తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చజరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో నిజాల నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలోని సీట్ దర్యాప్తు చేసి నివేదిక సమర్పించింది. ఇప్పుడు ఆ నివేదికపై తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సిట్ నెయ్యిలో కల్తీని నిర్ధారించడమే కాకుండా, జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చింది.
అయితే సిట్ నివేదికను తనకు అనుకూలంగా చెప్పుకుంటూ వైసీపీ రాజకీయం మొదలెట్టింది. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కతోవ పట్టించే విధంగా వైసీపీ కొత్త వాదనకు తెరతీసింది. చంద్రబాబు ఆరోపించినట్లుగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనీ, చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేశారంటూ ఎదురు దాడికి దిగింది. దీనిపై ప్రస్తుతం ఏపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు అవాస్తవాలను చెప్పారంటూ వైసీపీయులు చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం దీటుగా జవాబిస్తోంది.
సరిగ్గా ఈ తరుణంలో విషయం జాతీయ స్థాయి మీడియాలోనూ చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు. సిట్ నివేదికలోని అంశాలను చదివి మరీ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తు తేల్చిందనీ, ఇంత అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా అడ్డగోలు వాదనలేంటంటూ జగన్ ను ఆయన పార్టీ ప్రతినిథులను నిలదీశారు.
మూడు శతాబ్దాలుగా భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి వైసీపీ మహాపాపానికి ఒడిగట్టిందని అర్నాబ్ గోస్వామి నిష్కర్షగా చెప్పారు. జగన్ హయాంలో అంటే 2019-24 మధ్య కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి ముమ్మాటికీ కల్తీదేనని దర్యాప్తు సంస్థలు సందేహాలకు అతీతంగా తేల్చేశాయన్నారు.
అక్కడితో ఆగకుండా, ఆయన జగన్ ను ఆయన విశ్వసించే మతాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తువుల సెంటిమెంటుతో ఇలా ఆడుకోగలరా అని సూటిగా ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులూ ఎత్తి నమస్కరించి క్షమాపణలు చెప్పాలని అర్నాబ్ గోస్వామి వైసీపీ నేతలను డిమండ్ చేశారు. అలాగే ఇదే అంశంపై జరిగిన చర్చలోనూ వైసీపీ నేతలను నిలదీసి నిలబెట్టేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-laddu-contravarsy-39-213673.html
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.