Publish Date:Jan 23, 2025
చెక్ బౌన్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలలు జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర మిశ్రా అను వ్యక్తి ఫిర్యాదు మేరకు 2018లో ఆయనపై ముంబైలో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసుపై అంధేరీ కోర్టులో విచారణ జరిగింది. దాదాపు ఏడేళ్ల తరువాత అంధేరీ కోర్టు ఈ కేసులో రామ్ గోపాల్ వర్మను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది.
గత ఏడేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసులో అంధేరీ కోర్టు ఇప్పటి వరకూ పలు మార్లు రామ్ గోపాల్ వర్మకు సమన్లు పంపింది. కోర్టుకు నేరుగా హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులూ ఇచ్చింది. అయితే వాటిని వేటినీ రామ్ గోపాల్ వర్మ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు మేరకు ఆ తీర్పు మేరకు రామ్ గోపాల్ వర్మ మూడు నెలలు జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుంది. అలాగే మూడు నెలలలోగా ఫిర్యాదు రాదు మహేష్ చంద్ర మిశ్రాకు 3 కోట్ల 72 లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంది. అలా చెల్లించని పక్షంలో రామ్ గోపాల్ వర్మ మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/three-months-jail-to-rjv-39-191724.html
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్ కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు
స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. సింపుల్గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. వీళ్లు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది.
హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే.. మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారుచేస్తున్నారు.
గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం ర్యాలీలో ఈ గొడవ చోటుచేసుకుంది. పట్టాభిపురం సీఐ మధ్య తీవ్ర వాగ్వాదన్నికి దిగారు
క్రికెట్లో రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్ కప్ను ముద్దాడింది.
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను బుధవారం (జూన్ 4) జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ పాలనపై నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమరశంఖం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ రాక్షస పాలనపై ప్రజలలో చైతన్యం తీసుకు రావడంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రముఖ పాత్ర వహించిందని పేర్కొన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వెనుపోటు దినంలో భాగంగా చీపురుపల్లిలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాన్నా పులి కథ, తెలుసు కదా.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా అలాగే వుంది. అందుకే.. ఇప్పుడు నిజంగానే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా, జనం నమ్మేలా లేరు. సరే.. జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల కవిత.. సర్వం తానై నడిపిస్తున్న పొలిటికల్ డ్రామాలో ఇంతవరకు సైలెంట్ స్పేక్టేటర్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, తొలి సారిగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం స్పందించారు.
తుని కేసు.. అప్పట్లో ఏపీలో ఓ సంచలనం. కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదస్పదమైంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించారు.
ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్ లో యశ్వంత్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు.