Publish Date:Oct 16, 2019
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటించగా, టీఎన్జీవో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వకపోతే ప్రజల్లో చులకనవుతామంటూ టీఎన్జీవో జిల్లా యూనియన్ల నుంచి రాష్ట్ర కార్యవర్గంపై ఒత్తిడి పెరగడంతో... ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.
టీఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమైన కార్యవర్గం... మొత్తం నాలుగు తీర్మానాలు చేసింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వడంతోపాటు కార్మికుల తరపున చర్చలకు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డిని సీఎం కేసీఆర్ దగ్గరకు పంపాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతోపాటు రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించాలని నిర్ణయించారు.
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తమను తీవ్రంగా బాధించాయన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... కిందిస్థాయి ఉద్యోగుల ఒత్తిడి మేరకు సమ్మెకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించామన్న రవీందర్ రెడ్డి... అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిచి... సీఎస్ను కలుస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేసిన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... ప్రభుత్వం దిగిరాకపోతే.... మరో సకల జనుల సమ్మెకు సిద్ధంకావాల్సి వస్తుందని హెచ్చరించారు.
అయితే, ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు ప్రకటించడంపై అశ్వద్ధామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు అత్యంత కీలక పాత్ర పోషించారన్న అశ్వద్ధామరెడ్డి... తమకు మద్దతిచ్చిన టీజీవోలు, టీఎన్జీవోలకు రుణపడి ఉంటామన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tngo-support-rtc-strike-25-90103.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.