ఏపీకి టాలీవుడ్ తరలింపు సాధ్యమేనా?

Publish Date:Dec 23, 2024

Advertisement

తెలంగాణ నుంచి తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి తరలనుందన్న చర్చ మరో సారి మొదలైంది. రాష్ట్ర విభజనకు ముందే ఈ చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ హీరోలను టార్గెట్ చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. దీంతో అప్పటి నుంచే రాష్ట్రం విడిపోతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడం ఖాయమన్న చర్చ అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్ర విభజన జరిగి బీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలో ఇండస్ట్రీ ఇక ఏపీకి తరలిపోవడం లాంఛనమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది కూడా.

అయితే అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారంలోకి వచ్చే వరకూ తెలుగుహీరోలను, ఆంధ్రామూలాలున్న సీని వ్యక్తులను టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఆ తరువాత వైఖరి మార్చుకుంది. రాష్ట్ర ఆదాయంలో మద్యం తరువాతి స్థానం సినీ ఇండస్ట్రీదే కావడంతో బీఆర్ఎస్ సర్కార్ తెలుగు సినీ పరిశ్రమను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఉద్యమ సమయంలో తరిమి కొడతాం అంటూ హెచ్చరికలు జారీ చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత సినీ పరిశ్రమను ఇతోధికంగా ప్రోత్సహించి, అక్కున చేర్చుకుంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమ తెలంగాణలో హాయిగా కొనసాగింది.  అయినా ఇలా ఒక సమస్య వచ్చిందని పరిశ్రమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించేయడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. హైదరాబాద్ లో దశాబ్దాల పాటు పాతుకుపోయిన టాలీవుడ్ పరిశ్రమ తనకు అవసరమైన మౌలిక వసుతలన్నీ ఇక్కడ అభివృద్ధి చేసుకుంది. పరిశ్రమ అంటే ఒక్క సినిమా  షూటింగ్ మాత్రమే కాదు. స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు, ఆర్టిస్టుల నివాసాలు ఇలా ఎన్నోఎన్నెన్నో ముడిపడి ఉన్నాయి. 

ఇప్పుడు ఒక్క హీరోకు కష్టం వచ్చిందని పరిశ్రమ తరలిపోబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మడం కష్టం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఏపీకి టాలివుడ్ తరలిపోబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  పరిశ్రమ మనుగడకు అవసరమైన సకల మౌలిక సదుపాయాలూ హైదరాబాద్ లో అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో పరిశ్రమ విస్తరణకు అవకాశాలు ఉంటే ఉండొచ్చు.. వాటిని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమ అక్కడా విస్తరించేందుకు ఆస్కారం ఉంది కానీ.. ఇక్కడ నుంచి తట్టాబుట్టా సర్దేసుకునే మొత్తం ఇండస్ట్రీ, హీరోలు, నిర్మాతలూ తట్టాబుట్టా సర్దేసుకుని ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయే అవకాశాలు ఇసుమంతైనా లేవని గట్టిగా చెప్పవచ్చు.   ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాల్సి ఉంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద మంత్రదండం ఏమీ లేదు. రాత్రికి రాత్రి టాలీవుడ్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి.  

అల్లు అర్జున్ ఎపిసోడ్ తో టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఏపీ ప్రభుత్వం వైపు చూడటం సహజమే. అయితే ఆ ఆపన్నహస్తం అందించేందుకు ఏపీ సర్కార్ ముందుకు వస్తుందన్న నమ్మకం లేదు. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండాలనే ఏపీ సర్కార్ భావిస్తుంది.  కనుక ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా తెలంగాణ ప్రభుత్వంతో  ఘర్షణ వైఖరికి ఇష్టపడరు. అందుకే తెలంగాణలో స్ధిరపడిన తెలుగు సినీ పరిశ్రమ కోసం వారు కనీసం మాట సాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవచ్చు. 

ఏపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు చెందిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ ఉన్నారు. సినీ ప్రముఖులలో పలువురికి వారితో, సిఎం చంద్రబాబు నాయుడుతో  సత్సంబంధాలున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా సినీ పరిశ్రమ పట్ల చాలా సానుకూలంగానే ఉంటారు. పైగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న ఈ సమయంలో టాలీవుడ్‌ కదిలి రావడానికి ఇదే సరైన సమయమని పలువురు భావిస్తున్నారు.  ఇక సినిమాల కలెక్షన్ల పరంగా చూస్తే తెలంగాణ కంటే ఏపీ నుంచే సీనీమాలకు ఆదరణ ఎక్కువ. అలాగే కలెక్షన్లూ అధికం.  సినిమా స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడానికి, షూటింగ్‌లు చేసుకోవడానికి ఏపీలో అన్ని హంగులూ ఉన్నాయి. కొత్తగా మరో మూడు విమానాశ్రయాలు వస్తున్నాయి. కనుక అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం గొడవ దీర్ఘ కాలం కొనసాగితే మాత్రం ఏపీకి పరిశ్రమ తరలిరావడానికే సీనీ ప్రముఖులు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. అయినా సీనిమా సీజన్ గా చెప్పుకునే సంక్రాంతి నాటికి కూడా అల్లు అర్జున్ వివాదం సర్దుమణగకపోతే.. సినిమాల బెనిఫిట్ షోలు, ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించకుంటే.. అప్పుడు టాలీవుడ్ కచ్చితంగా ఏపీ వైపు చూస్తుందనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.