బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పై రౌడీషీట్  ?  

Publish Date:Jan 23, 2025

Advertisement

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసులు సిద్దమౌతున్నట్లు  తెలుస్తోంది. హస్కో అంటే డిస్కో చేసే రకం కౌశిక్ రెడ్డి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఆయన.  ఇంత చేయమని చెబితే అంత చేస్తారాయన. హుజురాబాద్ లో దళితబంధు అమలు కావడం లేదని పెద్ద ఎత్తున  ధర్నా ఆర్గనైజ్ చేసి హైడ్రామా చేశారు.. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని వ్యక్తి కౌశిక్ రెడ్డి. అయినప్పటికీ బిఆర్ఎస్ కౌశిక్ రెడ్డికి పెద్ద పీట వేస్తోంది. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న బాల్క సుమన్, గువ్వల బాల్ రాజు, గాదెరికిషోర్ తదితరులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.వారు ఓడిపోవడంతో కౌశిక్ రెడ్డి కి ప్లస్ పాయింట్ అయ్యింది.     రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి  కల్వకుంట్ల  ఫ్యామిలీ తప్పితే   బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఫేస్ వ్యాల్యూ ఉన్నవారెవరూ లేకపోవడం కౌశిక్ రెడ్డికి కలిసొచ్చింది. .      కౌశిక్ రెడ్డికి రెడ్డి ట్యాగ్ లైన్ కలిసొచ్చింది.  బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలలో రెడ్డి సామాజికవర్గం నుంచి  వచ్చిన వారు వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిందే . వాళ్లంతా యాక్టివ్ గా లేరు. కౌశిక్ రెడ్డి దూకుడు స్వభావం కాదు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండేవారు. క్రికెట్ ప్లేయర్ నుంచి పొలిటికల్ లీడర్ గా టర్న్ అయిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీర విధేయుడిగా ఉండేవారు. బిఆర్ ఎస్ లో చేరినప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. కానీ గత అసెంబ్లీ ఎన్నికలలో హేమాహేమీలు ఓడిపోవడం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఒరిజినల్ స్వభావం మారిపోయింది. కెసీఆర్ , కెటీఆర్ , హరీష్ రావ్ తర్వాత ఆ స్థాయి వ్యక్తులెవరూ బిఆర్ఎస్ లో లేకపోవడంతో కౌశిక్ రెడ్డికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.  కొత్త క్రిమినల్ చట్టమైన బిఎన్ఎస్ క్రింద కేసు నమోదైన  మొదటి ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డి. 
 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంగర్ పోలీసులు  సంక్రాంతి పండుగ రోజే అరెస్ట్ చేశారు.మెజిస్ట్రేట్  కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.  కాంట్రవర్సితో నిత్యం వార్తలలో కెక్కే   కౌశిక్ రెడ్డిని  అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం  గతంలో వెనకడుగు వేసింది.  బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని కౌశిక్ రెడ్డి గత సంవత్సరం చేసిన గొడవ  అంతా ఇంతా కాదు. ఈ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అరికెపూడికి బిఏసి చైర్మన్ పదవి రావడంతో కౌశిక్ రెడ్డి ఊగిపోయారు. అరికెపూడి ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు. ఒక ఎమ్మెల్యేను మరో ఎమ్మెల్యే కొట్టడం వార్తలలోకెక్కింది. ఇద్దరూ బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. ఒకప్పుడు చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన వారే. ఒకప్పటి మిత్రులు శత్రువులయ్యారు.  అరికెపూడి విషయంలో  అప్పట్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ తర్వాత ఉపసంహరించుకుంది.  తాజాగా బిఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. ఇటీవలె జరిగిన జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దాడి చేశారు.బూతు పురాణంతో కౌశిక్ రెడ్డి సంజయ్ పై చిందులేసారు.ఒక దశలో ఈ సమీక్షా సమావేశంలోనే ఎమ్మెల్యే సంజయ్ ను కొట్టారు.   సంజయ్ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనపై దాడి జరిగిందని సంజయ్ పోలీసులతో బాటు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కూడా. ప్రస్తుతం ఇదే కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టై విడుదలయ్యారు. . జూబ్లిహిల్స్ లోని ఓ టీవీ చానల్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమం  ముగించుకుని తిరుగు ప్రయాణంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి దూకుడుకు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జంప్ అయిన సంజయ్ అడ్డుకట్టవేసారని పరిశీలకులు చెబుతున్నారు.
 ప్రస్తుతం కండిషన్ బెయిల్ మీద బయటకొచ్చిన కౌశిక్ రెడ్డి జూబ్లిహిల్స్ పిఎస్ ఇన్స్ పెక్టర్ ఫిర్యాదు మేరకు ఒక కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ దశలో ఉంది.ఈ విచారణలో కౌశిక్ రెడ్డి ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.  కౌశిక్ రెడ్డిపై  మరో మారు ఈ తరహా ఫిర్యాదులు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

By
en-us Political News

  
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్ల కాలంలో తన హవా చాటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, తన సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే గా ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీలను శాసించేవారు.
ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ ఆపి అమెరికాకు మోకాలొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్థాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి రెండుమూడు దశాబ్దాలు పడుతుందంటూ.. యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమౌతోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టైలే డిఫరెంట్. అభివృద్ధి పనుల విషయంలో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ ముందుకు కదులుతారు. తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ లో దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఓకే రోజు ప్రారంభిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ అకస్మాత్తుగా భారత్,పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరగడం..కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలనూ అంగీకరింపచేయడం తన ఘనతేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుని, తనను తానే ఓ గొప్ప శాంతి దూతగా అభివర్ణించేసుకోవడం తెలిసిందే.
భారత్ పై టర్కీ డ్రోన్స్ తో పాక్ దాడి చేసింది. నాలుగురోజుల ఆపరేషన్ సింధూర్ తో భారత్ గట్టి జవాబు ఇచ్చింది. వందల సంఖ్యలో టర్కీడ్రోన్స్ ను భారత్ కూల్చివేసింది. 2023 లో టర్కీలో వచ్చిన భూకంపానికి ఆ దేశం కకావికలం అయి దిక్కుతోచని స్థితిలో పడిన సమయంలో ఏ దేశం ముందుకు రాని స్థితిలో భారత్ ఆపరేషన్ దోస్తు అంటూ ఆహారం,మందులు ఇతర సహాయం అందించింది.
జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడవు ముగిసనా ఎన్నికలు జరగక పోవడం వలన స్థానిక సంస్థలకు రావలసిన కేంద్ర నిధులు ఆగిపోయాయి. దీంతో కులగణన అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (మే15) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
కల్నల్ సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉగ్రవాదుల సోదరిగా పేర్కొంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషీ 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరారు. 2016లో మల్టీనేషనల్ మిలటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి ఉన్న నెక్సస్ ప్రతి సందర్బంలోనూ బయటపడుతూనే ఉందిద. భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర సంస్థల ప్రమేయం, వాటికి పాకిస్థాన్ ప్రభుత్వ, సైన్యం సహాయ సహకారాలు మద్దతు ఉన్నట్లు పదేపదే రుజువైంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు దాదాపు 3 నెలల తరువాత బెయిలు మంజూరైంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి, బెదరించి ఆ కేసు ఉపసంహరించుకునేలా చేసిన కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అమెరికా, చైనా ఫైటర్‌ జెట్లను చూసుకుని తమ వాయుసేన బలంపై పాకిస్థాన్ మిడిసిపడింది. అయితే తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌లో ఆ దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్‌ చావు దెబ్బ తీసింది. అత్యంత కచ్చితత్వంతో దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.