గెలుపే లక్ష్యంగా  రేవంత్ సోషల్ ఇంజనీరింగ్.. సక్సెస్ అవుతారా?   

Publish Date:Aug 21, 2021

Advertisement

“తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఒంటరిగా దూసుకు పోతారే కానీ, నలుగురినీ కలుపుకు పోరు. అందుకే అయన అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో చిక్కుకు పోతారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు దూరంగా ఉండడానికి కూడా ఈ దూకుడు స్వభావమే కారణం” రేవంత్ పోకడలపై కాంగ్రెస్ వర్గాల్లో వినవస్తున్న తాజా విశ్లేషణ ఇది. 

అయితే ఇది నిజమేనా అంటే, కొంతవరకు నిజం. కొంత కాదు. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శించడం నిజం. ఒక విధంగా చూస్తే, ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి దూకుడు అవసరం. రేవంత్ రెడ్డి దూకుడు చూపుతున్నారు కాబట్టే, రాష్ట్ర రాజకీయాల్లో ‘రైట్ ఆఫ్’  స్టేజికి చేరుకున్న  హస్తం పార్టీ మళ్ళీ లేచికూర్చుంది. గుర్తింపు తెచ్చుకుంది. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు కాబట్టే, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు, ఒక్కటి తగ్గకుండా లక్ష మందిని సమీకరించగలిగారు. అఫ్కోర్స్ జన సమీకరణలో సీతక్క పేరు చెప్పకపోతే అది అన్యాయమే అవుతుంది, అనుకోండి అది వేరే విషయం.కానీ, దండోరా సభ సక్సెస్’కు మొదటి అడుగు ఆయన దూకుడులోనే ఉంది. అంత భారీ సభ నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేని స్థితి నుంచి, సభను సక్సెస్ స్థితికి తీసుకుపోయారంటే , ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా,  అది రేవంత్ వల్లనే సాధ్యమైంది. చివరకు, అధికార పార్టీలోనూ దడ పుట్టించింది.  

దండోరా సభ దడ పుట్టించింది కాబట్టే, ముఖ్యమంత్రి కేసీఆర్, హుజూరాబాద్ లో దళితబంధు ప్రారంభ సభకు, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయించారు. రాష్ట్రం నాలుగు మూలల నుంచి ఎమ్మెల్యేలకు కోటా ఫిక్స్ చేసి,ఏసీ బస్సులు పెట్టి, జన సమీకరణ చేశారు. అయినా, ఇంద్రవెల్లి సభ ముందు హుజూరాబాద్ సభ వెలవెల పోయిందనే చెప్పాలి. నిజమే,జనం వచ్చారు, కానీ, ఇంద్రవెల్లిలో కనిపించిన జోష్ హుజూరాబాద్’ లో కనిపించలేదు. అంతే, కాదు హుజూరాబాద్ సభకు వచ్చిన వారు వెళ్ళేటప్పుడు నిరాశగా వేణి దిరిగారు. కొంతమంది అయితే అధికార పార్టీని తిట్టుకుంటూ వెళ్ళడం కూడా కనిపించింది.  

సరే అదలా ఉంటే రేవంత్ రెడ్డికి దూకుడే గానీ, ఆలోచన లేదు అనే వాదనలోనూ పస లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఒక పథకం ప్రకారం సోషల్ ఇంగినీరింగ్’ కు శ్రీకారం చుట్టారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం రావిర్యాలలో నిర్వహించిన గర్జన సభలో తమ దూకుడు  ప్రసంగంలోనూ, ఇటీవల ఐపీఎస్ కొలువు వదులుకుని,బీఎస్పీలో చేరిన  ప్రవీణ్ కుమార పేరు తీసుకున్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రవీణ్ కుమార్ మరో ఆరేళ్ల సర్వీస్’తో పాటు  డీజీపీ స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నా, ఉన్న అవకాశాలను వదులుకుని దళితుల మేలు కోసం రాజకీయాలలోకి వచ్చారని అన్నారు. అలాగే, ఉద్యోగంలో కొనసాగుతూ, తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాలు, వివక్షను భరించలేక, దళిత బిడ్డగా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కొలివుకు రాజీనామా చేశారని చెప్పారు.ఇలా ప్రవీణ్ కుమార్’ను ఆకాశానికి ఎత్తేయడం, రేవంత్ రెడ్డి రాజకీయ విజ్ఞత, ముందు చూపుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్;లో బీఎస్పీపీ కలిసి సాగేందుకు, రేవంత్ ముందుగానే కర్చీఫ్ వేశారనీ అంటున్నారు.ఇలా కర్చీఫ్ వేయడం ద్వారా రేవంత్ రెడ్డి, కొత్త సోషల్ ఇంజనీరింగ్’కు శ్రీకారం చుట్టారనిఅనే మాట కూడా వినవస్తోంది. 

అలాగే ఇటీవల పీసీసీ, మైనారిటీ సెల్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు కార్యక్రమలో మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి, “కాంగ్రెస్ పార్టీ మీదే, ముస్లిం మైనారిటీలదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే”  అంటూ మైనారిటీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో బీజేపీ ముస్లిం మైనారిటీలను మోసం చేస్తున్నాయని ధ్వజ మెత్తారు.త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని, గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్’ కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, మైనార్టీ బంధు ఇవ్వాలంటూ తెరాస ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. కానీ, తెరాస మిత్ర పక్షం ఎంఐఎం పేరు కూడా ప్రస్తావించలేదు. 

ఇలా అటు దళితులను,ఇటు ముస్లిం మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయన వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రేవంత్ దూకుడులోనూ ఒక ఆలోచన, సోషల్ ఇంగినీరింగ్ వ్యూహం  ఉన్నాయని నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంతటి దౌర్భాగ్య స్థితికి చేరటానికి, పార్టీ ప్రధాన ఓటు బ్యాంక్ దళితులు, మైనారిటీలు, అలాగే, బడుగు బలహీన వర్గాలు పార్టీకి దూరం కావడమే అనేది ఒక చారిత్రక సత్యం. రేవంత్ ప్రస్తుత ప్రయత్నాలను జాగ్రత్తగ గమనిస్తే, ఎక్కడ పారేసుకున్నమో అక్కడే వెతుక్కోవాలనే రాజకీయ విజ్ఞతను చూపుతున్నారనిపిస్తుంది. దూరమైనా ఒక్కొక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుని ‘సోషల్ ఇంగినీరింగ్’ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం  భావిస్తున్నారు. అయితే, సోషల్ ఇంగినీరింగ్ ప్రయత్నాలలో అయన సక్సెస్ అవుతారా, అంటే అది వేరే విషయం, వేరే చర్చ అంటున్నారు విశ్లేషకులు. 

By
en-us Political News

  
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి
దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థుల్లో ధ‌న‌వంతుడు గా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. ఈ ఇద్ద‌రి గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు. 
ఎన్నికల వేళ ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఎపిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపా హాయంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. సహజవనరులను సైతం కొల్లగట్టడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు అంతే లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.  
ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టాలంటే యువత కూడా భయపడిపోతున్న పరిస్థితులు.
వల్లభనేని వంశి నోటి వెంట వచ్చే మాటలన్నీ పోలింగ్ కు ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన తరువాత వైసీపీలోకి జంప్ చేశారు. అంతుకు ముందు ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే, జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేద‌ని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మొదటి విడత ఓటింగ్ చూసి షాక్ తింటే, రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది
చేసేవన్నీ ఇల్లీగల్ పనులు.. అసలు విషయం బయటపడ్డాక నాకేమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు..
​వనపర్తి జిల్లా భూత్పూరు గ్రామానికి చెందిన రైతు శేఖర్ ఆదివారం నాడు తన పొలానికి
ఏపీ ఊడిపోయే సీఎం జగన్ మొన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టే విడుదల కార్యక్రమాన్ని సౌండ్ మ్యూట్
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.