ఎప్పుడెలా ఉండాలి!

Publish Date:Sep 12, 2016

Advertisement

 

అతనో రాజకుమారుడు. ఓ మహాసామ్రాజ్యానికి వారసుడు. అలాంటి రాజకుమారుడి పుట్టినరోజు వచ్చింది. వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యంలోని పెద్దలంతా రాజకుమారుని స్థాయికి తగినట్లుగా తలా ఓ విలువైన కానుకా అందించారు. చివరగా రాజకుమారుడికి విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువుగారి వంతు వచ్చింది. ఆయన నిదానంగా ఒక చిన్న పెట్టెను తన సంచిలోంచి బయటకు తీసి రాజకుమారుడి చేతిలో పెట్టాడు. ఆ పెట్టెలో ఏముంటుందా అని ఆశ్చర్యంగా ఎదురుచూసిన రాజకుమారుడికి మూడు మట్టి బొమ్మలు కనిపించాయి. గురువుగారు తమ కుటుంబాన్ని అవహేళన చేసేందుకే ఆ మట్టి బొమ్మలు ఇచ్చారనుకుని రాజుగారి మొహం ఎర్రబడిపోయింది. ‘ఈ బహుమతి ఇవ్వడం వెనుక మీ ఉద్దేశం తెలుసుకోవచ్చా!’ అని అడిగారు రాజుగారు.

 

‘రాజా! ఈ మూడు బొమ్మలూ సామాన్యమైవి కావు. ఇవి మూడు స్వభావాలను ప్రతిబింబిస్తాయి. కావాలంటే చూడండి...’ అంటూ ఒక దారాన్ని తీసుకుని మొదటి బొమ్మ చెవిలోంచి పోనిచ్చాడు. అది నేరుగా రెండో చెవిలోంచి బయటకు వచ్చింది. ‘కొంతమంది అవతలివారు ఏం చెబుతున్నారో వినకుండా ఈ చెవి నుంచి విని, ఆ చెవిలో వదిలేస్తారు. అలాంటి స్వభావానికి ప్రతీక ఈ బొమ్మ!’ అన్నారు గురువుగారు.

 

ఇక రెండో బొమ్మ చెవిలోంచి కూడా ఒక దారాన్ని పోనిచ్చారు గురువుగారు. అది నోట్లోంచి బయటకు వచ్చింది. ‘కొంతమంది తాము విన్న విషయాన్ని మనసులో దాచుకోలేరు. దాన్ని పదిమందికీ చేరవేస్తే కానీ వారికి తృప్తిగా ఉండదు,’ అంటూ నవ్వారు గురువుగారు.

 

గురువుగారి చేష్టలను చూసిన రాజకుమారుడిలో ఆసక్తి పెరిగిపోయింది. ఆఖరుగా ఉన్న చివరి బొమ్మ ఎలాంటి స్వభావాన్ని సూచిస్తుందా అని అంతా ఉత్కంఠంగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. కానీ ఆశ్చర్యం! మూడో బొమ్మ చెవిలోంచి వెళ్లిన దారం బయటకు రానేలేదు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తెలిసిన విషయాన్ని బయటకు చెప్పని స్వభావానికి ప్రతీక ఈ బొమ్మ!’ అంటూ విడమరిచారు గురువుగారు.

 

‘బాగుంది! ఇంతకీ ఈ బొమ్మలలో వేటి స్వభావాన్ని అనుసరించడం మంచింది!’ అని వినయంగా అడిగాడు రాజకుమారుడు.
‘మూడింటినీ అనుసరించాల్సిందే!’ అన్నారు గురువుగారు చిరునవ్వుతో. ‘పనికిరాని విషయాలను వినీవిననట్లు ఉండాలి. ఈ చెవి నుంచి విని ఆ చెవితో వదిలేయాలి. మంచి విషయాలు, నలుగురికీ మేలు చేసే విషయాలను పదిమందితోనూ పంచుకోవాలి. ఇక పాలనకు సంబంధించిన విషయాలు, ఇతరుల వ్యక్తిగత రహస్యాలు ఎప్పటికీ మన మనసులోనే ఉంచుకోవాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విచక్షణను అలవర్చుకోవడమే పాలకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం,’ అంటూ వివరించారు గురువుగారు. గురువుగారు ఇచ్చిన ఆ బహుమతి ముందు మిగతా విలువైన బహుమతులన్నీ వెలవెలబోయాయి.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

...Nirjara

By
en-us Political News

  
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.