భారత దౌత్య బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలు

Publish Date:May 20, 2025

Advertisement

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత  ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని  9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత పాక్ భారత్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడటం, వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టడం అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు ఒకింత సడలినా..  పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత్ వ్యూహాత్మకంగా  పాకిస్థాన్ పై దౌత్యయుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే..  పహల్గాం ఉగ్రవాదికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తదననంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది.   ఈ ఏడు ప్రతినిథి బృందాలకు అఖిల పక్షాలకు చెందిన నేతలు నాయకత్వం వహిస్తారు. ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. అలాగే మిగిలిన ఆరు బృందాలకూ.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, అదే పార్టీకి చెందిన వైజయంత్ పాండా, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా,  డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన (ఏక్ నాథ్ షిండే) ఎంపీ శ్రీకాంత్  నాయకత్వం వహిస్తారు. కాగా ఈ బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలకు కూడా స్థానం దక్కింది.  

రాజమహేంద్రవరంఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రవిశంక్ ప్రసాద్ నేతృత్వం వహించే బృందంలో సభ్యురాలు. ఈ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ లలో పర్యటిస్తుంది. అలాగే... ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలె నాయకత్వంలోని బృం దంలో  నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం నాయకుడు లావు కృష్ణదేవరాయులు సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం ఈజిప్ట్, క్వటార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలలో పర్యటిస్తుంది. ఇక శశిథరూర్ నేతృత్వం వహించే బృందంలో అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలలో పర్యటిస్తుంది.  

By
en-us Political News

  
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI159 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే టేకాఫ్ కు ముందు ఈ సమస్యను గుర్తించడంతో పెను ముప్పు తప్పింది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంకారావు అనే వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయనను.. ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్టు అక్కడికక్కడే ప్రకటించి సీఎం చంద్రబాబు ఓ సంచలనమే రేపారు.
యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబ‌ర్ ఏ1315 బోయింగ్ 7878 డ్రీమ్ లైన‌ర్ చిన్న సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో తిరిగి హాంకాంగ్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌కటించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికుల గుండెలు అర‌చేతిలోకి వ‌చ్చేశాయి.
ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్నది. ఇరుదేశాలు దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ఇరాన్‌ ధ్వంసం చేసింది. ఇరాన్‌ ఇంతకాలం హమాస్, హెజ్బొల్లా వంటి ప్రాంతీయ శక్తులను ఇజ్రాయెల్‌ పైకి ఎగదోసేది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేరుగా ఇరాన్‌పై దాడికి దిగింది.
రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన నంబర్ టు అనుకుంటారు.. అన్ని శాఖలు తనవే అనుకుంటారు.. హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో ఉంటారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందా అంటే అదీ లేదు. కాని ఆయన సఖల శాఖలపై ప్రకటనలు చేస్తారు.
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్ దాడులతో జనం తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన దారుణం కుప్పం పరిధిలోని నారాయణపురంలో జరగింది.
ఫోన్ ట్యాపింగ్ విచార‌ణాధికారులైన డీసీపీ విజ‌య్ కుమార్, ఏసీపీ వెంక‌ట‌గిరి  ప్రభాకరరావును విచారించడంలో కొత్త టెక్నిక్ వాడుతున్నారు.  
శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (జూన్ 17) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎటీజీహెచ్ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో సికింద్రాబాద్‌ సన్‌ సైన్‌ ఆసుపత్రిలో హరీశ్‌రావు చేరారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.