Publish Date:Oct 20, 2022
ఒత్తుగా, పొడవుగా చక్కటి జడ వేసుకుని ఆడపిల్లలు తిరుగుతూండాలే అంటూంది పెద్దమ్మ. అలా ఈ రోజుల్లో అవుతోందా? పదో తరగతి దాటితే చాలు పొడవు జడ కాస్తా స్టయిల్ మార్చుకుంటుంది. కానీ అది ఏమాత్రం బావుందనేది వేరే సంగతి.ట్రండ్ ఫాలో కావాలి. అభిమాన హీరోయిన్ ఎలా వేసుకుంటే అలా ఉండాలంతే. దీనికి తల్లి కూడా అంగీకరించాల్సిందే. పిల్ల మరీ ముద్దొస్తోందే.. పోనీలే ఉండనీ అని గారా బు చేసి పెద్దామెను ఒప్పిస్తుంది. అదో సరదా! కానీ ఈ పాప మాత్రం సరదాగా ఏమీ లేదు. అద్దం ముందు చూసుకుంటున్న తన వొత్తయిన చూడముచ్చటి జుత్తు చూసి ఎంతో ఆనందిస్తోంది. కానీ అదో విగ్గు! అవును విగ్గు పెడుతున్నావిడ పేరు టిఫానీ.
టిఫానీకి ఆ పిల్లంటే మహా ప్రేమ. అంతకు మించిన దయా, కరుణ. కానీ ప్రేమ కంటే దయను ఆమె ప్రదర్శించడం ఇష్టంలేదు. ఎందుకంటే ఆ పిల్ల అనారోగ్యం టిఫానీకి బాగా తెలుసు. ఆ పిల్ల చూడ ముచ్చట గానే ఉంది. కానీ ఆమె కాన్సర్తో బాధపడుతోంది. ఆమెకు కెమో థెరిపీ చేస్తున్నారు. ఆ కారణంగా ఆ చిన్నతల్లి చక్కటి జుత్తును కోల్పోయింది. కానీ ఆమెను దిగులుగా చూడటం ఇష్టంలేక తల్లి విగ్గు పెట్టించి ఆ పిల్లను ఆనందంగా ఉండేట్టు చేసింది. అందుకే విగ్గులు తయారుచేసి ఇలాటివారికి ఉచితంగా ఇచ్చే టిఫానీ అనే ఫ్యాషన్ డిజైనర్ని కలిసింది. పాప కథ విన్నది. తీసుకువచ్చాక మనసు రోదించింది. దగ్గరకు తీసుకుని నీకు మంచి జుత్తు నేను ఇస్తానన్నది. అంతే కొత్తగ తయారుచేయించి ఆమెకు అమర్చి అద్దం ముందు కూర్చోబెట్టి చూపింది.
ఆమెకు కాన్సర్ అని తెలిసినప్పటికి ముందు, కిమోథెరపీ చేయించుకోవడానికి ముందు ఎలా ఉండేదో అంతే అందమైన జుత్తుతో ముద్దుగా ఉంది. ఆ భావం టిఫానీ కల్పించింది. అదే ఆనందంతో ఆమె మరి కొన్నాళ్లు ప్రశాంతంగా, ఇతర పిల్లల్లా చక్కగా నవ్వుతూ సరదాగా బతికేస్తుంది. వాస్తవానికి ఆమె జబ్బు చాలా సీరియస్ స్థాయికి చేరుకుందని డాక్టర్లు చెప్పారు. ఆమెకు మాత్రం అదేమాత్రం నిన్ను బాధిం చదు. కాకుంటే కాస్తంత జుత్తు పోయిందంతే...జుత్తుకోసం బెంగెట్టేసుకోకమ్మా.. అన్నారు. డాక్టర్లు ఇచ్చే ధైర్యం, తల్లిదండ్రుల ప్రేమ ఆమెను మరింత కాలం కాలంగడిపేలా చేస్తుంది. ఇపుడు ఆమెకు టిఫానీ ఇచ్చిన ధైర్యాన్ని, సరదానీ మించి ఎవరు ఇవ్వగలరు. తోటి స్నేహితులు, పక్కింటివాళ్లూ ఆమెను మళ్లీ ఇంతే సరదాగా చూడాలనుకుంటున్నారు. ఇదే చూస్తారు, చూడాలి. ఆమె చిరకాలం బతకాలనే అనుకుంటు న్నారు. మనసు మాత్రం రోదిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tiffany-medicine-to-cancer-girl-39-145794.html
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.