అధికార పార్టీలోనూ దడ పుట్టించింది.  

దండోరా సభ దడ పుట్టించింది కాబట్టే, ముఖ్యమంత్రి కేసీఆర్, హుజూరాబాద్ లో దళితబంధు ప్రారంభ సభకు, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయించారు. రాష్ట్రం నాలుగు మూలల నుంచి ఎమ్మెల్యేలకు కోటా ఫిక్స్ చేసి,ఏసీ బస్సులు పెట్టి, జన సమీకరణ చేశారు. అయినా, ఇంద్రవెల్లి సభ ముందు హుజూరాబాద్ సభ వెలవెల పోయిందనే చెప్పాలి. నిజమే,జనం వచ్చారు, కానీ, ఇంద్రవెల్లిలో కనిపించిన జోష్ హుజూరాబాద్’ లో కనిపించలేదు. అంతే, కాదు హుజూరాబాద్ సభకు వచ్చిన వారు వెళ్ళేటప్పుడు నిరాశగా వేణి దిరిగారు. కొంతమంది అయితే అధికార పార్టీని తిట్టుకుంటూ వెళ్ళడం కూడా కనిపించింది.  

సరే అదలా ఉంటే రేవంత్ రెడ్డికి దూకుడే గానీ, ఆలోచన లేదు అనే వాదనలోనూ పస లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఒక పథకం ప్రకారం సోషల్ ఇంగినీరింగ్’ కు శ్రీకారం చుట్టారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం రావిర్యాలలో నిర్వహించిన గర్జన సభలో తమ దూకుడు  ప్రసంగంలోనూ, ఇటీవల ఐపీఎస్ కొలువు వదులుకుని,బీఎస్పీలో చేరిన  ప్రవీణ్ కుమార పేరు తీసుకున్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రవీణ్ కుమార్ మరో ఆరేళ్ల సర్వీస్’తో పాటు  డీజీపీ స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నా, ఉన్న అవకాశాలను వదులుకుని దళితుల మేలు కోసం రాజకీయాలలోకి వచ్చారని అన్నారు. అలాగే, ఉద్యోగంలో కొనసాగుతూ, తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాలు, వివక్షను భరించలేక, దళిత బిడ్డగా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కొలివుకు రాజీనామా చేశారని చెప్పారు.ఇలా ప్రవీణ్ కుమార్’ను ఆకాశానికి ఎత్తేయడం, రేవంత్ రెడ్డి రాజకీయ విజ్ఞత, ముందు చూపుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్;లో బీఎస్పీపీ కలిసి సాగేందుకు, రేవంత్ ముందుగానే కర్చీఫ్ వేశారనీ అంటున్నారు.ఇలా కర్చీఫ్ వేయడం ద్వారా రేవంత్ రెడ్డి, కొత్త సోషల్ ఇంజనీరింగ్’కు శ్రీకారం చుట్టారనిఅనే మాట కూడా వినవస్తోంది. 

అలాగే ఇటీవల పీసీసీ, మైనారిటీ సెల్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు కార్యక్రమలో మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి, “కాంగ్రెస్ పార్టీ మీదే, ముస్లిం మైనారిటీలదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే”  అంటూ మైనారిటీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో బీజేపీ ముస్లిం మైనారిటీలను మోసం చేస్తున్నాయని ధ్వజ మెత్తారు.త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని, గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్’ కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, మైనార్టీ బంధు ఇవ్వాలంటూ తెరాస ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. కానీ, తెరాస మిత్ర పక్షం ఎంఐఎం పేరు కూడా ప్రస్తావించలేదు. 

ఇలా అటు దళితులను,ఇటు ముస్లిం మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయన వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రేవంత్ దూకుడులోనూ ఒక ఆలోచన, సోషల్ ఇంగినీరింగ్ వ్యూహం  ఉన్నాయని నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంతటి దౌర్భాగ్య స్థితికి చేరటానికి, పార్టీ ప్రధాన ఓటు బ్యాంక్ దళితులు, మైనారిటీలు, అలాగే, బడుగు బలహీన వర్గాలు పార్టీకి దూరం కావడమే అనేది ఒక చారిత్రక సత్యం. రేవంత్ ప్రస్తుత ప్రయత్నాలను జాగ్రత్తగ గమనిస్తే, ఎక్కడ పారేసుకున్నమో అక్కడే వెతుక్కోవాలనే రాజకీయ విజ్ఞతను చూపుతున్నారనిపిస్తుంది. దూరమైనా ఒక్కొక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుని ‘సోషల్ ఇంగినీరింగ్’ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం  భావిస్తున్నారు. అయితే, సోషల్ ఇంగినీరింగ్ ప్రయత్నాలలో అయన సక్సెస్ అవుతారా, అంటే అది వేరే విషయం, వేరే చర్చ అంటున్నారు విశ్లేషకులు. 

By
en-us Political News

  
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.