పిల్లలను టార్చర్ చేస్తే నేరస్తులౌతారు

Publish Date:Nov 9, 2024

Advertisement

జాఫర్ బాయ్ కొడుకు ఫజల్ బాబా డ్రగ్స్ కు అలవాటయ్యాడు. ఆందోళన చెందిన జాఫర్ భాయ్ కొడుకును ప్రతీరోజు చితకబాదేవాడు. ఫజల్ బాబా తల్లి జాఫర్ భాయ్ ను వెంటపెట్టుకుని ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చింది. డ్రగ్స్ కు అలవాటుపడ్డ  నా  కొడుకును సన్మార్గంలో ఎలా పెట్టాలి అని మౌలానాను అడుగుతుంది
ఫజల్ బాబా తల్లి: సలాం వాలేకూం మౌలానా సాబ్. మేరా బేటా డ్రగ్స్ కా షికార్ బన్ గయా, హర్ దిన్  బాప్ సే మేరా బేటాకా పిటాయ్ హోరా 
 మౌలానా: వాలేకుం సలాం... తల్లిదండ్రులు పిల్లలను సన్మార్గంలో పెట్టే ప్రయత్నంలో హింసించకూడదు. ప్రేమతో నచ్చజెప్పాలి. ఫజల్ బాబా ప్రెండ్స్ అనేక సార్లు  డ్రగ్స్ రాకెట్ లో పట్టు బడ్డారు. మీరు అప్పుడే కంట్రోల్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు.పిల్లలను చులకన చేసే అధికారం తల్లిదండ్రులకు  కూడా లేదు.  సరిగ్గా  చదవడం లేదని తల్లిదండ్రులు  పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు.  చెడు వ్యసనాలకు అలవాటుపడిన పిల్లలను ప్రేమతో నచ్చజెప్పాలి. పిల్లలను అవమానపరచడం సరికాదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మౌనంగా ఉండాలి. ఎక్కువగా వాదులాడుకోవద్దు. అప్పుడే పిల్లలు అరవడం చేయరు. సంస్కారం అతి ముఖ్యం. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే ముఖ్యభూమిక వహిస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ప్రతీ ఒక్కరితో సంస్కారవంతంగా మాట్లాడాలి.ఈ విషయాలను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి.  నా కొడుకు ఈ తప్పు చేశాడు. ఆ తప్పు చేశాడు అని ఫిర్యాదులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు నొచ్చుకుంటారు. తండ్రి మీద పిల్లలకు ఎక్స్ పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల మీద ఫిర్యాదులు చేయడం వల్ల నిరాశావాదం వచ్చేస్తుంది. పిల్లలకు గౌరవం ఇవ్వాలి. పిల్లలను అమితంగా ప్రేమించాలి. పిల్లలకోసం టైం కేటాయించాలి.
 పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉన్నప్పటికీ కూతురు పెళ్లి చేసే బాధ్యత పూర్తిగా తండ్రికే ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వరకు పాలివ్వడం తల్లి పూర్తి బాధ్యత. ఖురాన్  ప్రకారం రెండేళ్లవరకు పిల్లలకు పాలు పట్టడం  తల్లి బాధ్యత.  పిల్లల విషయంలో తండ్రి స్నేహితుడి మాదిరిగా ఉండాలి గౌరవం ఏ మాత్రం తగ్గకూడదు. అదే తల్లి ప్రేమను ఎక్కువ పంచుతుంది. నవమాసాలు మోస్తుంది అంతే కాదు ప్రసవం సమయంలో అనేక నొప్పులు భరిస్తుంది. రెండేళ్లవరకు పిల్లలకు పాలివ్వడం అన్నీ కలిపి 30 నెలలు తల్లి బాధ్యత తీసుకుంటుంది. తండ్రి మాత్రం పిల్లలను ప్రయోజకులను చేసే వరకు పోషణ బాధ్యతలు తీసుకుంటాడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేసే వరకు తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. పిల్లలను టార్చర్ చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ పర్సెంటేజ్ తక్కువ అని చెప్పాలి. పిల్లలను మార్చే ప్రయత్నంలో తల్లిదండ్రులు వేధింపులకు  గురి చేస్తున్నారు. స్నేహితుల వల్ల ఎక్కువగా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారిపై నిఘా పెట్టాలి.  డబ్బు సంపాదించిన తండ్రి  కంటే ఇస్లాంను అమలు చేస్తున్న వ్యక్తులే మహనీయులు అని చెప్పాలి. 

                                                                               బదనపల్లి శ్రీనివాసాచారి

By
en-us Political News

  
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.