Publish Date:Oct 25, 2024
ఫార్ములా ఈ రేస్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది . గత బిఆర్ ఎస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు సేకరించింది . హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్ లో ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయమే రాకపోగా 55 కోట్ల రూపాయలను నిర్వహణ సంస్థకు ముట్ట జెప్పాల్సి వచ్చింది. ఈ కుంభకోణాన్ని వెలికి తీసింది ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇది ట్రై పార్టీ అగ్రిమెంట్ అని ఆయన వెల్లడించారు. ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటే రాష్ట్రానికి లాభం ఉండదు . కేవలం నిర్వాహకులకు మాత్రమే ఉంటుంది. అప్పట్లో అధికారంలో ఉన్న కెటీఆర్ ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ . తన బావమరిదికి చెందిన నిర్వహణ సంస్థకే ఫార్ములా ఈ రేస్ ప్రాజెక్ట్ అప్పగించారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేయడానికే ఈ ప్రాజెక్ట్ అని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. నిరుడు ఫిబ్రవరి 11న ఒక దఫా ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఈ యేడు ఫిబ్రవరి లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దయ్యింది . ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ ను తీవ్రంగా వ్యతిరేకించారు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అప్పటి మున్సిపల్ మంత్రి కెటీఆర్ కనుసన్నల్లో జరిగింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించారు అరవింద్ కుమార్ ఆఘ మేఘాల మీద నిర్వహణ సంస్థకు 55 కోట్ల రూపాయలు ముట్టజెప్పారు . కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అరవింద్ కుమార్ కు మెమో ఇచ్చింది . కెటీఆర్ ఆదేశాలమేరకే 55 కోట్ల రూపాయలను ఈ ఫార్ములా రేస్ నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అవినీతి నిరోధక శాఖ ను విచారణ జరపాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-race-trap-is-the-formula-that-is-tightening-ktr-neck-39-187370.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.