అమరావతి సభకు సర్వం సిద్దం.. తేలని పీఆర్సీ.. డీఎస్ రిటర్న్.. టాప్ న్యూస్@8PM

Publish Date:Dec 16, 2021

Advertisement

అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 
---
అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా గురువారం మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత యాత్ర చేపట్టారు. వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ నుంచి.. తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.  ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని.. ఏపీ రాజధాని అమరావతే అంటూ నినాదాలు చేస్తూ సునీత పాదయాత్ర సాగింది.
---------
సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని, విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలని జగన్‌ కోరారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జగన్‌ ప్రతిపాదనలపై సానుకూలంగా ఫ్లిప్‌కార్ట్‌ స్పందించింది. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు సుముఖత వ్యక్తం చేసింది. 
--------
ఏపీలో నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను చెల్లించకుండా వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జగన్ పక్కదారి పట్టించారని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. ప్రజల డబ్బుతో జగనన్న గోరు ముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎలా పెడతారని ప్రశ్నించారు.  జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో కోట్ల రూపాయల ప్రజల డబ్బును పక్కదారి పట్టించారని మండిపడ్డారు
--------
పీఆర్సీ పూర్తి నివేదిక ఉద్యోగులకు ఇవ్వాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు  డిమాండ్ చేశారు. గురువారం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ కమిషన్ నివేదికను పట్టించుకోలేదన్నారు. అధికారులను కమిటీ వేసి నచ్చినట్టు నివేదిక ఇచ్చారని చెప్పారు. 14.39 పిట్‌మెంట్‌కు ఉద్యోగులు వ్యతిరేకమన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు
---------
ఏపీ ఇరిగేషన్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డిపోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. తొలుత హిల్‌వ్యూ ప్రాంతం నుంచి స్పిల్వే, స్పిల్‌ చానల్‌, ఆప్రోచ్‌ చానల్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, డయాఫ్రంవాల్‌, గ్యాప్‌ 1, గ్యాప్‌ 2, గ్యాప్‌ 3 ప్రాంతాలను, స్పిల్‌వే, రేడియల్‌ గేట్లు, ఫిష్‌ ల్యాడర్‌, పవర్‌ హౌజ్‌, స్పిల్వేలో ఆప్రోచ్‌ చానల్‌, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీలో హెడ్‌ రెగ్యులేటర్‌, ఫేజ్‌ 4, ఫేజ్‌ 5 లలో జంటగుహల నిర్మాణం పనులు పరిశీలించారు.
----
రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. డీఎస్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరిపారు.  దాదాపు 40 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో డీఎస్ చేరిక దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. దీనిపైఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. 
----
స్థానిక సంస్థలను, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న సీఎం కేసీఆర్‌ సర్కార్‌పై రాజకీయాలకు అతీతంగా సర్పంచ్‌లంతా తిరగబడాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే చూశామని, సర్కార్‌ తీరుతో సర్పంచ్‌ల ఆత్మహత్యలను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
--
బీజేపీ నేత ‘మెట్రో’ శ్రీధరన్ రాజకీయాల నుంచి వైదొలగారు. ఆయన స్వస్థలం మలప్పురంలో మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. తన వయసు తొంభయ్యేళ్ళని చాలా మందికి తెలియదన్నారు. తన వయసుకు సంబంధించి తాను అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నానని చెప్పారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తాను చెప్పానంటే, దాని అర్థం రాజకీయాలను వదిలిపెడుతున్నట్లు కాదన్నారు. 
--------
కర్ణాటకలో మత మార్పిడి నిషేధ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను న్యాయశాఖ సన్నద్ధం చేసింది. మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021ని బెళగావిలో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదించాలని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ తీరని వారిని, మహిళలు, మానసిక వైకల్యం ఉన్నవారిని బలవంతంగా మతమార్పిడి చేస్తే 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు. 
----
 

By
en-us Political News

  
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.