శ్రీవారికి సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల బంగారు ఆభరణాలు విరాళం
Publish Date:May 16, 2025
Advertisement
తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇవాళ ఉదయం సంజీవ్ గోయెంకా తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-39-198180.html
http://www.teluguone.com/news/content/tirumala-39-198180.html
Publish Date:Dec 24, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 21, 2025
Publish Date:Dec 21, 2025
Publish Date:Dec 21, 2025
Publish Date:Dec 20, 2025
Publish Date:Dec 20, 2025
Publish Date:Dec 20, 2025
Publish Date:Dec 20, 2025





