Publish Date:Jul 26, 2025
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కోశాధికారి శ్రీనివాస్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి రాజేంద్రయాదవ్ లకు బెయిలు లభించింది. అదలా ఉంచితే.. ఈ కేసులో అరెస్టైన హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహనరావును కస్టడీని పొడిగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
ఇలా ఉండగా హెసీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్ లు మల్కాజ్ గిరి కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు పిటిషన్లపై కోర్టు సోమవారం (జులై 28) విచారించే అవకాశం ఉంది. అదలా ఉంచితే హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, సీఈవో సునీల్, కోశాధికారి శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు చెందిన కవిత, రాజేంద్రయాదవ్ లను వేర్వేరు కేసులలో పోలీసులు అరెస్టు చేశారు. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం తదితర అభియోగాలపై ఈ అరెస్టులు జరిగాయి. హెచ్ సీఏ జగన్ మోహనరావును అయితే ఫోర్జరీ ద్వారా 23 కోట్ల రూపాయలను దోచుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఐపీఎల్ 2025 టికెట్ల కోసం బెదరించారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి. అది పక్కన పెడితే ఈ కేసులో హెచ్ సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ ను పోలీసులు పుణెలో అదుపులోనికి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో సీఐడీ ఇంత వరకూ ఆరుగురిని అరెస్టు చేయగా, వారిలో ముగ్గురికి బెయిలు లభించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/three-accused-got-bail-25-202775.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.