ఫ్యాన్‌కు ఓటేస్తే ఫ‌స‌క్‌.. మోత్కుప‌ల్లి ఫిక్స్‌.. జ‌న‌సేన=పిచ్చిసేన‌.. టాప్ న్యూస్ @ 7pm

Publish Date:Oct 16, 2021

Advertisement

1. ఏపీలో ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్‌ ఆగిపోయిందని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. ‘‘ఓ వైపు విద్యుత్‌ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. మరోవైపు విద్యుత్‌ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి.. అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవ‌డంలో జ‌గ‌న్ బిజీ అవ్వ‌డం వ‌ల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి అంటూ అని నారా లోకేశ్‌ ఆరోపించారు.  

2. ఏపీలో ప్రజలకు విద్యుత్‌ లేకుండా చేసేందుకు జగన్‌ కంకణం కట్టుకున్నారని బీజేపీ నేత లంకా దినకర్‌ మండిపడ్డారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితిలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో అస్తవ్యస్థ పాలనతో పరిశ్రమలు కుదేలయ్యాయన్నారు. విద్యుత్‌ లేక పరిశ్రమల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారబోతోందని దిన‌క‌ర్‌ విమ‌ర్శించారు.  

3. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈ నెల 18న ఆయన సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆలేరు, భువనగిరితోపాటు మునుగోడు నియోజకవర్గంలోని తన అనుచరులు, అభిమానులతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆయన ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. మోత్కుప‌ల్లికి దళితబంధు చైర్మన్‌ లేదా ఎమ్మెల్సీ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 

4. సీఎం జగన్‌కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు రవికుమార్, బాల వీరాంజనేయస్వామి, సాంబశివరావులు మ‌రో లేఖ రాశారు.  ప్రకాశం జిల్లా ప్రగతి, సమస్యలపై సీఎం శ్రద్ధ వహించడం లేదన్నారు. గతంలో రాసిన లేఖల్లో రాజకీయం వెతికారు తప్ప ఆవేదనని అర్థం చేసుకోలేదని చెప్పారు. ఎవరి ప్రయోజనాల కోసం "వెలుగొండ"కి అన్యాయం చేస్తున్నారు? అని లేఖ ద్వారా ప్రశ్నించారు.

5. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాకలో దళితులపై దాడి జరిగింది. ప్ర‌కాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదంటూ జార్జ్ అనే వ్యక్తిపై సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డి పోటీచేసి ఓడిపోయారు. మీ సామాజికవర్గం వారు ఓటు వేయకపోవటం వల్లే తాము ఓడిపోయామంటూ జార్జ్‌పై దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. 

6. జనసేన నాయకుడుకు పిచ్చి పరాకాష్టకు చేరినట్టే.. జన సైనికులకు అదే పరిస్థితి ఏర్పడిందంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. పెట్రో ధరలు పెరిగాయని ప్రకాశం జిల్లాలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్న బస్సుకు నిప్పు పెట్టిన వ్యక్తి జనసైనికుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు జనసేనకు ఓటు వేయలేదని జనాన్ని చంపేస్తారేమోనని అన్నారు. షూటింగ్ అయిపోగానే రెండు నెలలకు ఒకసారి వచ్చి రెండు మీటింగులు పెట్టి యుద్ధం చేద్దామంటాడని విమర్శించారు. 

7. ఏపీవ్యాప్తంగా కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. కరెంట్‌కు బొగ్గు ఇవ్వలేని వారు, ఆక్వాకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మందు చూపు ఉందా లేదా అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. మందుపై ఉన్న చూపు విద్యుత్‌పై ఎందుకులేదో మనం ఆలోచన చేయాలని  రఘురామ సూచించారు. 

8. దుగ్గిరాల ఎంపీపీ ఎంపికలో వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం ఎదుట టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీన్, టీడీపీ నేతలు బైఠాయించారు. తక్షణమే దుగ్గిరాల టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జబీన్‌కు బీసీ-ఇ కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గమని.. ముస్లింలకు రాజకీయ సమాధి కట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని టీడీపీ మండిపడింది. 

9. న్యాయస్థానాలు, దేవస్థానాలు మాత్రామే రైతులకు న్యాయం చేస్తాయని నమ్ముతున్నామని.. అమరావతి రైతుల ఉద్యమం 669వ రోజుకు చేరుకున్న సంద‌ర్భంగా వారు అభిప్రాయ‌ప‌డ్డారు. దేవి నవరాత్రుల సందర్భంగా మందడం గ్రామంలో అమ్మవారి ఊరేగింపులో అమరావతి గ్రామాల రైతులు భారీగా పాల్గొన్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని, రైతు మహాపాదయాత్ర విజయవంతం కావాలని రైతులు అమ్మవారికి మొక్కుకున్నారు. 

10. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ నేత ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించనట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్కే అంత్యక్రియలు పూర్తి అయినట్లు చెబుతున్నారు. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా కప్పి మావోయిస్టులు నివాళులు అర్పించారు.
 

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.