ఇలా చేశారంటే చాలు అరటిపండ్లు ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయ్..!

Publish Date:Jun 12, 2024

Advertisement

 

 అరటిపండ్లు పేదవాడికి కూడా అందుబాటు ధరలో ఉండే పండు. ఉపవాసాలు ఉండే వారి నుండి భోజనం తరువాత ఏదైనా పండు తినాలనుకునే వారి వరకు చాలామంది అరటిపండ్లు తినడానికే మొగ్గు చూపుతారు.  రోజూ ఓ అరటిపండు తినాలని చాలామందికి  ఉంటుంది. కానీ అరటిపండ్లు తెచ్చిన రెండు రోజులకే నల్లగా మారి కుళ్లిపోతుంటాయి. ఇలాంటి పండ్లు తినబుద్ది కాదు.  కానీ మార్కెట్లో మాత్రం అరడజను నుండి డజను మాత్రమే కొనుగోలు చేయగలం.  అరటిపండ్లు కొన్న తరువాత ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలన్నా..  వాటిని తాజాగా తినాలన్నా ఈ కింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది.


అరటిపండ్లు తాజాగా ఉండాలన్నా,  త్వరగా నల్లబడకుండా ఉండాలన్నా వాటిని కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడా నల్లగా లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి.   కొనుగోలు  చేస్తున్న పండ్లలో ఏదైనా ఒక పండు   మెత్తగా లేదా నల్లగా ఉన్నట్టు కనిపించినా  వాటిని కొనకూడదు.  ఎందుకంటే ఇలాంటి పండ్లు ఉంటే ఆ పండ్ల మొత్తాన్ని నిల్వ చేసినప్పుడు అవి త్వరగా పాడైపోతాయి.


 అరటిపండ్లను అమ్మేవారు పండ్లను ప్లాస్టిక్ కవర్ లో ఇస్తుంటారు.  వాటిని ఇంటికి తీసుకువచ్చిన వెంటనే  కొనుగోలు చేసిన ప్లాస్టిక్ కవర్ ను తొలగించాలి. అరటిపండ్లు వచ్చిన సంచిలో  ఇథిలీన్ వాయువు పేరుకుని ఉంటుంది.  పండ్లను కవర్ లోనే అలాగే ఉంచితే..  అరటిపండు పండే ప్రక్రియ వేగం పెంచుతుంది. అందుకే  అరటిపండ్లను ఇంటికి తీసుకువచ్చి వేరొక కవర్ లోకి మార్చాలి.

అరటిపండ్లు నల్లగా, మెత్తగా కాకుండా ఉండాలంటే అరటి పండ్ల తొడిమ  భాగాన్ని ప్లాస్టిక్‌ కవర్ తో కవర్ చేయాలి. ఇలా చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. . దీనివల్ల అరటిపండు త్వరగా పండదు, తాజాదనం అలాగే ఉంటుంది.


అరటి గుత్తి కాండంపై ప్లాస్టిక్ కవర్ ను  కప్పే బదులు ఒక్కో అరటి కాండం విడివిడిగా చేసి వాటిమీద కప్పి ఉంచినా  అరటి పండు పక్వానికి వచ్చే ప్రక్రియ మందగిస్తుంది. అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.


అరటిపండ్లు మాత్రమే కాకుండా ఇతర పండ్లు కూడా ఎథిలీన్ వాయువును విడుదల చేస్తాయి.  పండ్లు అన్నీ ఒక్కచోట ఉండటం వల్ల చాలా  పక్వానికి గురయ్యేది ఇందుకే. అందుకే అరటిపండ్లను ఇతర పండిన పండ్లతో ఉంచడం మానుకోవాలి. అరటిపండ్లను విడిగా ఉంచితే అవి త్వరగా పండవు,  తాజాగా ఉంటాయి.


అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచే బదులు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఒక గిన్నెలో అరటిపండ్లను తలక్రిందులుగా ఉంచాలి. అరటిపండ్లను ఏ కంటైనర్ లో అయినా పెట్టి గట్టిగా నొక్కి ఉంచకూడదు. దాని బదులు వాటిపై  గాలి ఉండే విధంగా వాటిని నిల్వ చేయాలి.


అరటిపండ్లను అంగళ్లలో అమ్మే వారిలాగా హుక్ కు వేలాడదీయబడం వల్ల  అవి తొందరగా పక్వానికి లోను కావు.  వీటికి గాలి బాగా తగులుతూ ఉంటుంది కాబట్టి అవి తొందరగా పక్వం చెందవు.


                                           *రూపశ్రీ.

By
en-us Political News

  
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.